“ప్రతి గ్రామంలో కోట్లల్లో అభివృద్ది కండ్లకు కనిపిస్తుంది”

బిఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలే బలం

పార్టీ కోసం పని చేసిన వారికి కచ్చితంగా సముచిత గౌరవం దక్కుతుంది

పార్టీ జెండా మోసే వారిని, పార్టీ కోసం పని చేసేవారిని అధినేత కేసిఆర్ కడుపులో పెట్టుకొని కాపాడు కుంటారు

కేసిఆర్ గారి నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో నెంబర్ వన్ అయ్యింది

ఒకప్పుడు కరువు ప్రాంతంగా ఉండే…నేడు దేశానికే అన్నం పెడుతున్న రాష్ట్రంగా అవతరించింది

రైతులు,పేదలు ఎక్కడ సంతోషంగా ఉన్నరంటే.. తెలంగాణ రాష్ట్రం,సీఎం కేసిఆర్ వైపు చూస్తున్నారు

కేసిఆర్ సంపద సృష్టిస్తున్నారు..ఆ సంపద నేరుగా లబ్దిదారులు, పేదల బ్యాంకు ఖాతాల్లోనే జమ చేస్తున్నారు

లక్షల కోట్లు నేరుగా ప్రజలకు చేరాయి

బండి సంజయ్ కూడా కేసిఆర్ ప్రభుత్వ లబ్దిదారుడే…

తెలంగాణ ఉద్యమంలో లేని బండి సంజయ్ దశాబ్ది ఉత్సవాలను కేసిఆర్ కుటుంబ ఉత్సవాలు అనడం ఆయన అవివేకం

పసుపు బోర్డు పేరుతో రైతులను నిండా ముంచిన బీజేపీని నమ్మే ప్రసక్తే లేదు

కేసిఆర్ గారి సహకారంతో వేల కోట్లతో బాల్కొండ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకున్నాం

ఎండా కాలంలో కూడా చెరువులు అలుగులు పారుతున్నాయి..రైతులు సంబురంగా ఉన్నరు

ప్రతి గ్రామంలో కోట్లల్లో అభివృద్ది కండ్లకు కనిపిస్తుంది

అభివృద్ది పై గ్రామాల్లో చర్చ జరిగేలా బిఆర్ఎస్ కుటుంబ సభ్యులు చొరవ తీసుకోవాలి

నా బాల్కొండ బిఆర్ఎస్ కుటుంబ సభ్యులకు ఏ ఆపదా వచ్చిన నేను తోడుగా నిలబడతా..

  • బిఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

వేల్పూర్: బాల్కొండ నియోజకవర్గం వేల్పూర్ మండలం క్లస్టర్-2 గ్రామాల బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యుల ఆత్మీయ సమ్మేళనంలో రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి – నీరజా రెడ్డి దంపతులు సతీ సమేతంగా పాల్గొన్నారు. ఆయా గ్రామాల పార్టీ శ్రేణులతో ఆప్యాయంగా మాట్లాడారు, ఫోటోలు దిగారు. పండుగ వాతావరణంలో ఆత్మీయ సమ్మేళనం జరిగింది.

మంత్రి వేముల దంపతులు సమ్మేళన ప్రాంగణమంతా కలియ తిరుగుతూ అందరినీ పేరుపేరునా పలకరిస్తూ వారి కుటుంబ ఆత్మీయతను చాటుకున్నారు. బిఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపారు. మీటింగ్ కు వచ్చిన వారికి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి దంపతులు బోజనాలు వడ్డించారు. వారితో కలిసి సహపంక్తి భోజనాలు చేశారు. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కలుపుగోలు తనం వల్ల ఆత్మీయ సమ్మేళనం ప్రాంగణంలో పార్టీ శ్రేణుల సందడి నెలకొన్నది.

ఈ సందర్బంగా జరిగిన సమావేశంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి బిఆర్ఎస్ కుటుంబ సభ్యులను ఉద్దేశించి ప్రసంగించారు..

బాల్కొండ నియోజకవర్గం వేల్పూర్ మండల క్లస్టర్ -2 గ్రామాల బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులతో నేడు ఈ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. మా తండ్రి, రైతు నాయకుడు స్వర్గీయ వేముల సురేందర్ రెడ్డి కోసం నాడు పని చేశారని,నేడు నాతో పని చేస్తున్నారని ఇది అరుదుగా లభించే గౌరవం అని,నాడు మీ తండ్రులు మా తండ్రి గారికి తోడుగా ఉన్నారు..నేడు నాకు మీరు తోడుగా ఉన్నారు.ఏమిచ్చినా మీ ఆప్యాయత రుణం తీర్చుకోలేనిది అని మంత్రి భావోద్వేగానికి లోనయ్యారు. ఉద్యమ కాలం నుండి వెన్నంటి ఉండి,నేడు అబివృద్దిలో భాగస్వామ్యం అవుతున్న ప్రతి ఒక్కరికీ దన్యవాదాలు అని అన్నారు. తను రాజకీయాల్లోకి వచ్చే ముందు తన తండ్రి చెప్పిన మూడు సూత్రాలకు కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. అవి పాటిస్తున్నాను కాబట్టే అధినేత కెసీఆర్ దగ్గర చనువుగా నమ్మకంగా మెదిలే అవకాశం,కార్యకర్తల కుటుంబ సభ్యునిగా మెదిలే అవకాశం సాధ్యమయ్యిందని అన్నారు.

బి ఆర్ ఎస్ పార్టీ కుటుంబ సభ్యుల ఆదరాభిమానాలు ఎన్నటికీ మర్చిపోనన్నారు.బిఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలే బలమని,పార్టీ కోసం పని చేసిన వారికి కచ్చితంగా సముచిత గౌరవం దక్కుతుందని అన్నారు. 2001 ఉద్యమం నుండి పని చేసిన జిల్లా పరిషత్ చైర్మన్ అయిన విఠల్ రావు గారికి దక్కిన పదవులే అందుకు ఉదాహరణ అన్నారు. రెండో సారి ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక వారికి అవకాశం లభించిందని, వెనుకో ముందో కష్ట పడే వారికి పదవులు తప్పక లభిస్తాయని అన్నారు. పార్టీ జెండా మోసే వారిని,పార్టీ కోసం పని చేసేవారిని అధినేత కేసిఆర్ కడుపులో పెట్టుకొని కాపాడు కుంటారన్నారు. ఏ మూలన ఉన్న పార్టీ కోసం పని చేసిన వారికి పదవి కచ్చితంగా వరిస్తుంది అన్నారు.

కేసిఆర్ గారి నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో నెంబర్ వన్ అయ్యిందని ఈ సందర్బంగా గుర్తు చేశారు. ఒకప్పుడు కరువు ప్రాంతంగా ఉండే…నేడు దేశానికే అన్నం పెడుతున్న రాష్ట్రంగా తెలంగాణ అవతరించిందన్నారు. రైతులు,పేదలు ఎక్కడ సంతోషంగా ఉన్నరంటే.. తెలంగాణ రాష్ట్రం,సీఎం కేసిఆర్ వైపు దేశం మొత్తం ఆసక్తిగా చూస్తున్నారన్నారు. కుల వృత్తులకు ప్రోత్సాహకాలు,సంక్షేమ పథకాలు,అభివృద్ది పథకాలు,వ్యవసాయ రంగంలో వచ్చిన మార్పులు యావత్ దేశాన్ని ఆకర్షిస్తున్నాయి అని అన్నారు. కేసిఆర్ సంపద సృష్టిస్తున్నారు..ఆ సంపద నేరుగా లబ్దిదారులు, పేదల బ్యాంకు ఖాతాల్లోనే జమ చేస్తున్నారని,అట్లా లక్షల కోట్లు నేరుగా ప్రజలకు చేరాయని మంత్రి వెల్లడించారు. అందులో భాగంగానే తెలంగాణ సాధించిన ప్రగతి విజయాలపై రాష్ట్ర ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాలు నిర్వహించాలని నిర్ణయించిందని తెలిపారు.

తెలంగాణ ఉద్యమంలో లేని బండి సంజయ్ దశాబ్ది ఉత్సవాలను కేసిఆర్ కుటుంబ ఉత్సవాలు అనడం ఆయన అవివేకమని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ది ఫలాలు,కేసిఆర్ ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందుతున్న ప్రతి తెలంగాణ బిడ్డ దశాబ్ది ఉత్సవాలు జరుపుకుంటారని అన్నారు. ఏదో రకంగా బీజేపీ బండి సంజయ్ కూడా కేసిఆర్ ప్రభుత్వ లబ్దిదారుడే అని అన్నారు. ఈ ప్రాంత ఎంపి వల్ల అభివృద్ది ఏమీ జరగలేదని పైగా పసుపు బోర్డు పేరుతో రైతులను నిండా ముంచిన బీజేపీని నమ్మే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. కేసిఆర్ గారి సహకారంతో వేల కోట్లతో బాల్కొండ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకున్నామని,ఎండా కాలంలో కూడా చెరువులు అలుగులు పారుతున్నాయి..రైతులు సంబురంగా ఉన్నరని గుర్తు చేశారు. ప్రతి గ్రామంలో కోట్లల్లో అభివృద్ది కండ్లకు కనిపిస్తుందని, అభివృద్ది పై గ్రామాల్లో చర్చ జరిగేలా బిఆర్ఎస్ కుటుంబ సభ్యులు చొరవ తీసుకోవాలన్నారు.

వెల్పూర్ క్లస్టర్ గ్రామాల్లో జరిగిన అభివృద్దిని మంత్రి ఈ సంధర్బంగా లెక్కలతో సహా వివరించారు. పడగల్,రామన్నపేట, అంక్సపూర్,పోచంపల్లి, కుకునుర్,కోమన్ పల్లి, వెంకటాపూర్,అమీన్ పూర్, లక్కొరా గ్రామాల్లో నేరుగా జరిగిన లబ్ది దారులకు చేరిన డబ్బులు, అభివృద్ది లెక్కలతో సహా వివరించారు. బి. టి రోడ్లు, సి సి రోడ్లు, బ్రిడ్జిలు, చెక్ డ్యాంలు, చెరువులు, కాలువలు బాగు చేసుకోవడం, నవాబ్ లిఫ్ట్ ద్వారా చెరువులు నింపుకోవడం లాంటి కార్యక్రమాలు ఆయా గ్రామాల బిఆర్ఎస్ శ్రేణులకు వివరించారు.బాల్కొండ నియోజకవర్గ ప్రజలు రెండు సార్లు జిల్లాలోనే అత్యధిక మెజారిటీతో తనను ఎమ్మెల్యేగా గెలిపించారని వారి నమ్మకాన్ని నిలబెడుతూ బాల్కొండ నియోజకవర్గంలో వేల కోట్ల నిధులు తెచ్చి అభివృద్ది చేసుకున్నామని తెలిపారు. బాల్కొండ బిఆర్ఎస్ కుటుంబ సభ్యులకు ఏ ఆపదా వచ్చిన నేను తోడుగా నిలబడతా అని బిఆర్ఎస్ శ్రేణులకు భరోసా కల్పించారు.

బిఆర్ఎస్ అధ్యక్షుడు పంపిన సందేశాన్ని శ్రేణులకు చదివి వినిపించారు. సమ్మేళన ప్రాంగణమంతా జై కేసిఆర్,జై బిఆర్ఎస్,జై తెలంగాణ నినాదాలతో మారుమోగింది.

ఈ సందర్బంగా లక్కోర గ్రామానికి చెందిన బిజెపి,బీఎస్పీ నాయకులు దాసరి అనిల్,సుభాష్ గౌడ్,చిన్న హన్మండ్లు మరియు అనుచరులు అమీనాపూర్ గ్రామం బీఎస్పీ బిజెపి నాయకులు పార్టీలో చేరారు వారికి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ విఠల్ రావు, డిసిసిబి వైస్ చైర్మన్ రమేష్ రెడ్డి,బిఆర్ఎస్ సీనియర్ నాయకులు డాక్టర్ మధు శేఖర్, స్థానిక ప్రజాప్రతినిధులు,బిఆర్ఎస్ నాయకులు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X