“రాబోయే రోజుల్లో అన్ని BRAOU అధ్యయన కేంద్రాల్లో ఉద్యమ జెండాను ఎగరేస్తాం”

74వ రోజుకు చేరిన ఉద్యోగుల నిరసనలు

హైదరాబాద్ : రాష్ట్రం వ్యాప్తంగా ఉన్న అన్ని అధ్యయన కేంద్రాల్లో ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు జేఏసీ సభ్యులు వెల్లడించారు. డా. బి. ఆర్. అంబేద్కర్ విశ్వవిద్యాలయ స్థలాన్ని జవహర్ లాల్ నెహ్రు అర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ విశ్వవిద్యాలయానికి (జె.ఎన్.ఏ.ఎఫ్.ఏ.యూ) కేటాయించాలనే ప్రభుత్వ ఆలోచనను వెంటనే ఉపసంహరించుకోవాలని ఐక్య కార్యాచరణ సమితి సభ్యులు డిమాండ్ చేస్తూ నిరసనను కొనసాగించారు.

గత 74 రోజులుగా జేఏసీ సభ్యులు, ఉద్యోగులు ప్రభుత్వ లేఖ నెం: 1043/TE/A12/2024 కు వ్యతిరేకంగా మధ్యాహ్న భోజన విరామ సమయంలో పరిపాలన భవనం ముందు బైఠాయించి, నల్ల బ్యాడ్జీలు ధరించి ఉధ్యమాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న ఐక్య కార్యాచరణ సమితి (జేఏసీ) ఛైర్పర్సన్ ప్రొ. పల్లవీ కాబడే; కన్వీనర్ ప్రొ. వడ్డాణం శ్రీనివాస్; సెక్రటరీ జనరల్ డా. వేణుగోపాల్ రెడ్డి; డా. ఎల్వికే రెడ్డి తదితరులు మాట్లాడారు.

Also Read-

కార్యక్రమంలో జేఏసీ నేతలు డా. రంబింద్రనాథ్ సోలమన్; డా. యకేశ్ దైద; డా. రజనీ; ప్రొ. జి. మేరీ సునంద; డా. ఉదయిని; డా. కిషోర్; డా. రాఘవేంద్ర; డా. రజిత, షబ్బీర్; పాండు; రాములు, అధ్యాపక, అధ్యాపకేతర ఉద్యోగులు, అడ్మినిస్ట్రేటివ్, టెక్నికల్ అసోసియేషన్, టైం స్కేల్, ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులు, విద్యార్థులు, ఉద్యోగ సంఘాల నేతలు పాల్గొని ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

Archives

Categories

Meta

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

Close Welcome Bar