हैदराबाद में दर्दनाक हादसा, मैनहोल में गिरकर चौथी कक्षा छात्रा की मौत

हैदराबाद : शहर में एक दर्दनाक हादसा हुआ। जीएचएमसी के अधिकारियों की लापरवाही के कारण एक छात्रा की जान चली गई। कलासिगुड़ा में खुले मैनहोल में गिरने से एक बच्ची की मौत हो गई। मृतक बच्ची की पहचान उसी इलाके की रहने वाली मौनिका के रूप में की गई है। सुबह दूध का पैकेट लेने निकली मौनिका मैनहोल में गिर गई, क्योंकि भारी बारिश के कारण सड़कों पर पानी भर गया था। बच्ची उसे नहीं देख पाई।

कलासिगुड़ा मैनहोल में डूब चुकी मौनिका पार्कलाइन में मृत पाई मिल गई। डीआरएफ कर्मियों ने बच्ची के शव को बरामद किया। मौनिका चौथी कक्षा में पढ़ रही थी। बच्ची की मौत से उसके परिवार में मातम छा गया है। अतीत में भी कई बच्चे मैनहोल में फंसकर अपनी जान गंवा चुके हैं। स्थानीय लोगों में गुस्सा है कि जीएचएचसी स्टाफ की लापरवाही के कारण बच्ची की मौत हो चुकी है।

यह भी पढ़िए :

హైదరాబాద్‌లో విషాదం, మ్యాన్‌హోల్‌లో పడి చిన్నారి మృతి

హైదరాబాద్‌ : నగరంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. జీహెచ్‌ఎంసీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. కళాసిగూడలో తెరిచి ఉన్న మ్యాన్‌హోల్‌లో పడి బాలిక ప్రాణాలు కోల్పోయింది. మృతి చెందిన చిన్నారి అదే ప్రాంతానికి చెందిన మౌనికగా గుర్తించారు. ఉదయం పాల ప్యాకెట్ కోసం ఇంటి నుంచి బయటకు వెళ్లిన మౌనిక భారీ వర్షం కారణంగా రోడ్లు జలమయం కావటంతో మ్యాన్‌హోల్‌ను గమనించకుండా అందులో పడిపోయింది.

కళాసిగూడలో గల్లైంతైన చిన్నారి మౌనిక పార్క్‌లైన్ వద్ద శవమై తేలింది. డీఆర్‌ఎఫ్ సిబ్బంది పాప మృతదేహాన్ని గుర్తించారు. మౌనిక నాలుగో తరగతి చదవుతుండగా చిన్నారి మృతితో ఆమె కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గతంలోనూ మ్యాన్‌హోల్‌లో చిక్కుకొని పలువురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయినా జీహెచ్‌హెంసీ సిబ్బంది మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు.

చిన్నారి మృతికి కారణం ఎవరు. ఓ నిండు ప్రాణం పోవడానికి కారణం ఏమిటి. నిర్లక్ష్యమా బాధ్యతా రాహిత్యమా ఈ రెండే ప్రధానంగా వెలుగుచూస్తున్న కారణాలు. సికింద్రాబాద్ కళాసిగూడలో చిన్నారి మౌనిక మృతిలో నిర్లక్ష్యం బాధ్యతా రాహిత్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి.

నగరం నడిబొడ్డున సికింద్రాబాద్ ఏరియాలో వర్షం దంచికొట్టింది. ఈ సమయంలో జీహెచ్ఎంసీ, ప్రభుత్వం నుంచి సహాయక చర్యలు ఉండాలి. ప్రజలను అప్రమత్తం చేస్తూ అవగాహన కల్పించాలి. కానీ అవేమి లేవు. తెల్లవారుజాము నుంచే భారీ వర్షం కురిసినా ఒక్క అధికారి కానీ ఒక్క సిబ్బంది కానీ రోడ్డుపైకి రాలేదు. ఇది నిర్లక్ష్యానికి పరాకాష్ట. అదే సిబ్బంది కానీ అధికారులు కానీ చర్యలను ఎప్పుటికప్పుడు పర్యవేక్షిస్తే ఈ ఘోరం జరిగేదా..అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. 

ఇది ఎండాకాలం ఇవన్నీ అకాల వర్షాలు అయినా చర్యల్లేవు. ముందస్తు జాగ్రత్తల్లేవ్. ఎండాకాలంలోనే వచ్చే అకాల వర్షాలపై ప్రభుత్వం, జీహెచ్ఎంసీ ఇంత నిర్లక్ష్యంగా ఉంటే ఇక వర్షాకాలంలో ఇంకెంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందో. ఈ నిర్లక్ష్యానికి ఇంకెంత మంది బలి కావాలో అని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.(ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

Archives

Categories

Meta

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

Close Welcome Bar