हैदराबाद: फिल्म अभिनेता अल्लू अर्जुन (बन्नी) नामपल्ली कोर्ट में नय लुक में पेश हुए। ज्ञात हो कि नामपल्ली अदालत ने अल्लू अर्जुन को नियमित जमानत दे दी है, जो संध्या थिएटर भगदड़ मामले में A-11 है। अल्लू अर्जुन मजिस्ट्रेट के समक्ष एक बांड जमा करने और कुछ दस्तावेजों पर हस्ताक्षर करने के लिए नामपल्ली अदालत में उपस्थित हुए। अल्लू अर्जुन के साथ उनके मामा चन्द्रशेखर रेड्डी भी मौजूद थे। इस दौरान प्रशंसकों ने अल्लू के साथ सेल्फी ली।
संथ्या थिएटर भगदड़ मामले में अल्लू अर्जुन को पुलिस ने पहले ही गिरफ्तार कर लिया था और तेलंगाना हाई कोर्ट ने उन्हें अंतरिम जमानत दी थी। इस बीच, अल्लू अर्जुन ने नियमित जमानत के लिए ट्रायल कोर्ट का दरवाजा खटखटाया। वहीं पुलिस की ओर से वकीलों ने अनुरोध किया कि अल्लू अर्जुन को जमानत न दी जाए। वहीं बन्नी के वकीलों ने जमानत के लिए जोरदार दलीलें दीं।
दोनों पक्षों की दलीलें सुनने के बाद आखिरकार कोर्ट ने अल्लू अर्जुन को जमानत दी है। अल्लू अर्जुन जमानत संबंधित दस्तावेज पेश करने कोर्ट पहुंचे। कोर्ट ने बन्नी से पुलिस पूछताछ में सहयोग करने और गवाहों को प्रभावित न करने का आदेश दिया। साथ ही कहा कि ऐसी कोई टिप्पणी न करें जिससे मामले पर असर पड़े।
Also Read-
నాంపల్లి కోర్టుకు అల్లు అర్జున్
హైదరాబాద్ : సినీ నటుడు అల్లు అర్జున్ నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో ఏ-11గా ఉన్న అల్లు అర్జున్కు నాంపల్లి కోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. దీంతో పూచీకత్తు సమర్పించేందుకు, మేజిస్ట్రేట్ ముందు కొన్ని పత్రాలపై సంతకాలు చేసేందుకు అల్లు అర్జున్ నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. అల్లు అర్జున్ వెంట ఆయన మామ చంద్రశేఖర్ రెడ్డి ఉన్నారు.
ఇప్పటికే సంథ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ను పోలీసులు అరెస్ట్ చేయగా.. ఆయనకు తెలంగాణ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈలోపు రెగ్యులర్ బెయిల్ కోసం ట్రయల్కోర్టును అల్లు అర్జున్ ఆశ్రయించారు. ఓవైపు పోలీసుల తరపు న్యాయవాదులు అల్లు అర్జున్కు బెయిల్ మంజూరు చేయవద్దని కోరారు. బన్ని తరపు న్యాయవాదులు మాత్రం బెయిల్ కోసం గట్టిగా వాదనలు వినిపించారు.
ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం చివరకు అల్లు అర్జున్కు బెయిల్ మంజూరు చేసింది. దీంతో షూరిటీస్ సమర్పించేందుకు అల్లు అర్జున్ కోర్టుకు చేరుకున్నారు. అలాగే పోలీసు ఎంక్వైరీకి సహకరించాలని, సాక్షులను ప్రభావితం చేయకూడదని ఆదేశించింది. కేసును ప్రభావితం చేసేలా ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దని సూచించింది.
ఏం జరిగింది
పుష్ప2 బెనిఫిట్ షో సందర్భంగా సంధ్య థియేటర్ దగ్గర గత ఏడాది డిసెంబరు 4వ తేదీన జరిగిన తొక్కిసలాట ఘటనలో హీరో అల్లు అర్జున్కు నాంపల్లి కోర్టు షరతులతో కూడిన బెయిల్ను మంజూరు చేసింది. బెయిల్ పిటిషన్పై గత నెల 30వ తేదీన వాదనలు పూర్తి కాగా శుక్రవారం ఈ పిటిషన్పై నాంపల్లిలోని రెండో మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు అదనపు న్యాయమూర్తి వినోద్ కుమార్ తీర్పును వెల్లడించారు. ఈ కేసులో ఏ-11గా ఉన్న అల్లు అర్జున్ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్పై ఉండగా తాజాగా నాంపల్లి కోర్టు షరతులతో కూడిన సాధారణ బెయిల్ ఇచ్చింది. హత్య, హత్యకు సూత్రధారిగా అల్లు అర్జున్పై పోలీసులు నమోదు చేసిన సెక్షన్లు వర్తించవంటూ తాము చేసిన వాదనలతో న్యాయస్థానం ఏకీభవించి బెయిల్ మంజూరు చేసిందని బన్ని తరపు న్యాయవాదులు తెలిపారు.
పోలీసులు సమర్పించిన సాక్ష్యాధారాల ప్రకారం ఈ కేసులో అల్లు అర్జున్పై మోపిన బీఎన్ఎస్లోని 105వ సెక్షన్ వర్తించదంటూ తాము వినిపించిన వాదనలను కోర్టు విశ్వసించిందని లాయర్లు చెప్పారు. కాగా, పోలీసులు పూర్తి చార్జిషీట్ దాఖలు చేసే వరకు 2 నెలల పాటు అల్లు అర్జున్ ప్రతి ఆదివారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు చిక్కడపల్లి పోలీసుల ఎదుట విచారణకు హాజరవ్వాలని కోర్టు ఆదేశించింది. న్యాయస్థానం అనుమతి లేకుండా దేశం విడిచి ఎక్కడికి వెళ్లరాదని తెలిపింది. రూ.50 వేల విలువ గల రెండు పూచీకత్తులు సమర్పించాలని షరతుల్లో పేర్కొంది. (ఏజెన్సీలు)