హైదరాబాద్ : రంగనాయక సాగర్ నుండి డీ10 కెనాల్ నుండి తపాస్ పల్లి రిజర్వాయర్ D-3 కెనాల్ పరిధిలో ఉన్న ఆయకట్టు స్థిరీకరణ కొరకు మంత్రి ఉత్తమ్ ను కలిసి వివరించిన భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు నిన్న తపాస్ పల్లి రిజర్వాయర్ నుంచి దూల్మిట్ట చేర్యాల మండలాల్లోని పలు గ్రామాలకు వెళ్లే కాలువను పరిశీలించి ఈ రోజు నీటిపారుదల మంత్రి శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కలిసి అక్కడి రైతులు సమస్యలు వివరించారు.
జనగామ నియోజకవర్గం దూల్మిట్ట, చేర్యాల మండలాల పరిధిలోని కమలాయపల్లి, అర్జున్ పట్ల,ఆకునూర్, జూలపల్లి లింగాపుర్,దూల్ మిట్ట గ్రామాల పరిధిలోని సుమారు 6000 ఎకరాలకు రంగనాయక సాగర్ డీ10 కెనాల్ కింద సిర్థీకరణ చేయాలని, నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కలిసి వినతి పత్రం భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు అందజేసి అక్కడి రైతుల పంటలు ఎండిపోకుండా వెంటనే నీటిని విడుదల చేసెలా అధికారులతో ఫోన్ లో మాట్లాడించారు.
Also Read-
దీనిపై సానుకూలంగా స్పందించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రైతుల పంటలు ఎట్టి పరిస్థితుల్లో ఎండిపోనివ్వకుండా చూస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసిలు కొండల్ రెడ్డి, నరసింగ రావు, కంచ రాములు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు
