हैदराबाद: तेलंगाना में पिछड़ी जातियों के लिए 42 प्रतिशत आरक्षण सुनिश्चित करने के उद्देश्य से शनिवार को बीसी जेएसी ने राज्य बंद का आह्वान किया है। सत्तारूढ़ कांग्रेस पार्टी ने इस आंदोलन को अपना पूर्ण समर्थन देने की घोषणा की है। प्रदेश कांग्रेस अध्यक्ष महेश कुमार गौड़ ने घोषणा की है कि आरक्षण के मुद्दे पर पीछे हटने का कोई इरादा नहीं है। मुख्य विपक्षी दल बीआरएस और भाजपा के साथ-साथ माओवादी दलों और भाकपा ने भी समर्थन दिया है। बंद के कारण स्कूलों और कॉलेजों में पहले ही छुट्टियां घोषित कर दी गई हैं। बंद के दौरान केवल मेडिकल सेवाओं को छूच दी गई है।
उपमुख्यमंत्री भट्टी विक्रमार्क ने कहा कि पिछड़ी जातियों के लिए तेलंगाना विधानसभा में आरक्षण विधेयक पारित करके केंद्र सरकार के पास भेजा गया है, लेकिन इसे लंबित रखा गया है। उन्होंने कहा कि मुख्यमंत्री रेवंत ने इस मुद्दे पर प्रधानमंत्री से मिलने के लिए पत्र लिखा था, लेकिन उन्होंने रेवंत रे्डडी को समय नहीं दिया। भट्टी विक्रमार्क ने खम्मम में मीडिया से बात की। भट्टी ने केंद्रीय मंत्री किशन रेड्डी, बंदी संजय और भाजपा प्रमुख रामचंद्र राव से अनुरोध किया कि वे पहल करें और सभी दलों को दिल्ली लेकर जाएँ। (एजेंसियाँ)
Also Read-
శనివారం తెలంగాణ బంద్
హైదరాబాద్ : తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాధించాలనే లక్ష్యంతో శనివారం రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చారు. అధికార కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించడంతో ఈ ఉద్యమానికి అనూహ్య బలం చేకూరింది. రిజర్వేషన్ల విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ప్రకటించారు. ఇటు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్, బీజేపీతో పాటు మావోయిస్టు పార్టీలు, సీపీఐ నుంచి కూడా మద్దతు లభించింది. బంద్ కారణంగా పాఠశాలలు, కళాశాలలు ఇప్పటికే సెలవులు ప్రకటించారు.
బీసీ రిజర్వేషన్ల బిల్లును తెలంగాణ అసెంబ్లీలో ఆమోదించి పంపినా కేంద్ర ప్రభుత్వం పెండింగ్లో పెట్టిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఈ విషయంపై ప్రధానిని కలిసేందుకు సీఎం రేవంత్ లేఖ రాసినా ఆయన సమయమివ్వలేదని చెప్పారు. ఖమ్మంలో భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడారు. రాష్ట్రానికి చెందిన కేంద్రమంత్రులు కిషన్రెడ్డి, బండి సంజయ్, బీజేపీ చీఫ్ రామచందర్రావు చొరవ తీసుకుని అఖిలపక్షాన్ని దిల్లీకి తీసుకెళ్లాలని భట్టి కోరారు.

మరోవైపు బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధన కోసం తెలంగాణ బీసీ జేఏసీ పిలుపునిచ్చిన బంద్ కు తెలంగాణ జాగృతి సంపూర్ణ మద్దతుబంద్ లో భాగంగా శనివారం ఉదయం 8 గంటలకు ఖైరతాబాద్ చౌరస్తాలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో మానవహారం కార్యక్రమం నిర్వహిస్తారు.. ఈ మానవహారంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు పాల్గొంటారు
తెలంగాణ బంద్ లో బీఆర్ఎస్ నాయకులు…
మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ తెలంగాణ భవన్ లో మాట్లాడుతూ … తెలంగాణ వ్యాప్తంగా బీసీ బంద్ కొనసాగుతోంది. బీసీ రిజర్వేషన్ల పేరుతో కాంగ్రెస్ పెద్ద డ్రామా ఆడుతోంది. కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ ప్రభుత్వానికి బీసీలపై ఎలాంటి చిత్తశుద్ధి లేదు.
హైకోర్టు ఇచ్చిన స్టేతో బీసీలపై కాంగ్రెస్ పార్టీ వైఖరి బట్టబయలైంది. బీసీ లకు 42 శాతం రిజర్వేషన్ల పేరుతో కాంగ్రెస్ పార్టీ ద్రోహం చేసింది. కేవలం కాంగ్రెస్ పార్టీ వ్యవహరించిన మోసపూరిత విధానాలుతో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ దక్కకుండా పోయింధి.
కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో బీసీలను మభ్యపెట్టారని చూశారు. కానీ బీసీలు వాస్తవాలను తెలుసుకున్నారు. బీసీల రిజర్వేషన్ల పేరుతో బీసీలను మోసం చేయడం దారుణం. చెల్లెని జీవోలను, ఆర్డినెన్స్లను విడుదల చేశారు. సమస్యలు పరిష్కరించే నాధుడే కరువయ్యాడు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి తెలంగాణ ప్రజలను మభ్యపెట్టి మోసం చేస్తున్నాయి.
కామారెడ్డి డిక్లరేషన్ బూటకం
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం లోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద BRSపార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన బీసీ బంద్ కార్యక్రమంలో మాజీ మంత్రివర్యులు వి శ్రీనివాస్ గౌడ్ గారు పాల్గొని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు బీసీ లకు చట్టసభలలో మరియు విద్యా, ఉద్యోగాలలో 42% చట్టబద్ధమైన రిజర్వేషన్లు కల్పించిన తర్వాతనే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేయడం జరిగింది.
గంగుల కమలాకర్,మాజీమంత్రి..
బీసీ బంద్ లో కాంగ్రెస్,బీజేపీ పాల్గొంటున్నాయి. మొక్కుబడిగా బీసీ బంద్ లో కాంగ్రెస్, బీజేపీ భాగస్వామ్యం కావద్దు. బీసీలకు రాజ్యాంగ సవరణ ద్వారానే 42 శాతం రిజర్వేషన్లు వస్తాయి. బీసీ రిజర్వేషన్లు తగ్గిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయి. బీసీలకు ఒక్క శాతం రిజర్వేషన్ తగ్గవద్దు.
కాంగ్రేస్ నాయకులు…

బిసి సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ బంద్ పిలుపు కు కాంగ్రెస్ పార్టీ మద్దతులో.. భాగంగా మహబూబ్ నగర్ బంద్ కార్యక్రమం లో పాల్గొన్న మెట్టు సాయికుమార్ చైర్మన్ ఫిషరీస్.. కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు..

ఎంజీబీఎస్ ఇమ్లీబన్ బస్టాండ్ వద్ద బీసీ సంఘం నాయకులతో కలిసి బీసీ బంద్ నిరసన కార్యక్రమంలో పాల్గొన్న టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ఎమ్ఆర్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ.
