Hyderabad: తెలంగాణ జాగృతి విస్తృత స్థాయి సమావేశం ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు జరగనుంది. ఎమ్మెల్సీ కవిత అధ్యక్షతన ఈ సమావేశాం జరగనుంది. ఈ సమావేశంతలో తెలంగాణ జాగృతి రాష్ట్ర కమిటీ బాధ్యులు, పూర్తిస్థాయి జిల్లాల కమిటీ సభ్యులు, ముఖ్య నాయకులు, సీనియర్ సభ్యులు హాజరు అవుతారు.
ఈ సమావేశం మహమ్మదీయ మాన్షన్, ముషీరాబాద్, హైదరాబాద్ లో జరగనుంది. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ కవిత ప్రసంగిస్తారు. ఈ సమావేశంలో కవిత ఏమి మాట్లాడతారో అంతటా ఆసక్తి నెలకొంది. దేశంలో సంచలనంగా మారిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సీబీఐ మరోసారి నోటీసులు ఇచ్చింది. నిన్న దాదాపు 7 గంటలకుపైగా విచారించిన సీబీఐ అధికారులు వెళ్తూ ఆమెకు 91 సీఆర్పీసీ నోటీసులను ఇచ్చారు. తాము చెప్పిన చోట విచారణకు రావాలని ఆమెకు నిర్దేశించారు. త్వరలోనే విచారణకు సంబంధించిన తేదీలను తెలియజేస్తామని సీబీఐ అధికారులు చెప్పారు.