हैदराबाद: आंध्र प्रदेश के गुंटूर के विकासनगर में टीडीपी द्वारा आयोजित एक जनसभा में भगदड़ मच गई। भगदड़ में तीन महिलाओं की मौत हो गई। भगदड़ में कई लोग घायल हो गए। तीन लोगों की हालत गंभीर बताई जा रही है। उय्युरू चैरिटेबल ट्रस्ट के तत्वावधान में टीडीपी नेता नारा चंद्रबाबू नायडू ने गरीबों में साड़ियां और संक्रांति उपहार किट के वितरण की व्यवस्था की। सभा परिसर में भगदड़ मच गई। किट के लिए लोगों में होड़ मचने से भगदड़ मच गई।
హైదరాబాద్ : గుంటూరు (ఆంధ్రప్రదేశ) లోని వికాస్నగర్లో టీడీపీ నిర్వహించిన బహిరంగ సభలో తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాటలో ముగ్గురు మహిళ మృతి చెందారు. తొక్కిసలాటలో పలువురికి గాయాలయ్యాయి. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. ఉయ్యూరు ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జనతా వస్త్రాలు, పేదలకు సంక్రాంతి కానుకల కానుక పంపిణీకి ఏర్పాట్లు చేశారు. సభా ప్రాంగణంలో తొక్కిసలాట జరిగింది. కిట్ల కోసం ప్రజలు ఒక్కసారిగా ఎగబడటంతో తొక్కిసలాట జరిగింది.
చంద్రన్న కానుకులు ఇస్తామంటూ టీడీపీ నేతల ప్రచారం కారణంగా సభకు పెద్ద ఎత్తున మహిళలను, వృద్ధులను టీడీపీ నేతలు తరలించారు. ఈ క్రమంలో కొందరికి మాత్రమే కానుకలు ఇచ్చి మిగతా వారిని అక్కడి నుంచి వెళ్లిపోమన్నారు టీడీపీ నేతలు. దీంతో, తమకు కూడా కానుకలు ఇవ్వాలని మహిళలు దూసుకొచ్చారు. జనం ఒక్కసారిగా దూసుకురావడంతో తోపులాట, తొక్కిసలాట చోటుచేసుకుంది.

ఈ క్రమంలో ఒక మహిళ ఘటనా స్థలంలో మృతి చెందగా. మరో ఇద్దరు ఆస్పత్రిలో మృతిచెందారు. మరో ముగ్గురు మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. నాలుగు రోజుల క్రితమే జరిగిన కందుకూరులో చంద్రబాబు రోడ్ షో కారణంగా ఎనిమిది మంది మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ ఘటన మరువక ముందే న్యూ ఇయర్లో మొదటిరోజే ఇలా మరో దారుణం జరిగింది.
అంతకుముందుగుంటూరు వికాస్నగర్ సభలో ప్రసంగించిన చంద్రబాబు 2022 మొత్తం విధ్వంసాలు, విద్వేషాలతో గడిచిందని చెప్పారు. పేదలకు న్యాయం చేయాలని మొదట అనుకున్నది ఎన్టీఆరేనని చంద్రబాబు చెప్పారు. 1983లో కిలో బియ్యం రూ.2కే ఇచ్చిన ఘనత ఎన్టీఆర్దేనన్నారు. ఇవాళ్టి ఆహార భద్రత పథకానికి స్ఫూర్తి కూడా ఎన్టీఆరేనని చంద్రబాబు చెప్పారు. పేదవాళ్లకు పక్కా ఇళ్లు ఉండాలని ఎన్టీఆర్ కోరుకున్నారని తెలిపారు. టీడేపీ హయాంలో సంక్రాంతి కానుక, క్రిస్మస్ గిఫ్ట్, ముస్లింలకు రంజాన్ తోఫా ఇచ్చామన్నారు. టీడీపీ పాలనలో ఐటీకి ప్రాధాన్యం ఇచ్చామని, పేదల సంక్షేమం కోసం పనిచేసే పార్టీ టీడీపీ అని చెప్పారు. 54 లక్షల మందికి రూ.2 వేలు పెన్షన్ అందించామని చంద్రబాబు చెప్పారు. (Agencies)