तेलंगाना स्थापना दिवस उत्सव आज, गर्व से हमारा तेलंगाना कहने का त्यौहार

हैदराबाद : दस साल के उत्सव के लिए तेलंगाना सजधज कर तैयार है। पृथक तेलंगाना के गठन की दसवीं वर्षगांठ के अवसर पर राज्य सरकार भव्य उद्घाटन समारोह आयोजित करने की तैयारी कर चुकी है। इस महोत्सव को भव्यतम तरीके से आयोजित करने के लिए सभी तैयारियां पूरी कर ली गई हैं।

2009 में यूपीए शासनकाल के दौरान तेलंगाना गठन की घोषणा की गई और कई विचार-विमर्श के बाद केंद्र की कांग्रेस सरकार ने संसद में कठिन स्थिति के बावजूद पृथक तेलंगाना के गठन को मंजूरी दे दी। इसकी दसवीं सालगिरह के मौके पर राज्य में सत्ता में रही कांग्रेस पार्टी ने भव्य इंतजाम किये है। सुबह परेड ग्राउंड पर और शाम को टैंकबंड पर कार्यक्रम आयोजित किये जा रहे हैं।

इन समारोहों में सीएम रेवंत रेड्डी अंदेश्री द्वारा लिखित गीत ‘जय जय हे तेलंगाना..’ को राष्ट्रगान (तेलंगाना गीत) के रूप में जारी करेंगे और इसे राष्ट्र को समर्पित करेंगे। उद्घाटन समारोह के लिए विभिन्न दलों के कार्यकर्ताओं को निमंत्रण भेजा गया। पूर्व सीएम केसीआर के साथ-साथ बीजेपी के नेताओं को भी न्योता दिया गया है। सरकार ने पिछली सरकार की तरह बिना अधिक खर्च किए जिलों, मंडलों और गांवों में स्थापना दिवस समारोह आयोजित करने की व्यवस्था की है।

संबंधित खबर-

నేడే పదేండ్ల పండుగ

హైదరాబాద్ : పదేండ్ల పండుగకు తెలంగాణ ముస్తాబైంది. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి పదేండ్లు పూర్తయిన సందర్భంగా అదిరిపోయేలా ఆవిర్భావ వేడుకలు నిర్వహించేందుకు రాష్ట్ర సర్కారు సిద్ధమైంది. ఈ ఉత్సవాన్ని అత్యంత వైభవంగా అందరి తెలంగాణ అని చాటి చెప్పేలా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది.

2009లో యూపీఏ హయాంలో తెలంగాణ ఏర్పాటు ప్రకటన ఆ తర్వాత ఎన్నో సంప్రదింపులు చేసి పార్లమెంట్​లో ఇబ్బందికర పరిస్థితులు ఉన్నా కేంద్రంలోని కాంగ్రెస్​ సర్కారు రాష్ట్ర ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. దీనికి పదేండ్లు పూర్తయిన సందర్భంలో రాష్ట్రంలో కాంగ్రెస్​ పార్టీ అధికారంలో ఉండడంతో వైభవంగా ఏర్పాట్లు చేసింది. ఉదయం పరేడ్​గ్రౌండ్​లో, సాయంత్రం ట్యాంక్​బండ్​పై కార్యక్రమాలను నిర్వహిస్తోంది. గడిచిన పదేండ్లుగా ఏ విషయంలో అయితే ఉద్యమకారులు, ప్రజలు అసంతృప్తిగా ఉన్నారో.. వాటిని సరిచేసుకుంటూ పదేండ్ల వేడుకకు సిద్ధమైంది.

ఈ వేడుకల్లో అందె శ్రీ రాసిన ‘జయ జయహే’ గీతాన్ని సీఎం రేవంత్​ రాష్ట్ర గీతంగా రిలీజ్ చేసి, జాతికి అంకితం చేయనున్నారు. ఆవిర్భావ వేడుకలకు పార్టీలకు అతీతంగా ఉద్యమకారులకు ఆహ్వానాలు పంపారు. మాజీ సీఎం కేసీఆర్​తో పాటు బీజేపీలో ఉన్న లీడర్లకు కూడా ఇన్విటేషన్లు ఇచ్చారు. గత సర్కార్​ మాదిరిగా దుబారా ఖర్చులకు పోకుండా జిల్లాలు, మండలాలు, గ్రామాల్లో ఆవిర్భావ వేడుకలను నిర్వహించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.

సీఎం రేవంత్​రెడ్డి ఆదివారం ఉదయం 9.30 గంటలకు గన్ పార్క్​లో అమర వీరుల స్థూపం వద్ద నివాళులర్పిస్తారు. అనంతరం 10 గంటలకు పరేడ్​ గ్రౌండ్​లో జాతీయ పతాకావిష్కరణ చేస్తారు. పోలీసు బలగాల పరేడ్, మార్చ్ ఫాస్ట్, వందన స్వీకార కార్యక్రమం ఉంటుంది. తర్వాత తెలంగాణ అధికారిక గీతం ‘జయ జయహే’ను ఆవిష్కరిస్తారు. సోనియాగాంధీ వీడియో సందేశం వినిపించాక సీఎం ప్రసంగిస్తారు. పోలీసు సిబ్బందికి, ఉత్తమ కాంటింజెంట్లకు అవార్డులను ప్రదానం చేస్తారు. సాయంత్రం ట్యాంక్ బండ్​పై తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ప్రారంభమవుతాయి.

తెలంగాణ హస్తకళలు, ఉత్పత్తులు, వివిధ రకాల ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నారు. సాయంత్రం 6.30కు సీఎం ట్యాంక్ బండ్​కు చేరుకొని, అక్కడ ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శిస్తారు. అక్కడే తెలంగాణ కళారూపాల అద్భుత ప్రదర్శనకు అద్దం పట్టే కార్నివాల్ నిర్వహిస్తారు. 700 మంది కళాకారులు ఇందులో పాల్గొంటారు. ట్యాంక్ బండ్​పై ఏర్పాటు చేసిన వేదికపై 70 నిమిషాల పాటు వివిధ సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు ఉంటాయి.

స్టేజ్​ షో అనంతరం జాతీయ జెండాలతో ట్యాంక్​ బండ్​పై ఇటు చివర నుంచి అటు చివరి వరకు ఫ్లాగ్​ వాక్​ నిర్వహిస్తారు. ఈ వాక్​ జరుగుతున్నంత సేపు ‘జయ జయహే తెలంగాణ’ ఫుల్​ వర్షన్ (13.30 నిమిషాల) గీతాన్ని విడుదల చేస్తారు. అదే వేదికపై కవి అందెశ్రీ, సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణిని సన్మానిస్తారు. రాత్రి 8.50కు హుస్సేన్ సాగరం మీదుగా ఆకాశంలో రంగులు విరజిమ్మేలా పటాకులు కాల్చి వేడుకలను ముగిస్తారు.

డిసెంబర్​ 7న రాష్ట్రంలో కాంగ్రెస్​ అధికారం చేపట్టింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు తెలంగాణలో ప్రభుత్వ పరంగా ఏం చేశారనే అంశాలను సీఎం రేవంత్​ రెడ్డి ఆవిర్భావ వేడుకల సందర్భంగా ప్రసంగంలో వివరించనున్నారు. అధికారంలోకి రాగానే ప్రగతి భవన్​ కంచెలు తొలగించి, దాన్ని ప్రజా భవన్​గా మార్చి అక్కడే ప్రజావాణి కార్యక్రమాన్ని తీసుకువచ్చారు. దీనిపై రేవంత్​ ప్రసంగించనున్నారు.

ఐదు గ్యారంటీల అమలును వివరించనున్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్లలోపు ఫ్రీ కరెంట్, రూ.500కే గ్యాస్​ సిలిండర్‌‌‌‌‌‌‌‌పై ప్రస్తావించనున్నట్టు తెలిసింది. రైతుబంధు పంపిణీ, రుణమాఫీ వివరాలు వెల్లడించనున్నారు. గత పదేండ్లలో జరిగిన విధ్వంసం గురించి కూడా సీఎం ప్రసంగిస్తారని సమాచారం. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X