Big Crime News: హైదరాబాద్‌లో 10వ తరగతి విద్యార్థినిపై సహ విద్యార్థులచే సామూహిక అత్యాచారం, కలకలం

హైదరాబాద్: నగరంలో 10వ తరగతి విద్యార్థిని పై తోటి విద్యార్థులు సామూహిక అత్యాచారం చేసారు. అత్యాచారం కేసుతో కలకలం రేగింది. మీడియాలో ప్రచారంలో ఉన్న వార్తల ప్రకారం హయత్‌నగర్‌లోని తట్టిఅన్నారంలో ఈ ఉదంతం వెలుగు చూసింది.

10వ తరగతి చదువుతున్న విద్యార్థినిపై ఐదుగురు సహవిద్యార్థులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అత్యాచారానికి పాల్పడిన అనంతరం విద్యార్థినులు సెల్‌ఫోన్‌లో వీడియో తీశారు. ఆ తర్వాత ఆ విద్యార్థినితో ఎవరికైన చెబితే వీడియో తీసి సోషల్ మీడియాలో పెడతానని బెదిరించాడు.

అత్యాచారం జరిగిన పది రోజుల తర్వాత మరోసారి విద్యార్థినిని బెదిరించి అత్యాచారం చేశారు. మధ్యాహ్న భోజనానికి ఇంటికి వెళ్లిన బాలికను అనుసరించిన ఐదుగురు నిందితులు ఇంట్లోకి చొరబడి అఘాయిత్యానికి పాల్పడ్డారు. అత్యాచారానికి సంబంధించిన వీడియోను కూడావిద్యార్థులతో share చేశారు. ఇది తెలిసిన బాధిత విద్యార్థిని బంధువులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నిందితులపై అత్యాచారం, ఫోక్సో కింద పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసి 24 గంటలు గడిచినా పోలీసులు ఇప్పటి వరకు నిందితులను పట్టుకోకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం అందాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X