గాంధీ భవన్ లో పీసీసీ విస్తృతస్థాయి కార్యవర్గ సమావేశం, పలు తీర్మానాలు ఆమోదం

హైదరాబాద్ : గాంధీ భవన్ లో ముగిసిన పీసీసీ విస్తృతస్థాయి కార్యవర్గ సమావేశం. హాజరైన పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఏఐసీసీ సెక్రెటరీ నదీమ్ జావేద్ జానారెడ్డి, షబ్బీర్ అలీ, అంజన్ కుమార్ యాదవ్, చిన్నారెడ్డి, నాగం జనార్దన్ రెడ్డి, బలరాం నాయక్, వివిధ జిల్లాల అధ్యక్షులు, రాష్ట్ర ఉపాధ్యక్షులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు, ప్రదేశ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు.

కార్యవర్గ సమావేశంలో భారత్ జోడో యాత్రపై సమావేశంలో చర్చించామని టీపీసీసీ చీఫ్ రేవంత్ అన్నారు. హైకమాండ్ ఆదేశాలతోనే మీటింగ్ నిర్వహించామన్నారు. ఈనెల 24 నుంచి 29 మధ్య అన్ని జిల్లాల్లో కూడా ఇలాంటి సమావేశాలు నిర్వహిస్తామన్నారు. అన్ని జిల్లాల్లో ఇన్ ఛార్జ్ లను నియమిస్తామని రేవంత్ రెడ్డి చెప్పారు. సుదీర్ఘ అనుభవం ఉన్న నేతలతో మాట్లాడి జనవరి 26లోపు గ్రామ, మండల, జిల్లాల వారీగా ఇన్ ఛార్జ్ లను నియమిస్తామని చెప్పారు. పాత కమిటీలను రద్దు చేసి కొత్త కమిటీలను నియమిస్తామని రేవంత్ రెడ్డి చెప్పారు. 

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిగారి ప్రెస్ మీట్ పాయింట్స్..

టీపీసీసీ ఎగ్జిక్యూటివ్ సమావేశం నిర్వహించుకున్నాం

ఏఐసీసీ ఆదేశాల మేరకు భారత్ జోడో యాత్రకు సంబంధించి చర్చించుకున్నాం

సమావేశంలో పలు తీర్మానాలు ఆమోదించుకున్నాం

సెప్టెంబర్ 7 నుంచి జనవరి 7 వరకు 3600కి.మీ రాహుల్ గాంధీ జోడో యాత్ర చేపట్టారు.

బీజేపీ విభజన రాజకీయాలను తిప్పి కొట్టేందుకే రాహుల్ గాంధీ సాహసోపేత పాదయాత్ర చేపట్టారు.

ఈ నెల 19 నుంచి 24వరకు అన్ని జిల్లా కేంద్రాల్లో సమీక్ష సమావేశాలు

ఈ నెల 24 నుంచి 29 వరకు మండల కేంద్రాల్లో సమావేశాలు నిర్వహించి ప్రజలకు వివరిస్తాం

నూతన జాతీయ అధ్యక్షుడిగా ఖర్గే ఎన్నికైన తరువాత రాష్ట్రంలో కొత్త కమిటీలు ఏర్పాటు చేశారు.

రాష్ట్రంలో జిల్లా, మండల, డివిజన్, గ్రామ స్థాయి కమిటీలను జనవరి 26లోగా పూర్తి చేస్తాం

ధరణి వల్ల రైతుల సమస్యలపై కూడా సమావేశంలో చర్చించాలని నిర్ణయించాం

జోడో యాత్రలో రాహుల్ గాంధీ సందేశాన్ని ప్రతీ ఇంటికి చేరవేస్తాం

మోదీ, కేసీఆర్ చేసిన మోసాలను ఛార్జ్ షీట్ ల రూపంలో ఇంటింటికీ అందిస్తాం.

జనవరి 26 నుంచి ప్రతీ గ్రామంలో జెండా పండుగ కార్యక్రమం నిర్వహిస్తాం.

జనవరి 3, 4 న శిక్షణా తరగతులు నిర్వహిస్తాం.

మా ఎన్నికల విధానాలు ప్రజలకు తెలియజెప్పేలా సోషల్ మీడియాను ఉపయోగించుకుంటాం

ఏఐసీసీ ఆదేశాల మేరకు జనవరి 26 నుంచి ప్రజల్లోకి పాదయాత్రగా ప్రజల్లోకి వెళతాం

ప్రజల జీవితాల్లో, పరిపాలనలో మార్పు కోసం యాత్ర ఫర్ చేంజ్ కార్యక్రమం పార్టీ చేపడుతోంది.

వార్ రూమ్ పై దాడి చేసి మా విలువైన సమాచారాన్ని దొంగిలించారు.

ఐఐటీ, ఐఐఎం నిపుణులను సైబర్ క్రైమ్ పోలీసులు బట్టలు విప్పి కూర్చోబెట్టారు.

పోలీసులు కేసీఆర్ ప్రయివేటు సైన్యంలా వ్యవహరించారు.

సీవీ ఆనంద్ నారద ముని పాత్ర పోషిస్తున్నారా?

మా నాయకులకు తప్పుడు సమాచారం ఇచ్చి కాంగ్రెస్ పార్టీలో చిచ్చు పెడుతున్నారు.

కేసీఆర్ మెప్పు పొంది డిజీపీ పోస్టు తెచ్చుకోవలనుకుంటున్నారు

పార్టీలో జరిగే పరిణామాలపై అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది.

అన్ని సమస్యలకు అధిష్టానం పరిష్కారం చూపుతుంది.

ప్రజల కష్టాలు తీర్చడానికి నా సర్వ శక్తులు ఒడ్డుతా.

మా సహచరులమంతా ప్రజల కోసం కష్టపడతాం.. కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొస్తాం.

ప్రజల సమస్యల ముందు నా లాంటి నాయకులకు కలిగే అసౌకర్యాలు అంత పెద్దవి కాదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X