హైదరాబాద్: తెలంగాణలో ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డు లో ఉత్తమ గ్రామ పంచాయతీగా ఎంపికైన పర్లపల్లి ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా రాష్టంలో ప్లాస్టిక్ వేస్ట్ మరియు లిక్విడ్ & సాలిడ్ వేస్ట్ మేనేజ్ మెంట్ విభాగాల్లో మరియు పరిశుభ్రత మరియు పచ్చదనం విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిసందుకు కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం లోని పర్లపల్లి గ్రామం రాష్ట్ర స్థాయిలో ఉత్తమ గ్రామ పంచాయితీ అవార్డు కు ఎంపికైంది.

సనత్ నగర్ లోని తెలంగాణ పొల్యుషన్ కంట్రోల్ బోర్డ్ కార్యాలయం లో గౌరవ మంత్రులు శ్రీ అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి మరియు శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గార్ల చేతుల మీదుగా అవార్డు అందుకున్న పర్లపల్లి గ్రామ సర్పంచ్ శ్రీమతి మాదాడి భారతినర్సింహా రెడ్డి గారు.
