మినిస్టర్ క్వార్టర్స్ లో బీసీ సంక్షేమ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్షా సమావేశం

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని ప్రతిబింబించేలా తెలంగాణ రైజింగ్ -2047 పాలసీ లో బాగంగా గ్లోబల్ సమ్మిట్ లో బీసీ సంక్షేమ శాఖ లో తీసుకోవాల్సిన అంశాలపై సమీక్షా సమావేశంలో చర్చ. బీసీ సంక్షేమ శాఖ లో భవిష్యత్ ప్రగతి కి విద్య మార్గమని దానికి ప్రథమ ప్రాధాన్యత కల్పించేలా చర్యలు

తెలంగాణ జనాభాలో వెనుకబడిన తరగతులు 56% శాతం ఉన్న వ్యవసాయం, చేతివృత్తులు, నైపుణ్యాలు మరియు సాంప్రదాయ వృత్తులకు వెన్నెముకగా నిలుస్తున్నారు. వారి సామాజిక ఆర్థిక పురోగతి రాష్ట్ర వృద్ధికి కీలకమైనది. విజన్ 2047 లో బీసీలు విద్యాపరంగా బలంగా, ఆర్థికంగా స్వతంత్రంగా, సామాజికంగా సాధికారత సాధించి, ఆవిష్కరణ, నైపుణ్యాభివృద్ధి మరియు రాష్ట్ర వృద్ధికి చోదకంగా ప్రపంచవ్యాప్తంగా పోటీతత్వాన్ని ఎదుర్కునేలా చర్యలు తీసుకోవాలి.

Also Read-

విద్య & మానవ మూలధనం నిరంతరాయంగా నాణ్యమైన అభ్యాసం ద్వారా విద్యా ప్రమాణాలను బలోపేతం చేయడం మరియు మెరుగుపరచడం మరియు రెసిడెన్షియల్ సంస్థలు మరియు హాస్టళ్లను అత్యుత్తమ కేంద్రాలుగా అభివృద్ధి చేయాలి. ఉన్నత పాఠశాల నుండే ఆర్థిక అక్షరాస్యత, డిజిటల్ అక్షరాస్యత మరియు వ్యవస్థాపకతను పరిచయం చేయాలి. గ్లోబల్ సమ్మిట్ లో చర్చించి రైజింగ్ తెలంగాణ విజన్ 2047 లో పలు కీలక అంశాలు చేర్చనున్నారు. సమీక్షా సమావేశంలో బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్, గురుకుల సెక్రటరీ సైదులు, బీసీ సంక్షేమ శాఖ అడిషనల్ డైరెక్టర్ అలోక్ కుమార్ ఇతర అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

Archives

Categories

Meta

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

X