హైదరాబాద్ : సరూర్ నగర్ మైదానంలో యువ సంఘర్షణ సభ లోగోను ఆవిష్కరించిన ఏఐసీసీ ఇంచార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఇతర నేతలు. 8న యువ సంఘర్షణ సభ నేపథ్యంలో సభాస్థలి పరిశీలన సభకు ఏఐసీసీ అగ్రనేత శ్రీమతి ప్రియాంక గాంధీ ముఖ్యఅథిగా రానున్న నేపథ్యంలో ఏర్పాట్ల వివరాలు తెలుసుకున్న నేతలు.
టీపీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… ఈ నెల 8న సరూర్ నగర్ స్టేడియంలో యువ సంఘర్షణ సభ నిర్వహించబోతున్నాం. గతంలో వరంగల్ డిక్లరేషన్ పేరు మీద రాహుల్ గాంధీ రైతు డిక్లరేషన్ విడుదల చేశారు. అదే స్పూర్తితో హైదరాబాద్ డిక్లరేషన్ ను సరూర్ నగర్ సభలో విడుదల చేస్తాం.
విద్యార్థులు, నిరుద్యోగులు, అమరవీరుల కుటుంబాలను ఎలా ఆదుకుంటామో హైదరాబాద్ డిక్లరేషన్ లో ప్రకటిస్తాం. టీఎస్పీఎస్సీ ని యూపీఎస్సీ తరహాలో నియమించి ఉద్యోగ నియామకాలు ఎలా చేపడతామో సభలో వివరిస్తాం. ప్రియాంక గాంధీ సభలో ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేస్తారు. ఉద్యోగాలు ఇవ్వండని కేసీఆర్ ను అడగడం కాదు. కేసీఆర్, కేటీఆర్ ఉద్యోగాలు ఊడగొడితేనే నిరుద్యోగులకు న్యాయం జరుగుతుంది. అందుకే ఈ యువ సంఘర్షణ సభ. ఈ సభకు పార్టీలకు అతీతంగా మద్దతుగా తరలి రావాలి. విద్యార్థి, నిరుద్యోగులందరూ సభను విజయవంతం చేయాలి. కేసీఆర్ విముక్త తెలంగాణ తీసుకొచ్చేందుకు సహకరించాలని కోరుతున్నాను.
వరంగల్ రైతు డిక్లరేషన్ మాదిరిగానే, హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ ను ఈ నెల 8వ తేదీన జరిగే యువ సంఘర్షణ సభలో ప్రియాంక గాంధీ గారి నేతృత్వంలో ప్రజల ముందుకు తీసుకురాబోతున్నాం.
— Telangana Congress (@INCTelangana) May 5, 2023
-టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు.#HyderabadYouthDeclaration#YuvaSangharshanaSabha pic.twitter.com/KpfkysGd4w
మాణిక్ రావ్ ఠాక్రే, ఏఐసీసీ ఇంచార్జ్ మాట్లాడుతూ… విద్యార్థి , నిరుద్యోగుల మద్దతుగా మేము ఉన్నామని చెప్పడానికి ప్రియాంక గాంధీ ఇక్కడకు వస్తున్నారు. నిరుద్యోగులపట్ల తెలంగాణ ప్రభుత్వ తీరును ఎండగట్టేందుకే యువ సంఘర్షణ సభ. నిరుద్యోగులకు భరోసా కల్పించి వారిలో నమ్మకాన్ని కలిగించేందుకు ప్రియాంక గాంధీ వస్తున్నారు. సభను విజయవంతం చేయాలని కోరుతున్నాను.
కర్ణాటకలో ఒడిపోతామన్న భయంతోనే బీజేపీ మా పార్టీ కార్యాలయాల వద్ద నిరసనలు చేపడుతోంది. ఈ రకమైన పోకడలు తెలంగాణ రాజకీయ సంస్కృతి మంచిదా? బండి సంజయ్, కిషన్ రెడ్డికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇలాంటి చర్యలతో మీ గౌరవం తగ్గుతుంది తప్ప పెరగదు