హైదరాబాద్ : ఈ రోజు మధ్యాహ్నం 12.30 గంటలకు రాజభవన్ లో గవర్నర్ లో కాంగ్రెస్ ప్రతినిధుల సమావేశం కానున్నారు. టీపీసీసీ అధ్యక్షులు ఎంపీ శ్రీ రేవంత్ రెడ్డి నేతృత్వంలో 10 మంది ప్రతినిధులు గవర్నర్ శ్రీమతి తమిళ సాయి సౌందరాజన్ తో సమావేశం కానున్నారు. టీఎస్పీఎస్సి పరీక్షల పేపర్స్ లీక్ విషయాలపై గవర్నర్ కు ఫిర్యాదు చేయనున్న కాంగ్రెస్.
టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి కార్యక్రమాలు…
ఉదయం 9.30 గంటలకు అంబర్ పేట లో వాటర్ వర్క్స్ గ్రౌండ్ లో అండర్ 19 క్రికెట్ మ్యాచ్ ను ప్రారంభిస్తారు. అనంతరం అక్కడ నుంచి గాంధీ భవన్ లో జరిగే ఉగాది పండుగ వేడుకలలో పాల్గొంటారు. 12.30 గంటలకు గవర్నర్ తో సమావేశం అయ్యేందుకు 10 మంది ప్రతినిధులతో కలిసి రాజ్ భవన్ కు వెళ్తారు..