చారిత్రక పర్వతగిరి శివాలయంలో రెండో రోజు పున:ప్రతిష్ట పూజలు
మహా లింగార్చన, పంచామృత అభిషేకంలో పాల్గొన్న మంత్రి దయాకర్ రావు కుటుంబ సభ్యులు, గ్రామస్తులు
పర్వతగిరి: చారిత్రక ప్రాశస్త్యంతో.. నాటి కాకతీయుల కళా వైభవ వారసత్వంతో విలసిల్లన వరంగల్, పర్వతగిరి, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మరియు గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు స్వగ్రామం, జన్మస్థానం తెలంగాణ ప్రభుత్వంలో పున: వైభవాన్ని సంతరించుకుంటోంది.
![](https://telanganasamachar.online/wp-content/uploads/2023/01/errabelli1-3.jpg)
గొప్ప సంస్కృతి, సంప్రదాయాలకు ఆలవాలమైన తెలంగాణ ప్రాంతం, సమైక్య పాలనలో నిర్లక్ష్యానికి గురికాగా…తెలంగాణ స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసిఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ సంప్రదాయాలు, చరిత్ర, కళలు, కట్టడాలు మళ్లీ వికసిస్తున్నాయి. భావితరాలకు వారసత్వ విలువలను తెలియజేస్తున్నాయి.
![](https://telanganasamachar.online/wp-content/uploads/2023/01/errabelli3-1024x684.jpg)
ఈ కోవలోనే వరంగల్ జిల్లా, పర్వతగిరిలో 800 ఏళ్లనాటి పర్వతాల శివాలయం స్థానిక ఎర్రబెల్లి రామ్మోహన్ రావుగారి చొరవతో, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుగారి ప్రోత్సాహంతో పున: ప్రతిష్ట చేసుకుంటోంది.
![](https://telanganasamachar.online/wp-content/uploads/2023/01/bhaktaram.1-17.jpg)
పర్వతాల మధ్య కొలువైన శివయ్యకు నేడు పున:ప్రతిష్ట కార్యక్రమంలో భాగంగా రెండో రోజు పూజలు నేటి వేకువజామునే ప్రారంభం అయ్యాయి. ఈరోజు ఉదయం మహాలింగార్చన, పంచామృత అభిషేక కార్యక్రమాలతో, పవిత్ర శివనామస్మరణతో పర్వతగిరి పరిసరాలన్నీ మంత్రజపాలతో పునీతం అయ్యాయి.
![](https://telanganasamachar.online/wp-content/uploads/2023/01/errabelli4-1024x684.jpg)
మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు, ఎర్రబెల్లి ట్రస్ట్ చైర్ పర్సన్, మంత్రి సతీమణి శ్రీమతి ఉషా దయాకర్ రావుగారు, కుటుంబ సభ్యులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు, భక్తులు మహాలింగార్చన, పంచామృత అభిషేకాల్లో పాల్గొని శివార్చన చేస్తున్నారు. ఈరోజు ఉదయం 5 గంటలకు మేలుకొలుపుతో ప్రారంభమైన పరమేశ్వరుని పూజలు రాత్రి 8 గంటలకు ధాన్యాదివాసంతో ముగుస్తాయి.
![](https://telanganasamachar.online/wp-content/uploads/2023/01/errabelli5-1024x684.jpg)
రేపు 28వ తేదీ ఉదయం మళ్లీ మేలుకొలుపుతో ప్రారంభమయ్యే పరమశివుని పూజా కార్యక్రమాల్లో మంత్రి హరీష్ రావుగారు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, చైర్మన్లు, స్థానిక ప్రజా ప్రతినిధులు, బిఆర్ఎస్ నాయకులు, గ్రామస్థులు పెద్ద ఎత్తున పాల్గొననున్నారు.
![](https://telanganasamachar.online/wp-content/uploads/2023/01/errabelli2-1024x526.jpg)