భారత్ రాష్ట్ర సమితి అంటే భస్మాసుర సమితి, అడుక్కునుడు మానేసి ప్రభుత్వంపై పోరాటం చేయాలి: రేవంత్ రెడ్డి

హైదరాబాద్ : బీఆర్ఎస్ అంటే భస్మాసుర సమితి అని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి అన్నారు. రూ. 35వేల కోట్ల పంచాయతీ నిధులను కేసీఆర్ సర్కార్ దారి మళ్లించిందని ఆరోపించారు. ఆ నిధులతో మెఘా కృష్ణారెడ్డి, ప్రతిమ శ్రీనివాస్ల కాంట్రాక్టులకు బిల్లలు కట్టారని విమర్శించారు. సోమవారం సర్పంచుల సమస్యలపై ధర్నా చౌక్ వద్ద కాంగ్రెస్ చేపట్టిన ధర్నాలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.

నిధుల్లేక  కొందరు సర్పంచులు పుస్తెలు అమ్ముకుంటే, మరికొందరు బిచ్చమెత్తుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సర్పంచులు అడుక్కోవడం మానేసి… ప్రభుత్వంపై పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. సర్పంచులపై పోలీసుల నిఘా ఉందని రేవంత్ ఆరోపించారు. రాష్ట్రంలో నిరసన తెలిపే అవకాశం కూడా లేకుండా పోయిందని వాపోయారు. సర్పంచులు ఆస్తులమ్మి అభివృద్ధి పనులకు ఖర్చు పెట్టారని… ప్రభుత్వం వెంటనే మళ్లించిన నిధులను వారికి జమ చేయాలని డిమాండ్ చేశారు. నిధులు రాకపోవడంతో ఆత్మహత్య సర్పంచుల కుటుంబాలకు కోటి రూపాయల పరిహారం ఇవ్వాలని రేవంత్ రేడ్డి డిమాండ్ చేశారు.  

చెట్టు సచ్చిపోతే సర్పంచ్ లను సస్పెండ్ చేస్తామన్న కేసీఆర్… హైదరాబాద్ అభివృద్ధిపై కేటీఆర్ను సస్పెండ్ చేస్తారా అని రేవంత్ ప్రశ్నించారు. హైదరాబాద్ నగరాన్ని అధ్వానంగా మార్చిన ఘనత కేసీఆర్, కేటీఆర్ లకే దక్కతుందన్నారు. రాష్ట్రంలో ఉద్యోగులకు జీతాలిచ్చే పరిస్థితి లేదని… జీతాల కోసం 28వేల కోట్ల అప్పు తెచ్చారని చెప్పారు. రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చారని రేవంత్ రేడ్డి మండిపడ్డారు. 

రేవంత్ రేడ్డి మాట్లాడుతూ…

“రాష్ట్ర ప్రభుత్వం సర్పంచులను సమస్యల్లో పడేసింది. ప్రభుత్వం వైఖరితో కొందరు ఆత్మహత్యలు చేసుకుంటే.. ఇంకొందరు పుస్తెలు అమ్ముకున్న పరిస్థితి. సర్పంచుల నిరసనకు సంఘీభావంగా ధర్నా చేస్తామంటే ప్రభుత్వం పోలీసులతో అడ్డుకుంది. అయినా హైకోర్టు అనుమతితో ఇవాళ కాంగ్రెస్ పార్టీ ధర్నా నిర్వహిస్తోంది. ఈ ధర్నాకు ఎంతో మంది సర్పంచులు పరోక్షంగా మద్దతు తెలుపుతున్నారు. గ్రామం గౌరవం పెరగాలంటే రాష్ట్ర ప్రభుత్వం సర్పంచులకు గౌరవం ఇవ్వాలి.

సంబంధిత వార్త

సర్పంచులకు రావాల్సిన నిధులను విడుదల చేయాలి. వివిధ మార్గాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో సర్పంచుల వాటాను వారి ఖాతాలో వేయాలి. వారికి రావాల్సిన నిధులు ఇవ్వకుండా ప్రభుత్వం దోపీడీ చేస్తోంది. నిధులు రాకపోవడంతో సిరిసిల్ల నియోజకవర్గంలో ఆనంద్ రెడ్డి అనే సర్పంచ్ ఆత్మహత్య చేసుకుండు. ప్రభుత్వ వైఖరితో రాష్ట్రంలో 60మంది సర్పంచులు ఆత్మహత్య చేసుకున్నారు. సర్పంచుల ఆత్మ గౌరవం దెబ్బతీసి వారిని ఆత్మహత్యలకు ఉసిగొల్పింది కేసీఆర్ కాదా?

కాంట్రాక్టర్లకు కట్టబెట్టడానికే ఆ నిధులను దారి మళ్లించారు. సర్పంచులకు రావాల్సిన నిధులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నా. చెట్టు చనిపోతే సర్పంచ్ ను సస్పెండ్ చేస్తారట. మరి నిర్లక్ష్యంగా వ్యవహరించిన మున్సిపల్ మంత్రి కేటీఆర్ ను ఏం చేయాలి. కేటీఆర్ నిర్లక్ష్యం వల్ల మూసీలో మునిగి 30 మంది చనిపోయారు. హైదరాబాద్ లో ఎక్కడ చూసినా మామూలు పరిస్థితులు లేవు. మునిసిపల్ శాఖ మంత్రి నిర్లక్ష్యం కళ్లకు కట్టినట్లు కనిపిస్తోంది. రాష్ట్రాన్ని ఇంత అధ్వాన్నంగా మార్చిన తండ్రీ, కొడుకులను ట్యాంక్ బండ్ మీద ఉరేసినా తప్పు లేదు. పుట్టబోయే బిడ్డమీద కూడా 1లక్షా 50వేల అప్పు వేసిండు. తెలంగాణ మోడల్ అంటే ఇదేనా?

బీఆరెస్ అంటే భారత్ రాష్ట్ర సమితి కాదు భస్మాసుర సమితి. బుద్ది మార్చుకోకపోతే ఈ భస్మాసుర సమితి కూడా కేసీఆర్ ను కాపడలేదు. కొత్త గ్రామ పంచాయతీలకు భవనాలు ఎక్కడైనా కట్టించారా? నీ సోకులకు వేల కోట్లు ఖర్చు చేస్తూ.. సర్పంచుల పట్ల దుర్మార్గంగా వ్యవహరిస్తారా? సర్పంచుల సమస్యలు తీరాలంటే కేసీఆర్ పోవాలి.. బీఆరెస్ ను బొంద పెట్టాలి. కేసీఆర్ కుటుంబాన్ని పొలిమేరలు దాటేదాక తరమాలి. పనికిమాలిన చట్టాలను కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రద్దు చేస్తాం. సర్పంచుల నిధులు ఎవరూ దొంగిలించకుండా పటిష్ట చట్టం తీసుకొస్తాం. పంచాయతీలు చేయాల్సిన పనిని ఆర్థిక దోపీడికి సర్పంచుల వ్యవస్థను సర్వం నిర్వీర్యం చేశాడు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల మరణించిన ప్రతీ సర్పంచ్ కుటుంబానికి కోటి రూపాయలు పరిహారం ప్రకటించాలి. అడుక్కోవడం మానండి.. కోట్లాది సాధించుకుందాం. కేసీఆర్ దోపీడీని నిలువరించేందుకు సర్పంచులు మంచి నిర్ణయం తీసుకోండి. సర్పంచులకు పూర్వ వైభవం రావాలంటే కేసీఆర్ అధికారం పోవాల్సిందే.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X