హైదరాబాద్ : క్రిస్మస్ సందర్బంగా ఈ నెల 21.వ తేదీన ఎల్బీ స్టేడియంలో నిర్వహించనున్న క్రిస్మస్ వేడుకల ఏర్పాట్లపై సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ లో స్టేడియంలో అన్నీ ప్రభుత్వ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు.
ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది ముఖ్యమంత్రి కెసీఆర్ గారు క్రైస్తవ సోదరులకు ఈ సందర్భంగా విందు ఇవ్వనున్నారని మంత్రి కొప్పుల ఈశ్వర్ వెల్లడించారు, ఎల్బీ స్టేడియంలో క్రిస్మస్ ఏర్పాట్లను మంత్రి కొప్పుల ఈశ్వర్ అధికారులతో కలిసి పరిశీలించారు.