హైదరాబాద్ : ఆల్ ఇండియా ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ చైర్ పర్సన్ గా నియమితులైన మాజీ పార్లమెంట్ సభ్యులు మధుయాష్కి గౌడ్ రోజు ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే ని బెంగళూరులోని వారి నివాసంలో కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఖర్గేకి పుష్పగుచ్ఛం అందించి, శాలువాతో సత్కరించిన మధుయాష్కి.

ఇది కూడ చదవండి-
తనపై ఎంతో నమ్మకంతో ఇంత పెద్ద బాధ్యత అప్పగించినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. వివిధ రంగాల్లోని వృత్తి నిపుణులు, మేధావులను కాంగ్రెస్ పార్టీకి అనుసంధానం చేస్తూ వారందరినీ జాతీయస్థాయిలో ఒక వేదికపై తీసుకువచ్చే గురుతర బాధ్యతను సమర్ధవంతంగా నిర్వహించాలని ఈ సందర్భంగా ఖర్గే మధుయాష్కికి దిశానిర్దేశం చేశారు.
