ఈనెల 15న కరీంనగర్ లో ప్రజా సంగ్రామ యాత్ర-5 ముగింపు సభ, ఆ రోజు నుంచి బండి సంజయ్ నడుస్తారు ప్రతిరోజు 20KM

ప్రజా సంగ్రామ యాత్ర ప్రముఖ్ డాక్టర్ జి.మనోహర్ రెడ్డి వెల్లడి

Hyderabad: బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ చేపట్టిన 5వ విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభ తేదీ ఫైనల్ అయ్యింది. ఈనెల 15న కరీంనగర్ లోని ఎస్సారార్ కళాశాల మైదానంలో భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నట్లు ప్రజా సంగ్రామ యాత్ర ప్రముఖ్ డాక్టర్ జి.మనోహర్ రెడ్డి తెలిపారు.

• సభకు ముఖ్య అతిథిగా బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా వస్తున్నారని పేర్కొన్నారు. వాస్తవానికి ఈనెల 16న బహిరంగ సభ నిర్వహించాలని తలపెట్టినప్పటికీ…ఆరోజు జేపీ నడ్డాకు అత్యవసర కార్యక్రమాలున్నందున ఒకరోజు ముందే బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జేపీ నడ్డాతోపాటు పలువురు నేతలు ఈ సభకు హాజరుకానున్నారని చెప్పారు.

• బహిరంగ సభ పూర్తి వివరాలను రెండు, మూడు రోజుల్లో వెల్లడిస్తామని పేర్కొన్నారు. నిర్ణీత తేదీకంటే పాదయాత్రను ఒకరోజు ముందుగానే ముగిస్తున్న నేపథ్యంలో ఈనెల 12 నుండి బండి సంజయ్ ప్రతిరోజు 20 కి.మీలకుపైగా నడుస్తారని వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X