పునరాభివృద్ధి చెందిన హైటెక్ నగరంతో సెల్ఫీ పోటీ కూడా నిర్వహించబడింది.
హైదరాబాద్ : దక్షిణ మధ్య రైల్వే అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద పునరాభివృద్ధి చేయబడిన ‘హై-టెక్ సిటీ రైల్వే స్టేషన్’ యొక్క ప్రారంభోత్సవ కార్యక్రమం 2026 జూలై 17 న జరగనున్న నేపథ్యంలో రైల్వే జంట నగరాల ప్రాంతం పరిసరాల్లోని వివిధ పాఠశాలల విద్యార్థుల కోసం వ్యాస రచన (ఇంగ్లీష్ మరియు హిందీ), డ్రాయింగ్ మరియు పెయింటింగ్ పోటీలను నిర్వహించింది.
“నా నగరంలో అభివృద్ధి చెందిన రైల్వే స్టేషన్ ఎలా ఉంటుంది?” మరియు “అభివృద్ధి చెందిన భారతదేశ నిర్మాణానికి నేను ఏమి చేస్తాను?” అనే అంశాలపై 8 నుండి 10వ తరగతి విద్యార్థుల కోసం పోటీలు నిర్వహించబడ్డాయి. ఈ పోటీలలో ఆరు ప్రముఖ పాఠశాలలైన గన్ఫౌండ్రీలోని లిటిల్ ఫ్లవర్ హై స్కూల్, అబిడ్స్లోని ఆల్ సెయింట్స్ హై స్కూల్, సికింద్రాబాద్లోని సెయింట్ ఆన్స్ హై స్కూల్, సికింద్రాబాద్లోని పికెట్ కేంద్రీయ విద్యాలయ, మారేడ్పల్లిలోని కెన్నెడీ విద్యా భవన్ మరియు నార్త్ లాలా గూడలోని రైల్వే మిక్స్డ్ హై స్కూల్ల నుండి మొత్తం 292 మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

ప్రతి పాఠశాలలో నిర్వహించిన వ్యాసరచన, చిత్రలేఖనం మరియు పెయింటింగ్ పోటీలలో మూడు విజేతలను ఎంపిక చేశారు. దీననుసరించి మొత్తం 36 మంది విద్యార్థులు (వ్యాసరచనలో 18 మంది విజేతలు, చిత్రలేఖనం మరియు పెయింటింగ్లో 18 మంది విజేతలు) బహుమతులు అందుకోనున్నారు. ఈ బహుమతుల ప్రదానం కార్యక్రమం పునరాభివృద్ధి చేయబడిన హై-టెక్ సిటీ రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవ వేడుకలో నిర్వహించబడుతుంది.
Also Read-

అంతేకాకుండా, పునరాభివృద్ధి చేయబడిన హైటెక్ సిటీ ‘అమృత్ స్టేషన్’ రూపాంతరాన్ని పురస్కరించుకుని, దక్షిణ మధ్య రైల్వే 2026 జూలై 15 వరకు ఒక సెల్ఫీ పోటీని నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా, రైలు ప్రయాణికులు పునరాభివృద్ధి చేసిన హైటెక్ సిటీ స్టేషన్ వద్ద సెల్ఫీ తీసుకుని, దక్షిణమధ్య రైల్వే సోషల్ మీడియా ఖాతాలను ట్యాగ్ చేస్తూ వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసే ఒక ప్రచార కార్యక్రమాన్ని కూడా ఈ జోన్ ప్రారంభించింది. పునరాభివృద్ధి చేసిన హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమం సందర్భంగా ఎంపిక చేసిన విజేతలకు బహుమతులు అందజేయబడతాయి.

దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ ఆధునిక రైల్వే వ్యవస్థ మరియు అభివృద్ధి చెందిన దేశం పట్ల తమ ఆశయాలను వ్యక్తం చేయడానికి యువతకు ఇటువంటి పోటీలు ఒక విలువైన వేదికను కల్పిస్తాయని పేర్కొన్నారు. విద్యార్థుల ఉత్సాహభరితమైన భాగస్వామ్యాన్ని ఆయన అభినందించడంతో పాటు వారి సృజనాత్మకతను ప్రశంసించారు. జనరల్ మేనేజర్ పునరాభివృద్ధి చేయబడిన హై-టెక్ సిటీ స్టేషన్ యొక్క కొత్త రూపాన్ని ఆవిష్కరించడంతో పాటు, దాని గురించి ప్రజలలో అవగాహన కల్పించడం ఈ సెల్ఫీ పోటీ యొక్క లక్ష్యమని కూడా తెలిపారు.
