मेडारम जातरा में महत्वपूर्ण क्षण, सिंहासन पर सम्मक्का, भक्तों के जयघोष नारों से गूंज उठा वन

हैदराबाद: तेलंगाना के मेडारम जातरा में एक अहम पल का आविष्कार हुआ। वन देवताओं के नाम स्मरण से पूरा वन गूंज उठा। देवी सम्मक्का को सिंहासन (गद्दे) पर प्रतिष्ठित किया गया। भक्त चिलकलगुट्टा से सम्मक्का की प्रतिकृति लेकर आये। सम्मक्का को आदिवासी पुजारियों द्वारा ढोल और शिवसत के बीच एक जुलूस के रूप में लेकर आये। भक्तों ने सम्मक्का का जयकार नारों के साथ स्वागत किया। सम्मक्का को सिंहासन पर स्थापित किया।

इस बीच, पूरा मेडारम जातरा श्रद्धालुओं से खचाखच भर गया। मेडारम के परिवेश के साथ ही जय सम्मक्का के नाम स्मरण से गूंज उठा। पुनुगोंडला से पगिडिद्दीराजू और कोंडाई से गोविंदराजू सिंहासन के पास पहुंचे और भक्तों को दर्शन दिये और दे रहे हैं। मेडारम गद्दे पर इस अद्भुत दृश्य को देखने के लिए बड़ी संख्या में श्रद्धालु उमड़ पड़े। जंगल में सम्मक्का-सारलम्मा के नाम स्मरण से आनंदित हो उठा है।

सम्मक्का के आगमन की तैयारियां सुबह से ही शुरू हो गईं थी। पुजारियों ने जंगल से बांस और अडेरा लेकरआये और सिंहासन पर रख दिया। शाम को प्रधान पुजारी के नेतृत्व में पुजारियों का एक समूह चिलुकलागुट्टा जंगल में गया। वहाँ से मुख्य पुजारी अकेले ही टीले (पहाड़) पर गये। वहां पूजा की सारी कार्यवाही रीति-रिवाज के अनुसार गुप्त रूप से की गई। उसके बाद वे माँ सम्मक्का को लेकर नीचे चले आये। केसर बरनी के रूप में चिलकलगुट्टा से उतरने के बाद सम्मक्का सिंहासन के पास आई। सम्मक्का का स्वागत के लिए सड़क के किनारे सुंदर रंगोली की व्यवस्था की गई।

सरकार की ओर से मंत्री सीताक्का ने मेडारम में वन छोड़कर लोगों के बीच आई सम्मक्का का भव्य स्वागत किया। एसपी सबरीश ने हवाई फायरिंग कर सरकारी समारोह का स्वागत किया। सम्मक्का के आगमन का संकेत देने वाली इस ध्वनि के साथ ही चिलकलागुट्टा का क्षेत्र अचानक भक्ति से भर गया। सरकार की ओर से मंत्री सीताक्का ने स्वागत किया। जब सम्मक्का पहाड़ से नीचे आईं तो सभी भक्त, जो आंखें बिछाकर उनके आगमन की प्रतीक्षा कर रहे थे, जयकारे लगाने लगे। सम्मक्का को चिलकलगुट्टा से लगभग 2 किलोमीटर तक ढोल और पारंपरिक आदिवासी नृत्यों के साथ एक जुलूस में लाया गया। ढोल-नगाड़ों की थाप के साथ सम्मक्का जंगल से निकलकर लोगों के बीच आ गई।

మేడారం జాతరలో ముఖ్యమైనఘట్టం, సింహాసనంపై సమ్మక్క

హైదరాబాద్: తెలంగాణ మేడారం జాతరలో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. అమ్మవారి నామస్మరణలో వనం మారుమ్రోగుతుంది. సమ్మక్క అమ్మవారిని గద్దెపై ప్రతిష్ఠించారు. భక్తులు సమ్మక్క ప్రతిరూపాన్ని చిలకలగుట్ట నుంచి తీసుకొచ్చారు. డప్పు వాయిద్యాల, శివసత్తుల పూనకాల నడుమ ఊరేగింపుగా సమ్మక్కను గిరిజన పూజారులు గద్దెలపైకి తోడుకొని వచ్చారు. భక్తులు జయజయధ్వానాలు, పొర్లుదండాలు పెడుతూ సమ్మక్కకు స్వాగతం పలికారు. సమ్మక్కను గద్దెలపై ప్రతిష్ఠించారు.

కాగా, మేడారం జాతర భక్తులతో కిటకిటలాడుతోంది. జై సమ్మక్క అంటూ మేడారం పరిసరాలు మార్మోగిపోతున్నాయి. పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజు, కొండాయి నుంచి గోవిందరాజు గద్దెలకు చేరుకుని భక్త జనులకు దర్శనమిస్తున్నారు.పెద్ద ఎత్తున వచ్చిన భక్తులతో మేడారం కిక్కిరిసిపోతున్నది. మేడారం గద్దెపై కొలువుదీరనున్న ఈ అపురూప దృశ్యాన్ని కనులారా వీక్షించడానికి గద్దెల వద్దకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. సమ్మక్క-సారలమ్మ నామస్మరణలతో వనం పులకరించిపోతున్నది.

సమ్మక్క ఆగమనం కోసం ఉదయమే ఏర్పాట్లు మొదలయ్యాయి. పూజారులు అడవి నుంచి వెదురు వనం, అడెరాలు తెచ్చి గద్దెపై ఉంచారు. సాయంత్రం ప్రధాన పూజారి నేతృత్వంలో పూజాలరుల బృందం చిలుకలగుట్ట అడవికి వెళ్లింది. అక్కడి నుంచి గుట్టపైకి ప్రధాన పూజారి ఒక్కరే వెళ్లారు. అక్కడ పూజా తంతు అంతా ఆనవాయితీ ప్రకారం గోప్యంగా సాగింది. ఆ తర్వాత తల్లిని తీసుకొని కిందికి దిగారు.కుంకుమ భరణి రూపంలో చిలకలగుట్ట దిగిన సమ్మక్క గద్దెల వద్దకు బయలుదేరింది. సమ్మక్కకు స్వాగతం పలుకుతూ దారిపొడవునా అందమైన రంగవల్లులు తీర్చిదిద్దారు.

మేడారంలో వనం వీడి జనం మధ్యలోకి వచ్చిన సమ్మక్కకు మంత్రి సీతక్క ఘనంగా స్వాగతం పలికారు. ఎస్పీ శబరీశ్ గాల్లోకి కాల్పులు జరిపి అధికారిక లాంఛనాలతో సమ్మక్కకు స్వాగతం పలికారు. సమ్మక్క రాకను సూచించే ఈ శబ్దంతో ఒక్కసారిగా చిలకలగుట్ట ప్రాంతం భక్తిభావంతో ఉప్పొంగిపోయింది. ప్రభుత్వం తరపున మంత్రి సీతక్క స్వాగతం పలికారు. ఆమె రాక కోసం తనువెల్లా కళ్లు చేసుకొని ఎదురు చూసిన యావత్ భక్తకోటి ఆమె గుట్ట దిగగానే జేజేలు పలికారు. సమ్మక్కను చిలకల గుట్ట నుంచి దాదాపు 2 కిలోమీటర్ల పొడవునా డోలు వాద్యాలు, గిరిజన సంప్రదాయ నృత్యాలతో ఊరేగింపుగా తీసుకొచ్చారు. డప్పు చప్పుళ్లు, డోలు వాద్యాలు మారుమోగుతుంటే అడవిని వీడి సమ్మక్క జనం మధ్యకు వచ్చి గద్దెలపైకి చేరింది.

గద్దెలపైన కొలువైన వనదేవతలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు తరలివస్తున్నారు. జంపన్నవాగు జనసంద్రమైంది. కీకారణ్యం కోలాహలంగా మారింది. ఇది జనమా–వనమా అనట్లు మేడారం అభయారణ్యం మొత్తం జనారణ్యంగా మారిపోయింది. ఎడ్ల బండ్ల నుంచి మొదలుకొని హెలికాప్టర్ల వరకు మేడారానికి కదిలారు. అశేష జనవాహినితో కీకారణ్యం కొత్త శోభను సంతరించుకుంది. భక్తులు జంపన్న వాగులో పుణ్యస్నానాలాచరిస్తూ ఎత్తుబంగారాలు, ఒడిబియ్యం సమర్పిస్తున్నారు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X