హైదరాబాద్ : జనగణనలో బిసీ వర్గాలను కూడా చేర్చాలని, 60 శాతం బిసిలకు న్యాయం చేయాలనీ, జనగణనలో కుల గణన కుడా చేయాలని కొరుతూ హైదరాబాద్ అంబర్పేట లోని వి. హనుమంతరావు రెండు రోజులుగా నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు.

ఈ రోజు తెలంగాణ శాసనసభ పక్ష నేత మధుసూదనాచారి మరియు ఎమ్మెల్సీ కోదండరాం, జాజుల శ్రీనివాసరావు పలువురు నిమ్మరసం ఇచ్చి ఆయన దీక్ష విరమింప చేశారు. అనంతరం హనుమంతరావు మాట్లాడుతూ.. బీసీ జనాభా ప్రకారo బీసీలకు ప్రత్యేకంగా రిజర్వేషన్ కల్పించాలని హనుమంతరావు గత రెండు రోజులుగా నిరాహార దీక్ష నిర్వహిస్తున్నారు.

బీసీ ప్రధాని మోదీ కూడా బీసీలకు అన్యాయం చేస్తున్నాడు. ప్రధాని మోడీ బిసి వ్యతిరేకి అని నిరూపించుకున్నాడు. మనం రిజర్వేషన్ కల్పించుకునే వరకు మనం నిరంతరం పోరాటం చేద్దాం ర్యాలీలు ధర్నాలతో ఉద్యమాలు నిర్వహించి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి మన సమస్యలు పరిష్కరించుకుందాం అని గంటా పదంగా చెప్పారు. దీనికి వివిధ పార్టీల మద్దతు ఇచ్చిరూ బిఆర్ఎస్, సిపిఎం సిపిఐ అన్ని పార్టీలు సంపూర్ణ మద్దతు ఇచ్చారు. నిరుద్యోగ జేఏసీ సంపూర్ణ మద్దతు ఇచ్చింది వారందరికీ ధన్యవాదాలు.
Also Read-
మ్మెల్సీలు కోదండరాం, మధు సూదన్ చారి, మాజీ ఐఏఎస్ అధికారులు చిరంజీవులు పూర్ణచంద్రరావు బీసీ నాయకులు జాజుల శ్రీనివాస్ గౌడ్, గుజా కృష్ణ మేకపోతుల నరేందర, పీసీసీ వైస్ ప్రైసిడెంట్ జగదీష్, అప్సర్ యూసుఫ్ జాయి సురేష్ టాప్పర్ సెల్ కార్పొరేషన్వైస్ చైర్మన్ కేశం నాగరాజు గౌడ్, మహేందర్ జనార్ధన్ గరిగంటి రమేష్ డిండి రాంబాబు పులి జగన్, పిసిసి కార్యదర్శులు లక్పతి యాదగిరి గౌడ్ శంభుల శ్రీకాంత్ గౌడ్ ఆది అవినాష్ రామ్మోహన్ రావు టి కృష్ణ గౌడ్ శ్రీధర్ గౌడ్ పంజాల వెంకటేష్ గౌడ్ వీడెల్లి ప్రభాకర్ షేక్ జమీర్ కోటం అనిల్, రావుల సుధాకర్,సి సుధాకర్, జాంగిర్ భాయ్ శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
