హైదరాబాద్ : భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో భాగ్యలక్ష్మీ ఆలయం దగ్గర బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి, బిజెపి మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు డాక్టర్ శిల్పారెడ్డి ఒక ప్రకటనలో… పాతబస్తీలోని భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయం దగ్గర నిర్వహించిన బతుకమ్మ వేడుకలకు వివిధ జిల్లాల నుంచి పెద్దఎత్తున తరలివచ్చిన ఆడబిడ్డలు, యువతులందరికీ హృదయపూర్వక ధన్యావాదాలు తెలియజేస్తున్నాం. బతుకమ్మ వేడుకలను సజావుగా నిర్వహించుకునేలా అనుమతి ఇచ్చిన ఉన్నత న్యాయస్థానానికి (హైకోర్టు), రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా, భారీ వర్షంలోనూ వేడుకలను కవర్ చేసేందుకు వచ్చిన మీడియా ప్రతినిధులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.

బిజెపి మహిళా మోర్చా ఆధ్వర్యంలో పాతబస్తీలో ప్రశాంత వాతావరణంలో, అత్యంత భక్తి శ్రద్ధలతో బతుకమ్మ వేడుకలు జరుపుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వం అడుగడుగునా అడ్డంకులు సృష్టించి, ద్వేషం చూపించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. పోలీసు వ్యవస్థ ఎంఐఎం చేతిలో కీలుబొమ్మగా మారిందనడానికి ఇదే నిదర్శనం. మహిళలకు అలవిగాని హామీలిచ్చి, వారి ఓట్లతో అధికారంలోకి వచ్చి ఇప్పుడు ఆడబిడ్డలు ఘనంగా జరుపుకునే బతుకమ్మ వేడుకలను పక్కనపెట్టడం తెలంగాణ సంస్కృతిని, మహిళాలోకాన్ని అవమానించడమే.
Also Read-
హైకోర్టు ఉత్తర్వులను సాకుగా చూపి, రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ వేడుకలు నిర్వహించుకోకుండా ఆంక్షలు విధించడం దుర్మార్గమైన చర్య. తెలంగాణ పోరాట చరిత్రను తప్పుదోవ పట్టించేలా, సంస్కృతిని కించపర్చేలా కుట్ర జరుగుతోంది. అసలు హిందూ పండుగలంటే ఎందుకింత కడుపు మంటనో స్పష్టం చేయాలి. పాతబస్తీ పాకిస్తాన్ లోనో, బంగ్లాదేశ్ లోనే లేదనే విషయం గుర్తెరగాలని హెచ్చరిస్తున్నాం. నిరంకుశ నిజాం వారసత్వ ఎంఐఎంకు భయపడి కాంగ్రెస్ పార్టీ హిందువులపై, తెలంగాణ సంస్కృతిపై విషం చిమ్ముతోంది.
నాటి నిజాం పాలనలో నలిగిపోయిన తెలంగాణ గ్రామీణ సమాజంలో మహిళల బతుకులు దుర్భరంగా ఉండేవి.. వారి అకృత్యాలకు నలిగిపోయిన వారిని, ఎదురుతిరిగి వీరోచిత పోరాటం చేసిన మహిళలకు ప్రతీకగా పూలను పేర్చి వేడుకలు జరుపుకుంటాం. అయితే ఆనాడు నిజాం పాలన తరహాలోనే నేటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎంఐఎం పార్టీకి తొత్తులుగా మారి బతుకమ్మ పండుగపై ధ్వేషం చూపించడాన్ని తెలంగాణ సమాజం ఏమాత్రం సహించదు అని హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా బతుకమ్మ పండుగను గౌరవించి, ఆడబిడ్డలను గౌరవించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచిస్తున్నాం. లేదంటే నాటి నిజాంకు పట్టిన గతే కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టక తప్పదని హెచ్చరిస్తున్నాం.
కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలంగాణ ఆడబిడ్డలంటే, మహిళల పండుగలంటే అలుసు. మహిళలపై వివక్ష చూపుతూ వారిపై అనుచితంగా దూషించడం ఆ పార్టీ నాయకులకు పరిపాటిగా మారింది. మొన్నటికి మొన్న బీజేపీ హిమాచల్ ప్రదేశ్ మండి ఎంపీ, బాలీవుడ్ సినీ నటి కంగనా రనౌత్ గారిపై ఖైరతాబాద్ కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ గారు అనుచిత వ్యాఖ్యలు చేసి దూషించారు. సినీ ప్రముఖులపై, నటి వ్యక్తిగత జీవితంపై కాంగ్రెస్ మహిళా ఎమ్మెల్యే దురుసు భాష, విమర్శలు.. ఇలా అనేక రకాలుగా మహిళలను చిన్నచూపు చూస్తూ అవమానాలకు గురిచేస్తున్నారు. ఇటువంటి చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇంత జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోకుండా మౌనం వహించడం తగదు. మహిళలను అవమానిస్తే, హిందూ పండుగలపై విధ్వేషం కక్కితే తీవ్ర పరిణామాలుంటాయని భారతీయ జనతా పార్టీ హెచ్చరిస్తోంది.