Hyderabad: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమావేశం ముగిసింది. ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ లోని అన్ని నియోజకవర్గాల పరిశీలకులు, జిల్లా అధ్యక్షులు, రీజనల్ కో ఆర్డినేటర్లు హాజరయ్యారు. రానున్న ఎన్నికల నేపథ్యంలో నేతలకు సీఎం జగన్ దిశా నిర్దేశం చేశారు.
సీఎం జగన్ ఈ సందర్భంగా కీలక ప్రకటన కూడ చేశారు. 5 లక్షల 20 వేల మంది గ్రామ సారథులను నియమించాలని పార్టీ నేతలను ఆదేశించారు. క్లస్టర్కి ఇద్దరు గ్రామ సారథులు నియమించాలన్నారు. ప్రతి సచివాలయం పరిధిలో ముగ్గురు కన్వీనర్లు నియామకం చేపట్టాలన్నారు. ప్రతి 50 కుటుంబాలు ఒక క్లస్టర్గా గుర్తించాలని సీఎం జగన్ ఆదేశాలిచ్చారు. రానున్న ఎన్నికల కొరకు అందరు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు