दिल्ली में बीजेपी और एमएलसी कविता का प्रतिस्पर्धा विरोध प्रदर्शन, नारों से गूंज रहे हैं प्रदर्शन के परिसर

हैदराबाद: दिल्ली में बीजेपी और एमएलसी के कविता का विरोध प्रदर्शन जारी है। बीजेपी ने दिल्ली शराब घोटाले के विरोध में प्रदर्शन कर रही है। बीजेपी ने आंध्र एजुकेशन सोसाइटी के पास आम आदमी पार्टी के खिलाफ धरना शुरू किया है, जो पार्टी के कार्यालय से ज्यादा दूर नहीं है। दरअसल, बीजेपी ने जंतर-मंतर पर ही यह धरना प्रदर्शन करने का फैसला किया है। लेकिन पुलिस ने अनुमति नहीं दी।

दूसरी ओर एमएलसी कल्वकुंट्ला कविता ने दिल्ली के जंतर मंतर पर धरना शुरू किया। धरना सुबह 10 से शाम 4 बजे तक चलेगा। कविता विधानसभाओं में महिलाओं के लिए आरक्षण लागू करने की मांग को लेकर धरना कर रही हैं। कविता के धरने को देश की 18 पार्टियां समर्थन कर रही है। साथ ही महिला अधिकार संगठन के नेताभाग लिया है। दोनों के प्रदर्शन के परिसर नारों से गूंज रहे हैं।

संबंधित खबर :

ఢిల్లీలో పోటాపోటీగా నిరసన దీక్షలు

హైదరాబాద్ : ఢిల్లీలో పోటాపోటీగా నిరసన దీక్షలు ప్రారంభమయ్యాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు వ్యతిరేకంగా బీజేపీ నిరసన చేపట్టింది. ఆమ్‌ ఆద్మీ పార్టీకి వ్యతిరేకంగా ఆ పార్టీ కార్యాలయానికి కొద్ది దూరంలో ఉన్న ఆంధ్ర ఎడ్యుకేషన్‌ సొసైటీ దగ్గర బీజేపీ ధర్నాకు దిగింది. వాస్తవానికి జంతర్‌మంతర్‌లోనే ఈ నిరసన తెలపాలని బీజేపీ నిర్ణయించింది.

దీనికి అనుమతి కోసం బీజేపీ దరఖాస్తు సైతం చేసుకుంది. అయితే భారత జాగృతి సంస్థ మహిళా రిజర్వేషన్‌ బిల్లు ప్రవేశ పెట్టాలంటూ జంతర్‌మంతర్‌లోనే మార్చి 10వ తేదీన దీక్ష చేస్తోంది. ముందుగానే అనుమతి కూడా తీసుకుంది. ఆ తర్వాత బీజేపీకి దీన్ దయాల్ మార్గ్ లో నిరసన దీక్ష చేపట్టేందుకు అవకాశం ఇచ్చారు. 

ఇటు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఢిల్లీలోని జంతర్‌మంతర్‌లో నిరసన దీక్ష చేపట్టారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల దాకా దీక్ష కొనసాగనుంది. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్‌లు అమలు చేయాలనే డిమాండ్‌తో కవిత దీక్ష చేస్తున్నారు. ఈ దీక్షకు దేశవ్యాప్తంగా 18 పార్టీల ప్రతినిధులు సంఘీభావం ప్రకటించారు. దేశంలోని మహిళా హక్కుల సంఘాలు, వివిధ పార్టీల నేతలు ఈ దీక్షకు హాజరుకానున్నారు. 

హైదరాబాద్ బీజేపీ ఆఫీసులో ఆ పార్టీ నాయకులు ‘మహిళా గోస -బీజేపీ భరోసా’ పేరుతో దీక్ష చేపట్టారు. రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోందని మహిళా మోర్చా ఆందోళన వ్యక్తం చేస్తోంది. లిక్కర్ కట్టడి చేయాలని డిమాండ్ చేస్తూ దీక్ష ప్రారంభించింది. రాష్ట్రంలో బెల్టు షాపుల దందాపై మహిళా మోర్చా ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ కార్యక్రమంలో డీకే అరుణ, విజయశాంతి, ఇతర ముఖ్యనేతలు పాల్గొననున్నారు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

Archives

Categories

Meta

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

X