హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌరవనీయులైన ఎనుముల రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు, హైదరాబాద్లోని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్లో గిరిజన లంబాడా కులానికి చెందిన ముఖ్య ప్రజాప్రతినిధులు, అగ్రనేతల ఉన్నత స్థాయి సమావేశం ఈరోజు నిర్వహించబడింది.
గౌరవనీయులైన కీర్తిశేషులు, దివంగత భారత మాజీ ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరా గాంధీ గారు 18-09-1976న బంజారాలను షెడ్యూల్డ్ తెగల (ST) జాబితాలో చేర్చుతూ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. బంజారా సమాజానికి ఇందిరమ్మ కల్పించిన ఈ రిజర్వేషన్లు 50 వసంతాలు పూర్తి చేసుకుంటున్న (స్వర్ణోత్సవ) శుభ సందర్భాన్ని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా ఉత్సవాలు, ఇందిరాగాంధీ చిత్రపటానికి పాలాభిషేకాలు నిర్వహించాలని ఈ సమావేశంలో తీర్మానించారు.

ఆనాడు ఇందిరాగాంధీ గారు తీసుకున్న విప్లవాత్మక నిర్ణయం వల్లే నేడు బంజారా సమాజానికి సామాజిక న్యాయం చేకూరిందని, విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాలలో గిరిజన బిడ్డలు ఉన్నత స్థానాల్లో రాణిస్తున్నారని నేతలు కొనియాడారు. ఉత్సవాల విధివిధానాల ఖరారు: ఈ సమావేశంలో బంజారా స్వర్ణోత్సవ వేడుకలకు సంబంధించిన విధివిధానాలను (Route Map) రూపొందించారు.
Also Read-
రాష్ట్రవ్యాప్త ర్యాలీలు: రాబోయే జూన్ నెలలో తెలంగాణలోని ప్రతి గ్రామం, మండలం మరియు జిల్లా కేంద్రాలలో భారీ ఎత్తున ప్రదర్శనలు, ర్యాలీలు,బసు యాత్ర, డిజిటల్ వాహనం, చేపట్టనున్నారు. దీనికి సంబంధించిన ప్రారంభ తేదీలను త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తారు.

హైదరాబాద్లో మెగా బైక్ ర్యాలీ: రాజధాని హైదరాబాద్ నగరంలో దాదాపు 2000 మంది గిరిజన యువకులతో భారీ బైక్ ర్యాలీని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని ప్రతిపాదించారు.
ఈ కీలక సమావేశంలో గిరిజన లంబాడా సమాజానికి చెందిన ప్రముఖ నాయకులు పాల్గొన్నారు:
పోరిక బలరాం నాయక్ (గౌరవ పార్లమెంట్ సభ్యులు – MP)
కేతావత్ శంకర్ నాయక్ (గౌరవ శాసనమండలి సభ్యులు – MLC)
మలోత్ రామ్దాస్ నాయక్ (గౌరవ శాసనసభ సభ్యులు – MLA)
సభావత్ రాములు నాయక్,మాజీ ఎమ్మెల్సీ
ధరావత్ రవీందర్ నాయక్ (మాజీ మంత్రివర్యులు)
డా. తేజావత్ బెల్లయ్య నాయక్ (TG TRICOR ఛైర్మన్)
డి. వెంకన్న నాయక్ (TPCC అధికార ప్రతినిధి)
కిషన్ సింగ్ రథోడ్ (అల్ ఇండియా బంజారా సేవ సంఘ్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్)
సభావత్ సుభాస్ నాయక్ (కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు)
ప్రతాప్ సింగ్ రథోడ్ (అల్ ఇండియా బంజారా సేవ సంఘ్ రాష్టా నాయకులు)
బళ్ళు నాయక్ (కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు)
అమర్ సింగ్ పవార్ (అల్ ఇండియా బంజారా సేవ సంఘ్ జాతీయ నాయకులు)
సేవాలాల్ రథోడ్ (అల్ ఇండియా బంజారా సేవ సంఘ్ తెలంగాణ రాష్ట్ర యూత్ ప్రెసిడెంట్)
పాలత్య హరినాయక్
ఈ స్వర్ణోత్సవ కృతజ్ఞతా కార్యక్రమాలలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గిరిజన ప్రజాప్రతినిధులు, సంఘాల నాయకులు, గిరిజన ఉద్యోగులు, మహిళలు మరియు యువత పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని నేతలు పిలుపునిచ్చారు.
