TSRTC: ఉద్యోగులకు కార్పొరేట్ స్థాయి వైద్యం : ఆర్టిసి చైర్మన్

హైదరాబాద్ : ప్రస్తుత యాంత్రిక జీవనంలో ప్రతి ఒక్కరూ సరైన జీవన ప్రమాణాలు పాటించి ఆరోగ్యాన్ని అదుపులో ఉంచుకోవడం ఎంతైనా అవసరం. ఆరోగ్యమైన జీవన వికాసం కొనసాగించినట్లయితే అటు వ్యక్తిగత, ఇటు ఉద్యోగ జీవితాల్లోనూ మంచి ఫలితాలు వస్తాయి. అందుకోసం సంస్థ ఉద్యోగులు ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో గ్రాండ్ హెల్త్ ఫిట్నెస్ ఛాలెంజ్ పేరిట నవంబరు మాసంలో ప్రత్యేకంగా హెల్త్ డ్రైవ్ కార్యక్రమాన్ని గౌరవ టిఎస్ ఆర్టిసి చైర్మన్, నిజామాబాద్ గ్రామీణ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ బాజిరెడ్డి గోవర్ధన్ ప్రారంభించి విజయవంతంగా సంస్థ ఉద్యోగులకు మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యంతో హెల్త్ ఛాలెంజ్ ను అన్ని డిపోలు, యూనిట్లలో నిర్వహించి ఆరోగ్య సమస్యలపై మార్గనిర్దేశం చేయడం జరుగుతోంది.

ఈ సందర్భంగా టిఎస్ ఆర్టిసి సంస్థ చైర్మన్, నిజామాబాద్ గ్రామీణ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ.. ఆరోగ్య సంక్షేమంలో భాగంగా ఈ హెల్త్ ఛాలెంజ్ కార్యక్రమం కొనసాగుతుంది. 4898 మంది మహిళా ఉద్యోగినీలతో సహా 50 వేల మందికి పైగా ఉన్న సిబ్బందికి వైద్య పరీక్షల నిర్వహణ కోసం అన్ని రీజియన్లలో 25 వైద్య బృందాలు పాల్గొని సేవలు అందించనున్నాయి. టిఎస్ఆర్టిసి సంస్థలో ఇప్పటివరకు 20,000 మంది ఉద్యోగుల ఆరోగ్య పరీక్షల వివరాలను సేకరించుకొని, వందమంది ఉద్యోగులు అత్యవసర పరిస్థితుల వల్ల వారి యొక్క ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఆసుపత్రిలో చేర్చడం జరిగిందని చెప్పారు. ఎవరైతే ఆరోగ్య పరీక్షల్లో ఎమర్జెన్సీ లక్షణాలు కనిపిస్తే తక్షణమే డాక్టర్ల సూచన మేరకు ఆస్పత్రిలో మెరుగైన చికిత్స కోసం చేర్చడం జరుగుతుందని చెప్పారు.

సంస్థ ఉద్యోగులు రాష్ట్రవ్యాప్తంగా తార్నాక ఆసుపత్రిలో వైద్య సేవల కోసం వివిధ జిల్లాల నుండి వస్తు ఉంటారు. వారికోసం వైద్య పరీక్షలతో పాటు మెరుగైన చికిత్స మరియు అవసరమైన మందులను కూడా ఇక్కడే సిబ్బంది ఉచితంగా అందజేస్తున్నామని సంస్థ చైర్మన్ చెప్పారు. తార్నాక ఆసుపత్రిలో 24 గంటల ఫార్మసీ మరియు డయాగ్నస్టిక్ సేవలు కార్డియాలజీ, నేఫ్రాలజీ, గైనిక్ సేవల కోసం పూర్తిస్థాయి సిబ్బంది పనిచేస్తుందని చెప్పారు. ఈసీజీ, ఐసీయూ సేవలు అందుబాటులోకి రావడంతో ఆర్టీసీ ఉద్యోగులు ప్రైవేటు ఆసుపత్రిలను కాకుండా సంస్థ సిబ్బందిని నిమ్స్ ఆసుపత్రికి రిఫర్ చేయడం జరుగుతుందని చెప్పారు. తార్నాక ఆసుపత్రిలో గతంతో పోలిస్తే ఆసుపత్రిలో వైద్యం కోసం వచ్చే ఉద్యోగులు మరియు బయట నుంచి వచ్చేవారు (ఔట్ పేషెంట్స్) పెరుగుతున్నారని చెప్పారు.

తార్నాక ఆసుపత్రిలో అన్ని రకాల వైద్య సేవలు మరియు పరీక్షలు అందుబాటులో ఉన్నాయని ఇంకా ఇక్కడ లేని సౌకర్యాల కోసం అవసర నిమిత్తం నిమ్స్ ఆసుపత్రికి రిఫర్ చేయడం జరుగుతుందని చెప్పారు. ఆర్టీసీ ఉద్యోగులకు మెరుగైన వైద్యాన్ని అందిస్తున్న నిమ్స్ సిబ్బందికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందనే వాస్తవాన్ని మరవకూడదు. ముఖ్యంగా నిత్య జీవితంలో వచ్చే అనేక రుగ్మతలకు మానసిక స్థితిగతులే కారణం. గౌరవ ముఖ్యమంత్రివర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారి సహకారంతో ప్రతి ఆర్టీసీ ఉద్యోగిని కంటికి రెప్పలా కాపాడుకుంటామని చెప్పారు. టి ఎస్ ఆర్ టి సి సంస్థ సిబ్బంది ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని అన్ని రకాల వైద్య సౌకర్యాలు సంస్థ కల్పిస్తుందని టిఎస్ ఆర్టిసి చైర్మన్, నిజామాబాద్ గ్రామీణ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ బాజిరెడ్డి గోవర్ధన్ స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X