హైదరాబాద్ : వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని తెలంగాణ ప్రజలందరికీ టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో ప్రజల జీవితాల్లో సకల విఘ్నాలు తొలగిపోయి, ప్రతి ఒక్కరికీ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, శాంతి, సౌభాగ్యం కలగాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

Also Read-
తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజాపాలన ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధిని రెండు కళ్ల సిద్ధాంతంగా ముందుకు తీసుకెళ్తోందని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ప్రజల సంక్షేమంతో పాటు రాష్ట్ర అభివృద్ధికి ప్రభుత్వం సమతుల్య ప్రాధాన్యత ఇస్తూ ముందుకు సాగుతోందని తెలిపారు.
