Crime News: రాధా గాయత్రి అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి, భర్త ప్రమేయంపై అనుమానాలు, చదవండి వీరి మాటల్లో నమ్మలేని నిజాలు…

హైదరాబాద్ : మసూరీ (ఉత్తరాఖండ్‌) లో అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించినవిశాఖపట్నానికి చెందిన శ్రీమతి రాధా గాయత్రి స్నేహితులు మరియు కుటుంబ సభ్యులమైన మేము, ఆమె మరణం పట్ల తీవ్ర విచారం మరియు ఆవేదన వ్యక్తం చేస్తున్నామని చనిపోయిన గాయత్రి స్నేహితులు సుచరిత, వంశీకృష్ణ, రుక్మిణి ఈరోజు జరిగిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు.

వారు మాట్లాడతూ న్యాయం కోసం గళ మెత్తడంలో ప్రభుత్వం, పోలీసులు మరియు మీడియా మద్దతును కోరుతున్నామని తెలిపారు. అంతకు ముందు రోజు వరకు ఆరోగ్యంగా ఉన్న ఆమె మరణంలో, ఆమె భర్త సౌమ్య శ్రీ చరణ్ ప్రమేయం ఉన్నట్లు కనిపిస్తోంది. ఆమె భర్త ఆమెకు ఏదో పానీయం ఇవ్వగా, ఆ తర్వాత ఆమె రక్తస్రావంతో మరణించి కనిపించిందని, ఆమె కేవలం ఒక వస్త్రంతో నేలపై పడి ఉందనీ ఆ సంఘటన గురించి ఉదయం పూట మాత్రమే అతను హోటల్ సిబ్బందికి మరియు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడనీ వారు తెలిపారు. అయితే, తన తప్పులను కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో భాగంగా, అతను అర్ధరాత్రి 1:32 గంటలకు రాధా గాయత్రితో కలిసి ఉన్న ఫోటోను ఆమె తల్లిదండ్రులకు పంపడం ఆశ్చర్యకరంగా ఉందని సౌమ్య శ్రీ చరణ్ ఆమె ఎలా మరణించిందో సరైన వివరణ ఇవ్వలేక పోతున్నాడని దానికి బదులుగా, అతను ఈ వ్యవహారం నుండి క్షేమంగా బయటపడేందుకు తన తల్లిదండ్రులతో కలిసి పరిస్థితులను తారుమారు చేసే ప్రయత్నం చేస్తున్నాడని ఆరోపించారు. ఆమె మరణానికి సంబంధించిన అన్ని పరిస్థితులపై నిష్పక్షపాతమైన, పారదర్శకమైన మరియు సమగ్రమైన విచారణ జరపాలని మేము కోరుతున్నాము.

రాధా గాయత్రి ఎంతో ఆశయాలు, ప్రతిభ మరియు దయగల స్వభావం కలిగిన యువతి. సైకాలజీలో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసిన ఆమె, ఇతరులకు సహాయం చేయడం పట్ల ఎంతో ఆసక్తిని కలిగి ఉండేది మరియు మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని, విజయాలు సాధించాలని ఆశించేది. తన కుటుంబ ప్రోత్సాహం మరియు మద్దతుతో ఆ లక్ష్యాలను సాధించాలని ఆమె దృఢ సంకల్పంతో ఉండేదన్నారు. కాలక్రమేణా, గాయత్రి తన వైవాహిక జీవితంలోని సవాళ్ల గురించి సన్నిహిత స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో కొన్ని విషయాలను పంచుకుంది. తన భర్త వివిధ సందర్భాల్లో భిన్నమైన ప్రవర్తనను ప్రదర్శించేవాడని, వారి బంధంలో అతిగా హక్కులు కోరడం అనుమానం మరియు నియంత్రించే ధోరణి వంటి సమస్యలు ఉన్నాయని ఆమె చెప్పినట్లు సమాచారం. వ్యక్తిగత సవాళ్లు ఎదురైనప్పటికీ, UPSC పరీక్షలకు సన్నద్ధం కావడం వంటి తన ఆశయాలను కొనసాగించాలని ఆమె భావించేది.

Also Read-

ఆ స్నేహితులతో జరిపిన చర్చల్లో, గాయత్రి ఎల్లప్పుడూ ఈ సమస్యలను సానుభూతి మరియు అవగాహనతో పరిష్కరించుకోవడానికి ప్రయత్నించేది. ముఖ్యంగా తన భర్త ఎదుర్కొంటున్నట్లుగా ఆమె భావించిన భావోద్వేగ మరియు మానసిక సంఘర్షణలను దృష్టిలో ఉంచుకుని ఆమె అలా వ్యవహరించేది. సైకాలజీ గ్రాడ్యుయేట్‌గా, ఆమె ఆ సంబంధాన్ని మెరుగుపరచడానికి, మద్దతు ఇవ్వడానికి, ప్రోత్సహించడానికి నిరంతరం ప్రయత్నించింది. అదే సమయంలో, ఈ విషాద సంఘటన తర్వాత ఆమె భర్త శ్రీచరణ్ ప్రవర్తన, మౌనం, అలాగే గాయత్రి తల్లిదండ్రులు మరియు ఆత్మీయుల పట్ల సంభాషణ, సానుభూతి లోపించాయని కుటుంబ సభ్యులు భావించడం వంటివి ఆమెకు సన్నిహితంగా ఉన్నవారిలో అనేక ప్రశ్నలు, ఆందోళనలను రేకెత్తించాయని వారు తెలిపారు. ఈ ఆందోళనలు సహజంగానే కుటుంబ సభ్యులు, స్నేహితుల మధ్య ఊహాగానాలకు, వేదనకు దారితీస్తున్నాయి.

తన గురించి తాను మాట్లాడటానికి ఇప్పుడు మన మధ్య లేని రాధా గాయత్రి గురించి నిజాన్ని తెలుసుకోవాల్సిన సమయం ఇది. శ్రీ చరణ్ రాధను మానసికంగా వేధించేవాడని వారు తెలిపారు. తన భర్త ప్రవర్తన గురించి నిజ స్వరూపంతో మనసు విప్పి చెప్పడానికి ఆమె తన తల్లిదండ్రులను కలవాలనుకుంది. అతను నిరంతరం ఆమెను వెంబడించేవాడు, వీడియో కాల్స్ చేసేవాడు, ఎక్కడున్నావో చూపించమని అడిగేవాడు. నిరంతర నిఘా కోసం, ఆమెకు తెలియకుండా, ఆమె అనుమతి లేకుండా రాధ ల్యాప్‌టాప్‌లో ట్రాకింగ్ పరికరాన్ని పెట్టడమే అతని అనుమానాస్పద వైఖరికి నిదర్శనమని వారు ఆరోపించారు.

ఈ విషయంపై సంపూర్ణ, నిష్పాక్షిక, సమగ్ర విచారణ జరిపి, అన్ని వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని మేము సంబంధిత అధికారులను వినయ పూర్వకంగా కోరుతున్నాము. రాధా గాయత్రికి న్యాయం జరగాలని, దుఃఖంలో ఉన్న ఆమె కుటుంబ సభ్యులకు, స్నేహితులకు సమాధానాలు లభించాలని మేము కోరుతున్నాము. నిందితుడిని శిక్షించేందుకు, సౌమ్య శ్రీచరణ్ ను తక్షణమే అరెస్టు చేయాలని మేము భారత హోం మంత్రిని, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిని, తెలంగాణ ముఖ్యమంత్రిని, పోలీసు శాఖను, పరిపాలనను మరియు మీడియాను కోరుతున్నామని వారు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X