Snake: ఎయిరిండియా విమానంలో పాము, ప్రయాణికులు సురక్షితం

Hyderabad: ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం కార్గో హోల్డ్‌లో సిబ్బంది పామును గుర్తించారు. ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం విమానం కేరళలోని కాలికట్ నుంచి దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌లో శనివారం ల్యాండయ్యాక ఈ పామును గుర్తించినట్టు డీజీసీఏ అధికారులు వెల్లడించారు.

పాము విమానంలోకి ఎలా ప్రవేశించిదనేదానిపై దర్యాప్తు జరుపుతున్నట్టు సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. బీ737-800 విమానం కేరళలోని కాలికట్ నుంచి దుబాయ్ వెళ్లిందని, ప్రయాణికులు అందరూ సురక్షితంగా దిగారని చెప్పారు. దుబాయ్ ఎయిర్‌పోర్టులో పాముని గుర్తించాక ఎయిర్‌పోర్ట్ ఫైర్ సర్వీసెస్‌కు సమాచారం అందించారని అధికారి తెలిపారు.

ఇది గ్రౌండ్ నిర్వహణా లోపమని, ఈ ఘటనపై దర్యాప్తు జరపాల్సి ఉందని, తగిన చర్యలు తీసుకోవాల్సి ఉందని సదరు అధికారి పేర్కొంది. కాగా ఈ ఘటనపై ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ అధికారి స్పందించలేదు. (Agencies)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X