సిరిసిల్ల : తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఈనెల 25న రాజకీయ పార్టీ ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో ఆమె అభిమానులు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం నుంచి మంగళవారం పాదయాత్ర ప్రారంభించారు. తెలంగాణ జాగృతి నాయకులు వినయ్, సతీశ్ ఆధ్వర్యంలో వంద మంది నాయకులు మంగళవారం ఉదయం సిరిసిల్ల అంబేద్కర్ చౌరస్తా నుంచి పాదయాత్ర ప్రారంభించారు.

మంగళవారం రాత్రికి వీరి యాత్ర సిద్దిపేట జిల్లా కేంద్రానికి చేరుకుంటుంది. సిద్దిపేటలో రాత్రి బస చేసి బుధవారం ఉదయం స్థానిక నాయకులతో కలిసి పాదయాత్ర కొనసాగిస్తారు. శనివారం ఉదయం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని మునీరాబాద్ లో గల అద్వయ కన్వెన్షన్ సెంటర్ కు చేరుకొని పార్టీ ఆవిర్భావ సభలో పాల్గొంటారు.

