“తెలంగాణ ప్రజల సంక్షేమం బీఆర్ఎస్ కార్యకర్తల కర్తవ్యం”

‌- దేశంలో ఎవ్వరూ చేయనన్ని మంచి పనులు కేసీఆర్ చేశారు

‌- ఆర్మూర్ లో జీవన్ రెడ్డి విజయం తధ్యం

‌- ఆయన మీద ఎవరైనా పోటీ చేస్తే మైసమ్మ ముంగట మేకపోతును కట్టేసినట్టే

నమస్తే తెలంగాణ, టీ న్యూస్ ను ప్రోత్సహించాలి

ఈ పత్రిక ఛానల్లో వచ్చే అభివృద్ధి కథనాలను ప్రజలకు చేరువ చేయండి

‌- నిజామాబాద్ లో ఈఎస్ఐ ఆస్పత్రి

‌- మాక్లూర్ ఆత్మీయ సమ్మేళనంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

నిజామాబాద్, మాక్లూర్ : తెలంగాణ ప్రజల సంక్షేమం బీఆర్ఎస్ కార్యకర్తల లక్ష్యం, కర్తవ్యం అని ఆ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. దేశంలో ఇప్పటి వరకు ఎవ్వరూ చేయలేనన్ని మంచి పనులను సీఎం కేసీఆర్ చేసి చూపించారని, జరిగిన అభివృద్ధిని, అందిస్తున్న పథకాల గురించి ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మంగళవారం రోజున నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలంలో జరిగిన బీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో రాష్ట్ర మంత్రి చామకూర మల్లా రెడ్డితో కలిసి కవిత పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అద్భుతంగా పనిచేస్తున్నారని ప్రశంసించారు. స్థానిక ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గత ఎన్నికల్లో కంటే అధిక మెజారిటీతో వచ్చే ఎన్నికల్లో గెలుస్తారన్న విశ్వాసం ఉందన్నారు. ఆర్మూర్ నియోజకవర్గంలో జీవన్ రెడ్డి మీద ఎవరైనా పోటీ చేయాలనుకుంటే మైసమ్మ ముంగట మేకపోతును కట్టేసినట్టే అవుతుందని తెలియజేశారు. కాబట్టి ఇతర పార్టీల నేతలు గెలిచే అవకాశం లేనందుకు ఆశలు వదిలేసుకుంటే మంచిదని సూచించారు.

ప్రతి ఒక్క కార్యకర్త, నాయకుడు మన పార్టీ స్థాపించిన నమస్తే తెలంగాణ పత్రికతో పాటు టీ న్యూస్ ఛానల్ ను ప్రోత్సహించాలని సూచించారు. ప్రతి ఒక్కరు పత్రికను చదివేల, టీ న్యూస్ ఛానల్ ను చూసేలా చేయాలని, అందులో వచ్చే తెలంగాణ అభివృద్ధికి సంబంధించిన కథనాలను ప్రజలకు తెలియచెప్పాలని అన్నారు. మండల స్థాయిలో గ్రామస్థాయిలో అధ్యక్షులు చొరువ తీసుకుని టీ న్యూస్ లో సబ్స్క్రైబ్ చేయించాలని పిలుపునిచ్చారు.

ఒకప్పుడు ఇదేమి పార్టీ అని అవహేళన చేశారని, కానీ ఇప్పుడు అదే గులాబీ పార్టీ ఇంటికి మూడు పథకాలు అందించే స్థాయికి ఎదిగిందన్నారు. పది మందికి సాయం చేశామంటే ఆ రోజు రాజకీయ నాయకులకు ప్రశాంతంగా నిద్రపడుతుందన్నారు. “మీరు చేసిన త్యాగం ఇవాళ తెలంగాణలో ఇస్తున్నటువంటి ప్రతీ పథకం. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు చిందించినటువంటి స్వేధం… చెరువుల్లో కనిపిస్తున్న మంచినీటి చుక్కలు. బీఆర్ఎస్ కార్యకర్తల త్యాగం … ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు రూపంలో తెలంగాణ మొత్తానికి నీటి కుండలాగా తరతరలాకు ఆదుకునే ప్రాజెక్టు. మనది ఉట్టి రాజకీయ పార్టీ కాదు. ఎంతో కష్టంతో, కోపంతో, ఆవేదనతో, ప్రేమతో పుట్టుకొచ్చిన పార్టీ. ప్రజలను బాగు చేయాలని భావించిన పార్టీ మనది ” అని కార్యకర్తలను ఉద్ధేశించి వ్యాఖ్యానించారు.

గత 10 ఏళ్లలో దేశంలో ఎవ్వరూ చేయనన్ని మంచి పనులు బీఆర్ఎస్ పార్టీ చేసి చూపెట్టిందని స్పష్టం చేశారు. మరింత బాధ్యతగా పనిచేద్దామని పిలుపునిచ్చారు. మనకు ఇతర రాజకీయ ఆలోచనలు లేవని, ప్రజలకు మంచి చేయాలన్నదే ప్రధాన ఆలోచన అని స్పష్టం చేశారు. తెలంగాణకు బాగుపడాలని కోరుకునేవాళ్లమని చెప్పారు.

రెండు దశాబ్దాల నుంచి ప్రజల్లో ఉన్న నాయకులు ఈ మండలంలో ఉన్నారని చెప్పారు. అనేక మంది కార్యకర్తలు, నాయకులు గులాబీ కండువాకు అంకితమయ్యారని కొనియాడారు. తమ పార్టీ విస్తరిస్తోందని, ప్రజలకు మంచి జరగాలన్నది మొదటి ఉద్దేశమని, మనకు పదవులు రావడం అన్నది రెండో ఉద్దేశమని అన్నారు. సీఎం కేసీఆర్ లక్ష్యాన్ని, తెలంగాణ ప్రజల ఆశయాలను, అమరవీరుల త్యాగాలను, జయశంకర్ సార్ స్పూర్తిని తీసుకకొని ముందుకెళ్తున్న పార్టీ బీఆర్ఎస్ అని, ఇటువంటి పార్టీలో ప్రతీ ఒక్కరికి అవకాశాలు వస్తాయని, మంచి పదవులు వస్తాయని స్పష్టం చేశారు.

లక్షా 33 వేల మంది బీడీ కార్మికులకు నిజామాబాద్ జిల్లాలో పెన్షన్ అందుతోందని, కాబట్టి ప్రత్యేకించి బీడీ కార్మికుల కోసం ఈఎస్ఐ ఆస్పత్రిని నిర్మించాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లా రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఈ ఆస్పత్రిని నిర్మిస్తే కామారెడ్డి ప్రాంతంలో ఉన్న కార్మికులకు కూడా ఉపయోగపడుతుందని చెప్పారు. భవన నిర్మాణ కార్మికులు నిజామాబాద్ లో పెద్ద సంఖ్యలో ఉంటారని, వారికి బీమా సౌకర్యం కల్పించి ఆదుకోవాలని కోరారు.

నిజామాబాద్: మాక్లుర్ బి అర్ ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి మల్లారెడ్డి స్పీచ్

నిజామాబాద్ జిల్లాలోని బీడీ కార్మికుల కోసం ఈ ఎస్సై ఆసుపత్రి మంజూరు. భవన నిర్మాణ కార్మికుల సంఘం కోసం కొత్త భవనం ఏర్పాటు. బిజెపి దివాలా దిసిన పార్టీ. కాంగ్రెస్ బిజెపి లు ప్రజలకు చేసింది ఏమి లేదు. నమ్మకానికి విశ్వాసానికి మారు పేరు బి అర్ ఎస్. మోసపోయి నిజామాబాద్ ఎంపి గా అరవింద్ ను గెలిపించారు. కానీ ఈసారి జిల్లా ప్రజలు కవిత గారిని భారీ మెజారిటీ తో గెలిపించాలని.

దేశంలో తెలంగాణ వంటి అభివృద్ధి సంక్షేమం ఎక్కడ లేదు.18 రాష్ట్రాలను పాలించిన బిజెపి కానీ, మొన్నటి వరకు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ హాయంలో కానీ ఇలాంటి అభివృద్ధి జరగలేదు. మళ్ళీ అధికారం లోకి వస్తం అంటున్నారు…ఎం ఒకం పెట్టుకొని ప్రజల్లోకి వస్తారు. ప్రజలు చిపుల్ల తో సమాధానం ఇస్తారు.

ప్రతి పక్షాల్లో పట్టుమని పది మంది కూడా గెలవరు. తెలంగాణ కు కేసీఆర్ గారు సీఎం గా ఉండటం మన గొప్ప అదృష్టం. కాంగ్రెస్ హయం లో చెరువులు ఖబ్జా లకు గురైతే కేసీఆర్ పాలనలో చెరువుల పునరుద్ధరణ జరుగుతుంది. ఇంకా మాయ మాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దు. పక్క రాష్ట్ర లలో తెలంగాణ పథకాలు చూసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయిన ఇక్కడి ప్రతి పక్షాలకు బుద్ది వస్థలేదు.

జెడ్పీ ఛైర్మెన్ విఠల్ రావు స్పీచ్

బి అర్ ఎస్ కు కార్యకర్తలు బలం. బిఆర్ఎస్ పార్టీలో అందరికీ అవకాశాలు వస్తాయి.. పార్టీ ఆదేశాలు మేరకు ఓపికగా పనిచేయాలి. కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటాం. ఈరోజు తమలాంటివారు ఉన్నత పదవుల్లో ఉన్నారంటే అది కార్యకర్తల బలంతోనే సాధ్యమైంది. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను గజ్జల్లోకి తీసుకెళ్లటంలో కార్యకర్తలు సైనికుల పనిచేయాలి.

ప్రభుత్వం సాధించిన విజయాలు అభివృద్ధి పనులు అందరికీ తెలిసేలా తెలంగాణ దశాబ్ది వేడుకలు ఘనంగా నిర్వహించుకుందాం. ఎంతోమంది ఉన్నత నాయకులను తీర్చిదిద్దిన గడ్డ మా క్లుర్. మరోసారి తన చైతన్యాన్ని చాటుకోవాలి. తండ్రికి తగ్గ తనయుడు కేటీఆర్ తనయ కవిత. వారి సారాధ్యంలో తెలంగాణకు మరింత మంచి భవిష్యత్తు ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X