విద్యార్థిని లతో కలిసి బ్రేక్ ఫాస్ట్ చేసిన MP మల్లు రవి, నోటు పుస్తకాలు అందజేత

హైదరాబాద్ : గద్వాల జిల్లా కేంద్రంలోని భీంనగర్ లోని ప్రభుత్వ బి.సి. బాలికల వసతిగృహాన్ని జెడ్పి చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇంచార్జీ సరితమ్మ తో కలిసి నాగర్‌కర్నూల్ పార్లమెంటు సభ్యుడు మల్లు రవి సందర్శించారు. జిల్లా బి.సి. వెల్ఫేర్ అధికారులతో పాటు హాస్టల్ గదులు, మరుగుదొడ్లు, భోజన శాలను పరిశీలించి, విద్యార్థులతో కలిసి బ్రేక్ ఫాస్ట్ చేశారు.

అనంతరం జెడ్పి చైర్ పర్సన్ సరితమ్మ సహకారంతో విద్యార్థులకు నోటు పుస్తకాలు మల్లు రవి చేతులమీదుగా అందజేసినారు. వసతి గృహాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్దంగా ఉందని, సమస్యలను జిల్లా స్థాయి అధికారులు ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు గాను ప్రభుత్వం దృష్టికి తీసుకు రావాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో టిపిసిసి రాష్ట్ర నాయకుడు గంజిపేట్ శంకర్,ధరూర్ జెడ్పిటిసి పద్మ వెంకటేశ్వర రెడ్డి, లత్తిపురం వెంకట్రామిరెడ్డి ఇతరులు పాల్గోన్నారు.

ఇది కూడ చదవండి-

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

Archives

Categories

Meta

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

X