శ్రీ కంఠమహేశ్వర స్వామి (కాటమయ్య) ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన కోసం కొబ్బరికాయ కొట్టిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

Hyderabad: వరంగల్ జిల్లా, రాయపర్తి మండలం, కాట్రపల్లిలో గౌడ సంఘం ఆధ్వర్యంలో నిర్మించనున్న శ్రీ కంఠమహేశ్వర స్వామి (కాటమయ్య) ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన కోసం కొబ్బరికాయ కొట్టిన రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి మరియు గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు గారు.

వరంగల్ నుంచి రేగుల గ్రామానికి వెళ్తున్న సందర్భంగా కాట్రపల్లి వద్ద స్థానికులు శంకుస్థాపన కోసం గుమి కూడగా మంత్రి వారిని పలకరించారు. కాటమయ్య గుడి కోసం శంకుస్థాపన చేసుకుంటామని చెప్పగా.. వెంటనే తన కాన్వాయ్ ఆపి, స్థానికుని బైక్ పై కూర్చొని, గుడి నిర్మాణ స్థలం వద్దకు వెళ్లి కొబ్బరి కాయ కొట్టారు. ఈ కార్యక్రమంలో కొలనుకొండ నారాయణ, గుండ్లపల్లి సోమయ్య తదితర స్థానికులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X