హైదరాబాద్ : తెలంగాణలో బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రాజకీయ రిజర్వేషన్లతో పాటు విద్య, ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లులకు రాష్ట్ర అసెంబ్లీ, కౌన్సిల్ ఆమోదం తెలిపి 6 నెలలు గడిచింది. ఈ రెండు బిల్లులు రాష్ట్రపతి గారి ఆమోదానికి నోచుకోలేదు.. ఈ బిల్లులకు చట్టబద్ధత కోసం కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చిన్న ప్రయత్నం కూడా చేయలేదు.
2018 పంచాయతీ రాజ్ చట్టానికి సవరణ చేసి బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించే సవరణ బిల్లు గవర్నర్ గారి దగ్గర పెండింగ్ లో ఉంది. అసెంబ్లీ, కౌన్సిల్ ఆమోదించిన బిల్లులు రాష్టప్రతి వద్ద, చట్ట సవరణ బిల్లు గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉండగానే కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన జీవో నం.9 పై హైకోర్టు స్టే విధించింది.
Also Read-
హైకోర్టు ఉత్తర్వుల కాపీ నాకు ఈరోజు ఉదయం 8.30 గంటల ప్రాంతంలో అందింది.. అసెంబ్లీ, కౌన్సిల్ ఆమోదించిన బిల్లులను ఆరు నెలలుగా కోల్డ్ స్టోరేజీలో పెట్టిన కేంద్ర ప్రభుత్వంపై, రాష్ట్రపతి గారిపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టు ను ఆశ్రయించి న్యాయ పోరాటం చేయాలి.. ఇప్పటికే ఆలస్యం అయ్యింది.. ఇకనైనా సుప్రీం కోర్టు లో పిటిషన్ దాఖలు చేయాలని డిమాండ్ చేస్తున్నను.
