మంత్రి సురేఖ పైన క్రిమినల్ పరువు నష్టం కేసు దాఖలు చేసిన BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

హైదరాబాద్ : మంత్రి పదవిలో ఉండి తన స్థాయి మరిచి దిగజారుడు వ్యాఖ్యలు చేసిన మంత్రి కొండా సురేఖ పైన భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారక రామారావు క్రిమినల్ కేసును దాఖలు చేశారు. ఈరోజు నాంపల్లి క్రిమినల్ కోర్టులో ఈ మేరకు క్రిమినల్ పరువు నష్టం కేసుని వేశారు. ఏలాంటి ఆధారాలు లేకుండా కేవలం దురుద్దేశపూర్వకంగా, అడ్డగోలు వ్యాఖ్యలు చేసిన కొండ సురేఖ పైన చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని, తగిన శిక్ష వేయాలని కోర్టులో కేటీఆర్ తన న్యాయవాదుల ద్వారా కేసు వేశారు.

ఇప్పటికే కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపైన పరువు నష్టం దావా వేస్తానని లీగల్ నోటీసులు కేటీఆర్ ఇచ్చారు. వారం రోజులలోగా బహిరంగ క్షమాపణ చెప్పాలని తన లీగల్ నోటీసులలో కేటీఆర్ పేర్కొన్నారు. అయితే లీగల్ నోటీస్ గడువు తీరిన నేపథ్యంలో చట్ట ప్రకారం సురేఖ పైన కేటీఆర్ ఈరోజు క్రిమినల్ డెఫమేషన్ కేసు నమోదు చేశారు.

సురేఖ గతంలో కూడా అసత్య ఆరోపణలు, అడ్డగోలు వ్యాఖ్యలు చేసినప్పుడు భారత ఎన్నికల సంఘం ఆమెకి చివాట్లు పెట్టి, మొట్టికాయలు వేసిన విషయాన్ని కేటీఆర్ కోర్టు దృష్టికి తీసుకోవచ్చారు. ఆమె తాజాగా చేసిన వ్యాఖ్యలు కేవలం రాజకీయపరమైన వ్యాఖ్యలు మాత్రమే కావని, తన పరువుకు భంగం కలిగించేలా ఉద్దేశపూర్వకంగా, ప్రణాళిక బద్ధంగా చేసిన కుట్రగా చూడాలని కేటీఆర్ కోర్టుకు విజ్ఞప్తి చేశారు.

Also Read-

సురేఖ చేసిన వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకొని, వాటి వెనుక ఉన్న నేరపూరిత దురుద్దేశాల పరిగణలోకి తీసుకొని, ఆమెకి చట్ట ప్రకారం శిక్ష వేయాలని కోర్టుకి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. సురేఖ గతంలో చేసిన వ్యాఖ్యల చరిత్రను పరిగణలోకి తీసుకొని క్రిమినల్ పరువు నష్టం చట్టాల ఆధారంగా కఠిన శిక్ష వేయాలని కోరారు. త్వరలోనే వీటితోపాటు పరువు నష్టం తాలూకు సివిల్ ధావాను కూడా కేటీఆర్ నమోదు చేసే అవకాశం ఉన్నది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X