दिल दहला देने वाली घटना: अमेरिका में पति की हार्ट अटैक से मौत, अंतिम संस्कार के बाद पत्नी ने की आत्महत्या

हैदराबाद: यह दिल दहला देने वाली घटना है। डेढ़ साल पहले ही दोनों की शादी हुई थी। शादी के बाद पत्नी पति के साथ अमेरिका चली गई। हाल ही में मायके आई। जब पत्नी हैदराबाद में थी, पति को दिल का दौरा पड़ा और अमेरिका में उसकी जान चली गई। हैदराबाद में पति के अंतिम संस्कार के कुछ घंटे बाद ही पत्नी ने खुदकुशी कर ली।

मिली जानकारी के अनुसार, वनस्थलीपुरम निवासी मनोज (31) पेशे से सॉफ्टवेयर हैं। अमेरिका के डलास में बसे मनोज ने डेढ़ साल पहले अंबरपेट की डीडी कॉलोनी की साहिती (29) से शादी की। शादी के बाद मनोज पत्नी को लेकर अमेरिका चला गया। लेकिन इसी साल 2 मई को साहिती अपने माता-पिता को देखने हैदराबाद आ गई।

20 मई को मनोज को दिल का दौरा पड़ा और दोस्त उसे इलाज के लिए अस्पताल ले गए। इलाज के दौरान मनोज की मौत हो गई। जब साहिती को इस बात का पता चला तो वह फूट-फूट कर रो पड़ी। मनोज का शव 23 मई की रात वनस्थलीपुरम पहुंचा और 24 को अंतिम संस्कार किया गया। अंतिम संस्कार के बाद सहिती अपने माता-पिता के साथ डीडी कॉलोनी पहुंची।

पति की मौत का सदमा सहन नहीं कर पाने के कारण गुरुवार सुबह साढ़े नौ बजे उसने घर में ही पंखे को फांसी देकर जान दे दी। सूचना मिलने पर मौके पर पहुंची पुलिस ने शव को कब्जे में लेकर पोस्टमार्टम के लिए उस्मानिया अस्पताल की मोर्चरी में भेज दिया। पुलिस ने मामला दर्ज कर लिया है और जांच कर रही है।

అమెరికాలో గుండెపోటుతో భ‌ర్త మృతి, అంత్య‌క్రియలు ముగిశాక‌ భార్య ఆత్మ‌హ‌త్య‌

హైద‌రాబాద్: ఇది హృద‌య విదార‌క ఘ‌ట‌న‌. ఏడాదిన్న‌ర క్రిత‌మే ఆ జంట‌కు వివాహ‌మైంది. పెళ్లి అనంత‌రం భ‌ర్త‌తో క‌లిసి అమెరికా వెళ్లిన భార్య‌. ఇటీవ‌లే పుట్టింటికి వ‌చ్చింది. భార్య హైద‌రాబాద్‌లో ఉండ‌గానే భ‌ర్త అమెరికాలో గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోయాడు. హైద‌రాబాద్‌లో భ‌ర్త అంత్య‌క్రియ‌లు ముగిసిన కొద్ది గంట‌ల‌కే భార్య ఆత్మ‌హ‌త్య చేసుకుంది.

వివ‌రాల్లోకి వెళ్తే వ‌న‌స్థ‌లిపురం వాసి మ‌నోజ్(31) వృత్తిరీత్యా సాఫ్ట్‌వేర్‌. అమెరికాలో డ‌ల్లాస్‌లో స్థిర‌ప‌డిన మ‌నోజ్ ఏడాదిన్న‌ర క్రితం అంబర్‌పేట డీడీ కాల‌నీకి చెందిన సాహితీ(29)ని వివాహం చేసుకున్నాడు. పెళ్లైన వెంట‌నే భార్య‌ను తీసుకొని, మ‌నోజ్ అమెరికా వెళ్లాడు. అయితే ఈ ఏడాది మే 2వ తేదీన త‌ల్లిదండ్రుల‌ను చూసేందుకు సాహితీ హైదరాబాద్‌కు వ‌చ్చింది.

మే 20వ తేదీన మ‌నోజ్ గుండెపోటుకు గురికాగా, స్నేహితులు చికిత్స నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. చికిత్స పొందుతూ మ‌నోజ్ ప్రాణాలు కోల్పోయాడు. విష‌యం తెలుసుకున్న సాహితీ గుండెల‌విసేలా రోదించింది. 23వ తేదీన రాత్రి మ‌నోజ్ డెడ్ బాడీ వ‌న‌స్థ‌లిపురం చేరుకోగా, 24న అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించారు. అంత్య‌క్రియ‌లు ముగిశాక సాహితీ త‌న త‌ల్లిదండ్రుల‌తో క‌లిసి డీడీ కాల‌నీకి చేరుకుంది.

భ‌ర్త మ‌ర‌ణాన్ని త‌ట్టుకోలేని ఆమె గురువారం ఉద‌యం 9:30 గంట‌ల‌కు ఇంట్లోనే ఫ్యాన్‌కు ఉరేసుకుంది. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకుని మృత‌దేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్ప‌త్రి మార్చురీకి త‌ర‌లించారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

అమెరికాలో రోడ్డు ప్రమాదం.. తెలంగాణ విద్యార్థి మృతి

మరోవైపు అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన ఓ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. మహబూబ్‌ నగర్‌ జిల్లా భూత్పూర్‌ మండలం కపెట్ట గ్రామానికి చెందిన బోయ మహేశ్ (25) పై చదువుల కోసం గత డిసెంబర్‌లో అమెరికా వెళ్లాడు. అక్కడ కాంకోర్డియా యూనివర్శిటీలో ఎమ్‌ఎస్‌ (MS) చేస్తున్నాడు.

మంగళవారం రాత్రి తన ముగ్గురు స్నేహితులు శివ, శ్రీలక్ష్మి, భరత్‌తో కలిసి లాంగ్‌ డ్రైవ్‌కు వెళ్లాడు. ఈ క్రమంలో వీరు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టుకు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో మహేశ్‌ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మిగతావారు తీవ్రంగా గాయపడ్డారు. మహేశ్‌ మరణ వార్తను అతని కుటుంబ సభ్యులకు బుధవారం సమాచారం అందించారు. దీంతో కప్పట గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. మహేశ్‌ మృతదేహాన్ని భారత్‌కు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X