నూతన సచివాయం ప్రారంభోత్సవానికి గవర్నర్ గైర్ హాజరు పై మంత్రి జగదీష్ రెడ్డి మండిపాటు

ప్రగతినిరోదకులు అభివృద్ధిని చూసి తట్టుకోలేక పోతున్నారు

అందుకే సచివాలయ ప్రారంభోత్సవానికి గవర్నర్ దూరం

అభివృద్ధి నిరోధకులు రానంత మాత్రాన జరిగే నష్టం శూన్యం

రావడం రాక పోవడం గవర్నర్ విజ్ఞత మీద ఆధార పడి ఉంటుంది

సచివాలయ ప్రారంభోత్సవానికి గైర్ హాజరుతో నిజ స్వరూపం బయట పడింది

అభివృద్ధిని అభినందించే గుణం ప్రతిపక్షాలకు లేదు

తెలంగాణా అభివృద్ధిని విపక్షాలు ఇష్ట పడడం లేదు

జరుగుతున్న అభివృద్ధితో అడ్రెస్ గల్లంతు అబుతుందన్న బెంగ వారిని వెంటాడుతుంది

ప్రజాక్షేత్రంలో వారికి భంగపాటు తప్పదు

తెలంగాణా ప్రజల ఆత్మగౌరవానికి నూతన సచివాలయం ప్రతీక

చరిత్రలో ముఖ్యమంత్రి కేసీఆర్ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది

-మంత్రి జగదీష్ రెడ్డి

సూర్యపేట : తెలంగాణాలో జరుగుతున్న అభివృద్ధి ని చూసి ప్రగతి నిరోధకులు తట్టుకులేక పోతున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి మండిపడ్డారు. నూతన సచివాలయం ప్రారంభోత్సవానికి గవర్నర్ తమిళసై రాకపోవడం అందులో భాగమేనని ఆయన ఆరోపించారు. సోమవారం రోజున ఆయన సూర్యపేట జిల్లా కేంద్రంలో మీడియా తో మాట్లాడారు. అభివృద్ధి నిరోదుకులు రానంత మాత్రాన ఒరిగే నష్టం ఏమి లేదని ఆయన ఎద్దేవాచేశారు.

ప్రారంబోటత్సవానికి రావడం, రాక పోవడం అనేది ఆమె విజ్ఞతకే వదిలి పెడు తున్నామన్నారు.గైర్ హాజరు తో గవర్నర్ నిజ స్వరూపం బట్టబయలు అయిందని ఆయన విమర్శించారు. నూతన సచివాలయం తెలంగాణా ప్రజల ఆత్మ గౌరవానికి ప్రతీక అని ఆయన అభివర్ణించారు. అటువంటి భవనాన్ని నిర్మించిన ముఖ్యమంత్రి కేసీఆర్ పేరు చరిత్రలోనే చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు.

మంచిని మంచిగా చూసే గుణం ప్రతిపక్షాలకు ఉండక పోవడం దురదృష్టకరమన్నారు.జరుగుతున్న అభివృద్ధి తో అడ్రెస్ శ్వాసతంగా గల్లంతు అవుతుందన్న బెంగ విపక్షాలను వెంటాడుతుందన్నారు.అందుకే అభివృద్ధి కి అడుగడుగునా అడ్డుపడుతున్నారని ఆయన విరుచుకుపడ్డారు. ఇటువంటి వారికి ప్రజాక్షేత్రం లో గుణపాఠం తప్పదని మంత్రి జగదీష్ రెడ్డి హెచ్చారించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X