तेलंगाना बंद सफल, शैक्षिण संस्थान और व्यापार प्रतिष्ठान रहे क्लोज

हैदराबाद : तेलंगाना में अलसुबह 4 बजे से बंद जारी है। बीसी जेएसी संघों के नेता सड़कों पर आ गये हैं। नेताओं ने तेलंगाना के सभी जिलों के बस डिपो के सामने बैठकर बसों को रोक दिया। इसके अलावा सभी स्कूल, कॉलेज और व्यापार प्रतिष्ठानों को स्वेच्छा से बंद किये हैं।

पिछड़ा वर्ग संयुक्त कार्रवाई समिति (बीसी जेएसी) के आह्वान पर तेलंगाना में बंद शांतिपूर्ण ढंग से जारी है। यह बंद हाईकोर्ट के उस आदेश के खिलाफ बुलाया गया है, जिसमें स्थानीय निकाय चुनावों में पिछड़े वर्गों को दिए गए 42 फीसदी आरक्षण पर रोक लगाई गई है। इस बंद को सत्तारूढ़ कांग्रेस समेत सभी राजनीतिक दलों का समर्थन मिला है।

समिति के अध्यक्ष और भारतीय जनता पार्टी के राज्यसभा सांसद आर कृष्णय्या ने पहले ही सभी राजनीतिक दलों और नागरिक संगठनों से बंद को समर्थन देने की अपील की थी। आपातकालीन और आवश्यक सेवाओं को छोड़कर सभी क्षेत्रों से बंद में सहयोग करने की अपील की गई है। 

तेलंगाना हाईकोर्ट ने नौ अक्तूबर को राज्य सरकार के उस आदेश पर अंतरिम रोक लगा दी थी, जिसमें स्थानीय निकाय चुनावों में पिछड़ा वर्ग समुदाय को 42 फीसदी आरक्षण देने की बात कही गई थी। 

इस विरोध के तहत विभिन्न राजनीतिक दलों और पिछड़ा वर्ग संगठनों के नेता तेलंगाना राज्य सड़क परिवहन निगम की बस डिपो के बाहर धरना दिया और बसों को बाहर निकलने से रोक दिया हैं। भाजपा के लोकसभा सांसद ईटेला राजेंदर ने जुबली बस स्टेशन पर बंद में हिस्सा लिया।

तेलंगाना जागृति की संस्थापक और बीआरएस नेता के. कविता ने भी धरना दिया और मीडिया से कहा कि अदालत को आरक्षण के पक्ष में राजी करने में सरकार विफल रही है। उन्होंने कहा, चाहे कांग्रेस हो या भाजपा, पिछड़ा वर्ग समुदाय को गुमराह करना बंद करें। अगर स्थानीय चुनाव अभी नहीं भी होते तो कोई फर्क नहीं पड़ता। पहले पिछड़ा वर्ग के लिए आरक्षण सुनिश्चित करें। इसी क्रम में तेलंगाना जागृति प्रमुख के कविता और अनेक नेताओं ने खैरताबाद के पास आयोजित मानवश्रृंखला में भाग लिया।

टीएसआरटीसी के एक वरिष्ठ अधिकारी ने बताया कि सुबह के समय बस स्टेशनों और डिपो में सेवाएं कुछ देर के लिए प्रभावित रहीं। तेलंगाना की सत्तारूढ़ कांग्रेस पार्टी ने शुक्रवार को पिछड़ा वर्ग संयुक्त समिति द्वारा बुलाए गए इस बंद को समर्थन देने की घोषणा की थी। भाजपा और बीआरएस ने भी बंद को समर्थन दिया है। 

उपमुख्यमंत्री मल्लू भट्टी विक्रमार्क ने एक बयान में कहा, मैं सभी लोगों और सभी समुदायों से अपील करता हूं कि वे 18 अक्तूबर को आयोजित बंद में भाग लें, जो भाजपा के खिलाफ पूरे राज्य में आयोजित किया जा रहा है। 

इसी क्रम में तेलंगाना के पुलिस महानिदेशक बी शिवधर रेड्डी ने शुक्रवार को एक बयान जारी कर सभी संगठनों से अपील की कि बंद शांतिपूर्ण तरीके से हो और जनता को किसी तरह की असुविधा न हो। उन्होंने चेतावनी दी कि यदि कोई व्यक्ति बंद के नाम पर अशांति या अवैध गतिविधियों में शामिल होता है तो उसके खिलाफ सख्त कार्रवाई की जाएगी।

यह भी पढ़ें-

तेलंगाना बंद को कांग्रेस, बीआरएस, बीजेपी, सीपीआई, सीपीआईएम, माओवादी और सभी बीसी संगठनों ने बंद को समर्थन दिया है। पिछड़ी जाति को 42 फीसदी आरक्षण की मांग के समर्थन में आंदोलनकारी पोस्टर से प्रदर्शन किया है। बंद शाम 5 तक रहने की संभावना है।

రాజ్యాంగపరంగా బీసీలకు రిజర్వేషన్ కావాలి

హైదరాబాద్ లో బంద్ లో పాల్గొన్న ఎమ్మెల్యే పాయల్ శంకర్

బీసీలకు 42 శాతం రిజర్వేషన్ పార్టీలు కల్పిస్తే తీసుకునేందుకు బీసీలు ఏ పార్టీ నేతల మోచేతి నీళ్లు తాగేవారుకాదని, రాజ్యాంగబద్ధంగా రిజర్వేషన్ కావాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ డిమాండ్ చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ బీసీ జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన బంద్ లో ఆయన పాల్గొన్నారు. శనివారం హైదరాబాద్ లోని అంబర్పేట్ నియోజకవర్గ బర్కత్ పూర డివిజన్ లో నిర్వహించిన బంద్ లో బీసీ సంక్షేమ నేత ఆర్. కృష్ణయ్య , బీజేపీ శ్రేణులతో కలిసి ఎమ్మెల్యే నిరసన వ్యక్తం చేసారు. స్వయంగా ఎమ్మెల్యే బైక్ నడుపుతూ ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం బర్కత్ పూర ఆర్టీసీ డిపో ఎదుట బైఠాయించి బస్సులు బైటకు రాకుండా అడ్డుకున్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ…. చట్టసభల్లో బీసీలకు అన్యాయం జరుగుతోందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమాన్ని ఏవిధంగానైతే కొందరు నీరుగారిచేందుకు యత్నించరో, అదేవిధంగా బీసీ రిజర్వేషన్ ఉద్యమాన్ని సైతం వ్యతిరేకించేందుకు చూస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి కుట్రలు ఎవ్వరు చేసినా అడుగడుగున బీసీలు అడ్డుకుంటారని పేర్కొన్నారు.

బీసీ బంద్‌ షాపులపై దాడులు

హైదరాబాద్ : స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధనకు బీసీ జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిచ్చిన బంద్ సక్సెస్‌ఫుల్‌గా సంపూర్ణంగా కొనసాగుతోంది. ఈ బీసీ బంద్‌కు రాష్ట్రంలోని ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, సీపీఐ, సీపీఎం, టీజేఎస్, సీపీఐఎంఎల్‌ న్యూడెమోక్రసీ, మావోయిస్టు పార్టీలతో పాటు ఎమ్మార్పీఎస్, మాల మహానాడు, ఆదివాసీ, గిరిజన, మైనార్టీ, విద్యార్థి, ప్రజాసంఘాలు, మేధావులు మద్దతు ప్రకటించారు.

అయితే, హైదరాబాద్‌ లోని నల్లకుంట పరిధిలో బంద్ తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. బంద్‌ను బేఖాతరు చేయకుండా తెరిచి ఉన్న బజాజ్ షో‌ రూంతో పాటు రాఘవేంద్ర టిఫిన్ సెంటర్‌పై ఆందోళనకారులు పెద్ద పెద్ద సిమెంట్ బ్లాక్స్ విసిరారు. దీంతో షోరూం అద్దాలు ధ్వంసమై చెల్లాచెదురుగా పడిపోయాయి. అదేవిధంగా తెరిచి ఉంచిన పెట్రోల్ బంక్‌పై బీసీ సంఘం నాయకులు దాడికి పాల్పడ్డారు. అనంతరం పోట్రోల్ కొట్టే ఫ్యూయల్ మెషిన్లను వారు ధ్వంసం చేశారు. ఈ మేరకు విషయం తెలుసుకున్న లోకల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సద్దుమణిగేలా చేశారు.

బీసీల బంద్ కు మద్దతుగా తెలంగాణ జాగృతి

ఇంతకముందూ బీసీల బంద్ కు మద్దతుగా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఖైరతాబాద్ చౌరస్తా లో మానవహారం, పాల్గొన్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత, యూపీఎఫ్, తెలంగాణ జాగృతి నాయకులు గంటపాటు ఖైరతాబాద్ చౌరస్తాలో మానవహారంలో పాల్గోన్నరు.

కవిత మాట్లాడుతూ… బీసీ బిడ్డలు తమకు రిజర్వేషన్లు కావాలని కోరుతున్నారు.రిజర్వేషన్లు ఇచ్చే పార్టీలే బంద్ కు మద్దతు ప్రకటించటం నవ్వులాటగా ఉంది. దొంగ జీవోలు ఇచ్చిన కాంగ్రెస్, బీసీ బిల్లును పాస్ చేయించాల్సిన బీజేపీ లు బంద్ కు మద్దతు పేరుతో డ్రామాలు చేస్తున్నాయి. హంతకులే వచ్చి నివాళులు అర్పించినట్లు వ్యవహరిస్తున్నారు. బీసీ బిడ్డలను పదే పదే మోసం చేస్తున్నారు.

స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి బీసీలను మోసం చేస్తున్నారు. తెలంగాణ ఉద్యమం మాదిరిగా మరో బీసీ ఉద్యమాన్ని చేపడతాం. తెలంగాణ బీసీ బిడ్డల పంతం దేశానికి ఆదర్శంగా నిలవాలి. యూనైటెడ్ ఫూలే ఫ్రంట్ ఆధ్వర్యంలో జాగృతి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.బీసీ బంద్ ను విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరినీ కోరుతున్నా. బీసీల రిజర్వేషన్లు అమలు చేసేలా టెక్నికల్ గా ప్రభుత్వాలు సరైన వాదనలు వినిపించటం లేదు. ఈ కారణంగానే బీసీలకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో తీర్పులు వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ రూల్స్ ప్రకారం జనగణన నిర్వహించలేదు. జీవో 9 విషయంలో కూడా కాంగ్రెస్ కు చిత్తశుద్ధి లేదు. అందుకే కోర్టు జీవో ను కొట్టేసింది. బీసీల రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్, బీజేపీలకు చిత్తశుద్ధి లేదు. ఇప్పటికిప్పుడే ఎన్నికలు జరగాల్సినంత తొందర ఏముంది?

మహారాష్ట్ర, తమిళనాడు లో 5 ఏళ్ల వరకు ఎన్నికలు జరగలేదు. బీసీలకు రిజర్వేషన్ల అంశం తేలిన తర్వాత ఎన్నికలు నిర్వహించాలి. సర్పంచ్ లకు బిల్లులు ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ వారిని ఇబ్బంది పెడుతోంది. బీసీ రిజర్వేషన్లను అమలు చేయాల్సిన పార్టీలు చిత్తశుద్ధి పనిచేయాలని నేను డిమాండ్ చేస్తున్న. బొల్ల శివశంకర్, యూపీఎఫ్ కన్వీనర్ 78 ఏళ్లుగా బీసీలు రాజ్యాధికారం కోసం కొట్లాడుతున్నారు.

కానీ రాజకీయ పార్టీలు బీసీ లను మోసం చేస్తున్నాయి. రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ డ్రామాలు చేస్తోంది. రాష్ట్రపతి వద్ద బిల్లును పాస్ చేయించకుండా బీజేపీ కూడా నాటకాలు ఆడుతోంది. బీఆర్ఎస్ కూడా కుల గణన చేయకుండా మోసం చేసింది. జూబ్లీహిల్స్ లో బీసీల ఓట్ల కోసం కాంగ్రెస్ నాటకం చేస్తోంది. ఏ పార్టీ కూడా బీసీలకు మంచి చేయటం లేదు. బీసీలు మూడో ఫ్రంట్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. దొంగ మాటలు చెప్పే పార్టీలకు బీసీలంతా బుద్ది చెప్పే రోజు వస్తుంది. రిజర్వేషన్ల విషయంలో తుతు మంత్రంగా చేతులు దులుపుకునే ప్రయత్నం చేయవద్దు. బీసీలు మీ చెప్పు చేతల్లో లేరు. మీ పాపాల లెక్కను మేము రాసుకుంటాం. బీసీలను మోసం చేస్తున్న అన్ని పార్టీలకు రాబోయే రోజుల్లో బుద్ది చెబుతాం. బీసీల పట్ల మద్దతు ఇవ్వాలని కోరుతున్నాం.

తెలంగాణలో కాంగ్రెస్ నాయకులు

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు దక్కాలని ఈ రోజు చేపట్టిన రాష్ట్ర బంద్ కు అన్ని పక్షాలు సంఘీభావం తెలపాలని ఎమ్మెల్సీ డాక్టర్ బల్మూర్ వెంకట్ కోరారు. రిజర్వేషన్ల విషయంలో కేంద్రం తీరుకు నిరసనగా.. నిజామాబాద్ లో బీసీ నాయకులతో కలిసి బంద్ లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ మాట్లాడుతూ… సామాజిక న్యాయం కోసం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోంది. జనాభాలో ఎవరి సంఖ్య ఎంత ఉంటుందో…వారికి ఆ మేరకు రిజర్వేషన్లు ఉండాలన్న రాహుల్ గాంధీ ఆశయాన్ని ఇక్కడ అమలు చేసే ప్రయత్నం చేస్తున్నాము. అయితే రాజకీయ ప్రయోజనాల కోసం బీజేపీ నేతలు పైకి సహకరించినట్లు ఇక్కడ చెబుతున్న కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మాత్రం సహకరించడం లేదు.

కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదించి పంపిస్తే.. చట్టబద్ధత కల్పించకుండా కేంద్రంలోని భాజపా ప్రభుత్వం అడ్డుపడుతోంది. నిజంగా బీసీలపై బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే….రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీలు, ఇద్దరు కేంద్ర మంత్రులు చొరవతీసుకుని….రాష్ట్రపతిని అఖిలపక్షంతో కలవడానికి ముందుకు రావాలని కోరారు.

బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం చట్ట పరంగా, న్యాయ పరంగా పోరాటం చేస్తున్నామని చెప్పారు. అంబర్ పేటలోని ప్రధాన కూడలి నుంచి తెలంగాణ జేఏసీ బీసీ బంద్ కి మద్దతుగా మోత రోహిత్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీలో పాల్గొన్న టీపీసీసీ అధ్యక్షులు శ్రీ మహేష్ కుమార్ గౌడ్ గారు,ఎమ్మెల్యే దానం నాగేందర్ గారు, మాజీ ఎంపీ వి. హనుమంతరావు, డిసిసి రోహిన్ రెడ్డిజ కూన శ్రీశైలం గౌడ్, టిపిసిసి జనరల్ సెక్రటరీలు మధు సత్యం గౌడ్,ఇందిరా శోభన్, పలువురు సీనియర్ నాయకులు అంబర్ పేట్ చౌరస్తా దగ్గర Tpcc చీఫ్ మహేష్ కుమార్ గౌడ్.

బంద్ విజయ వంతం అయ్యింది..ప్రజలు స్వచ్ఛందoగా బంద్ లో పాల్గొన్నారు. మాకు ఉన్న చిత్త శుద్ధి ఏపార్టీ కి లేదు. కుల సర్వే చేసాము..GOఇచ్చాము. కేంద్ర ప్రభుత్వం బీజేపీ బిసి బిల్లు ఆమోదం తెలపాలని త్వరలోనే సీఎం అధ్యక్షతన మోడీ నీ కలుస్తాము. ప్రభుత్వ పరంగా 42 శాతం తో ఎన్నికలు వెళ్లాలని చూస్తున్నాము. సాధ్య సాధ్యలు పరిశీలించిన తరువాత స్థానిక ఎన్నికల పై నిర్ణయం తీసుకుంటాము.

బీసీలకు 42% రిజర్వేషన్ల బిల్లులపై కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానానికి వ్యతిరేకంగా బీసీ బంద్ పాల్గొన్న మంత్రి వాకిటి శ్రీహరి ఆర్టీసీక్రాస్ రోడ్ పక్కన ముషీరాబాద్ డిపో2 వద్ద బైఠాయించి నిరసన వ్యక్తం చేసిన మంత్రి వాకిటి శ్రీహరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి, కాంగ్రెస్ నాయకులు. బీసీ 42% రిజర్వేషన్ కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం పని బిల్లులను కేంద్రం వెంటనే ఆమోదం తెలిపి 9th షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్.

తెలంగాణ బంద్ లో బీఆర్ఎస్ నాయకులు…

మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ తెలంగాణ భవన్ లో మాట్లాడుతూ … తెలంగాణ వ్యాప్తంగా బీసీ బంద్ కొనసాగుతోంది. బీసీ రిజర్వేషన్ల పేరుతో కాంగ్రెస్ పెద్ద డ్రామా ఆడుతోంది. కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ ప్రభుత్వానికి బీసీలపై ఎలాంటి చిత్తశుద్ధి లేదు.
హైకోర్టు ఇచ్చిన స్టేతో బీసీలపై కాంగ్రెస్ పార్టీ వైఖరి బట్టబయలైంది. బీసీ లకు 42 శాతం రిజర్వేషన్ల పేరుతో కాంగ్రెస్ పార్టీ ద్రోహం చేసింది. కేవలం కాంగ్రెస్ పార్టీ వ్యవహరించిన మోసపూరిత విధానాలుతో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ దక్కకుండా పోయింధి.

కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో బీసీలను మభ్యపెట్టారని చూశారు. కానీ బీసీలు వాస్తవాలను తెలుసుకున్నారు. బీసీల రిజర్వేషన్ల పేరుతో బీసీలను మోసం చేయడం దారుణం. చెల్లెని జీవోలను, ఆర్డినెన్స్లను విడుదల చేశారు. సమస్యలు పరిష్కరించే నాధుడే కరువయ్యాడు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి తెలంగాణ ప్రజలను మభ్యపెట్టి మోసం చేస్తున్నాయి.

కామారెడ్డి డిక్లరేషన్ బూటకం

మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం లోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద BRSపార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన బీసీ బంద్ కార్యక్రమంలో మాజీ మంత్రివర్యులు వి శ్రీనివాస్ గౌడ్ గారు పాల్గొని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు బీసీ లకు చట్టసభలలో మరియు విద్యా, ఉద్యోగాలలో 42% చట్టబద్ధమైన రిజర్వేషన్లు కల్పించిన తర్వాతనే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేయడం జరిగింది.

గంగుల కమలాకర్,మాజీమంత్రి..

బీసీ బంద్ లో కాంగ్రెస్,బీజేపీ పాల్గొంటున్నాయి. మొక్కుబడిగా బీసీ బంద్ లో కాంగ్రెస్, బీజేపీ భాగస్వామ్యం కావద్దు. బీసీలకు రాజ్యాంగ సవరణ ద్వారానే 42 శాతం రిజర్వేషన్లు వస్తాయి. బీసీ రిజర్వేషన్లు తగ్గిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయి. బీసీలకు ఒక్క శాతం రిజర్వేషన్ తగ్గవద్దు.

ఎంజీబీఎస్ ఇమ్లీబన్ బస్టాండ్ వద్ద బీసీ సంఘం నాయకులతో కలిసి బీసీ బంద్ నిరసన కార్యక్రమంలో పాల్గొన్న టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్

ఏమి సాధించింది తెలంగాణ బీసీ బంద్

తెలంగాణ రాజకీయం బీసీ రిజర్వేషన్ల అంశంతో అట్టుడుకుతోంది. తమ వాటా తమకు దక్కాల్సిందేనంటూ బీసీ జేఏసీ ఇచ్చిన పిలుపుతో ఇవాళ రాష్ట్రమంతటా బంద్ కొనసాగుతోంది. ఈ బంద్‍కు రాష్ట్రంలోని అన్ని ప్రధాన పార్టీలు మద్దతు ఇచ్చాయి. ఈ క్రమంలో ఇవాళ ఉదయం నుంచే ఆయా పార్టీలు బీసీ రిజర్వేషన్ల కోసం రోడెక్కాయి. ఈ బంద్ సందర్భంగా ప్రధాన పార్టీల మధ్య మొదలైన ఈ డైలాగ్ వార్ ఇప్పుడు తెలంగాణలో రాజకీయ యుద్ధంగా మారింది. పార్టీల మధ్య మాటల దాడి దిపావళి బాంబుల కంటే పవర్ ఫుల్‍గా పేలుతున్నాయి. దీంతో ఈ బంద్ ప్రభావం ఎలాంటి పరిణామాలకు దారి తీయబోతోంది అనేది ఉత్కంఠగా మారింది.

బీసీ రిజర్వేషన్ల అంశంలో తప్పు మీదంటే మీదని కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య డైలాగ్ వార్ మొదలైంది. పరస్పర విమర్శలతో పార్టీలన్నీ దూకుడు పెంచాయి. బీజేపీ కిరికిరి వల్లే రిజర్వేషన్లు ఆగిపోయాయని కాంగ్రెస్ ఆరోపిస్తుంటే, బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదని బీజేపీ కౌంటర్ ఇస్తోంది. ఇక కాంగ్రెస్, బీజేపీలు డ్రామాలాడుతున్నాయని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఇదిలా ఉంటే బీసీ రిజర్వేషన్లపై పొలిటికల్ వార్ కాస్త క్రెడిట్ వార్‍గా మారిందనే విమర్శలు నెటిజన్ల నుంచి వినిపిస్తున్నాయి. ఇవాళ్టి బంద్ లో పాల్గొన్న అన్ని పార్టీలు ప్రత్యర్థులను దోషులుగా చూపించే ప్రయత్నం చేస్తూ తాము నిజాయితీగానే ఉన్నామని నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నాయని అన్ని పార్టీలు సానుకూలంగా ఉంటే బీసీ రిజర్వేషన్లకు అడ్డు ఇంకేంటని ప్రశ్నిస్తున్నారు. కేవలం బీసీల వద్ద బద్నాం కాకూడదనే పార్టీలు ఇలా పోటీ పడి మరీ ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటున్నారని సామాన్య ప్రజలు, నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇవాళ్టి బంద్ తర్వాత పరిణామాలు ఏంటి అనేది రాష్ట్ర రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై మీ నిర్ణయం ఏంటో చెప్పాలని ఎన్నికల సంఘానికి, రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. ఇక అధికార కాంగ్రెస్ పార్టీ తాము బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చాకే ఎన్నికలకు వెళ్తామని కుండబద్దలు కొడుతోంది. బీసీలకు రిజర్వేషన్ల అంశం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ అని దాన్ని ఆ పార్టీనే సాల్వ్ చేయాలని బీజేపీ, బీఆర్ఎస్‍లు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ జరుగుతున్న బంద్ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి నిర్ణయాలు రాబోతున్నాయి? ప్రతిపక్షాలు, బీసీ సంఘాలు ఎలాంటి వ్యూహం అమలు చేయబోతున్నాయి అనేది సస్పెన్స్ గా మారింది.

బీసీ బంద్ఎ, దోచుకుంటున్న క్యాబ్ డ్రైవర్లు

హైదరాబాద్​ లో బీసీ బంద్ తో ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి. సిటీలో అన్ని డిపోల్లో బస్సులు నిలిపివేశారు. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీపావళి పండుగలకు వెళ్లే ప్రజలకు బస్సులు లేకపోవడంతో ప్రైవట్​ ఆటోలు, క్యాబ్​ లను ఆశ్రయిస్తున్నారు. ప్రయాణికుల ఇబ్బందులను ఆసరాగా చేసుకొని అధిక ఛార్జీలను వసూలు చేస్తున్నారు. డబుల్​ రేట్లు వసూలు చేస్తున్నారు క్యాబ్​ డ్రైవర్లు.

బీసీ బంద్​సందర్భంగా ఉప్పల్​ రింగు రోడ్డు దగ్గర ప్రైవేట్​ క్యాబ్​డ్రైవర్లు అధిక ఛార్జీల దందా చేశారు. ఉప్పల్​ నుంచి హన్మకొండకు ప్రయాణికుల నుంచి సాధారణ రేట్లకంటే అధికంగా డబుల్ ఛార్జీలను వసూలు చేశారు. 300 రూపాయలు ఛార్జీ ఉండగా.. 700లకు పైగా వసూలు చేస్తున్నారు. ఒక్క ఉప్పల్​ రింగు రోడ్డులోనే కాదు.. ఎల్బీనగర్, సాగర్​రింగ్​రోడ్డు, సీబీఎస్ బస్ స్టేషన్ల దగ్గర ఊళ్లకు వెళ్లే ప్రయాణికులనుంచి అధిక ఛార్జీలు వసూలు చేయడంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X