విశ్వవిద్యాలయం భూములను కాపాడాలంటూ రూపొందించిన కరపత్రం విడుదల
78వ రోజుకు చేరిన అంబేద్కర్ యూనివర్సిటీ ఉద్యోగుల నిరసన
హైదరాబాద్: ప్రభుత్వం కొత్త విశ్వవిద్యాలయాలకు అనుమతి ఇస్తూ, వాటికి అవసరమైన మేరకు భూమి, ఇతర మౌళిక సదుపాయాలు కల్పిస్తూ ఉన్న విశ్వవిద్యాలయాలను కాపాడాలని విశ్వవిద్యాలయ పరిశోధక విద్యార్థిని పల్లవి పేర్కొన్నారు. అంబేద్కర్ వర్శిటీ గృహిణులకు, మహిళాలకు, పేద, మధ్య తరగతి విద్యార్థులకు దిక్సూచి లాంటిదని ఆమె అభిప్రాయపడ్డారు.
ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుండి పేద, దళిత, బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులు విశ్వవిద్యాలయంలో అభ్యసించి లబ్ధి పొందుతున్నారన్నారు. డా. బి. ఆర్. అంబేద్కర్ విశ్వవిద్యాలయ స్థలాన్ని జవహర్ లాల్ నెహ్రు అర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ విశ్వవిద్యాలయానికి (జె.ఎన్.ఏ.ఎఫ్.ఏ.యూ) కేటాయించాలనే ప్రభుత్వ ఆలోచనను వెంటనే ఉపసంహరించుకోవాలని ఐక్య కార్యాచరణ సమితి సభ్యులు డిమాండ్ చేస్తూ నిరసనను గురువారం కూడా కొనసాగించారు.
గత 78 రోజులుగా జేఏసీ సభ్యులు, ఉద్యోగులు, విద్యార్థులు ప్రభుత్వ లేఖ నెం: 1043/TE/A12/2024 ఉపసంహరించుకోవాలంటూ మధ్యాహ్న భోజన విరామ సమయంలో పరిపాలన భవనం ముందు బైఠాయించి, ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు.
Also Read-
కార్యక్రమంలో పాల్గొన్న ఐక్య కార్యాచరణ సమితి (జేఏసీ) ఛైర్పర్సన్ ప్రొ. పల్లవీ కాబడే; జేఏసి కన్వీనర్ ప్రొ. వడ్డాణం శ్రీనివాస్; సెక్రటరీ జనరల్ డా. వేణుగోపాల్ రెడ్డి తదితరులు భూ కేటాయింపు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రూపొందించిన కరపత్రంను విడుదల చేశారు. వచ్చే ఆదివారం రాష్ట్రంలోని అధ్యయన కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు.
నిరసన కార్యక్రమంలో జేఏసీ నేతలు డా. రంబింద్రనాథ్ సోలమన్; డా. యాకేశ్ దైద; ప్రొ చంద్రకళ, ప్రొ. మేరీ సునంద, డా. కిషోర్; డా. రాఘవేంద్ర; డా. రజిత, డా. లక్ష్మణ్, రాములు, పాండు, అధ్యాపక, అధ్యాపకేతర ఉద్యోగులు, విద్యార్థులు, ఉద్యోగ సంఘాల నేతలు పాల్గొన్నారు.