హైదరాబాద్ : తెలంగాణ జాగృతి ఆద్వర్యంలో జాతిపిత మహాత్మా గాంధీజీ, మాజీ ప్రధాని స్వర్గీయ లాల్ బహదూర్ శాస్త్రి జయంతి ఉత్సవాలు గురువారం ఘనంగా నిర్వహించారు. తెలంగాణ జాగృతి నాయకులు గాంధీ, శాస్త్రి గార్ల ఫోటోలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.


మరోవైపు దసరా పండుగ సందర్భంగా జూబ్లీహిల్స్ లోని పెద్దమ్మతల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, అనంతరం బంజారాహిల్స్ లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో నాయకులతో కలసి దసరా పూజలో పాల్గొన్న కవిత.

