हैदराबाद : प्रधानमंत्री नरेंद्र मोदी ने फिल्म अभिनेता नंदमुरी तारकरत्न के निधन पर शोक व्यक्त किया है। इस हद तक मोदी ने तारकरत्न निधन पर शोक जताते हुए ट्विटर पर प्रतिक्रिया दी। नंदमुरी तारकरत्न का असामयिक निधन दुखद है। उन्होंने फिल्मों और मनोरंजन की दुनिया में अपनी एक अलग पहचान बनाई है। उनके परिवार और प्रशंसकों के प्रति मेरी गहरी संवेदना…ओम शांति’।
సినీ నటుడు తారకరత్న మృతికి ప్రధాని మోదీ సంతాపం
హైదరాబాద్ : సినీ నటుడు నందమూరి తారకరత్న మృతికి ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం ప్రకటించారు. ఈ మేరకు తారకరత్న మరణం పట్ల సంతాపం ప్రకటిస్తూ ట్విట్టర్లో స్పందించారు. ‘నందమూరి తారకరత్న అకాల మరణం బాధాకరం. చలనచిత్రాలు, వినోద ప్రపంచంలో తనకంటూ ఒక ముద్ర వేసుకున్నారు. ఆయన కుటుంబసభ్యులు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి.. ఓం శాంతి’ అంటూ మోదీ ట్విట్టర్లో పేర్కొన్నారు.
ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు సంతాపం తెలిపారు. ఇక మహేష్ బాబు, నాగశౌర్య, నాగచైతన్య, రవితేజ సంతాపం ప్రకటించారు. అలాగే మంత్రి తలసాని, హరీష్ రావు, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు.
Pained by the untimely demise of Shri Nandamuri Taraka Ratna Garu. He made a mark for himself in the world of films and entertainment. My thoughts are with his family and admirers in this sad hour. Om Shanti: PM @narendramodi
— PMO India (@PMOIndia) February 19, 2023
తారకరత్న మృతి పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు. జగన్, కేసీఆర్, చంద్రబాబు సంతాపం తెలిపారు. తారకరత్నం మరణం తీవ్ర బాధను కలిగించిందని, టీడీపీకి తీరని లోటు అని టీడీపీ అధినేత చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తారకరత్న మరణం కుటుంబానికి, పార్టీకి తీరని లోటు అని నందమూరి బాలకృష్ణ పేర్కొన్నారు. తారకరత్న కన్నుమూయడం బాధాకరమని పవన్ కల్యాణ్ సంతాపం తెలిపారు. (ఏజెన్సీలు)