పీపుల్స్ వార్ వ్యవస్థాపక సైద్ధాంతిక నాయకుడు కామ్రేడ్ కె యస్ కు విప్లవ జోహార్లు : జంపన్న

కామ్రేడ్ కొండపల్లి సీతారామయ్య కృష్ణా జిల్లాలోని గుడివాడ లోని జొన్నపాడులో మధ్య తరగతి రైతు కుటుంబంలో 1914 లో జన్మించాడు.

కామ్రేడ్ కెయస్ యువకుడుగా ఉన్నప్పుడే కమ్యూనిస్ట్ పార్టీ కార్యకలాపాల వైపు ఆకర్షితులై భూస్వామ్య వ్యతిరేక, బ్రిటిష్ వలస వ్యతిరేక ఉద్యమంలో పాలు పంచుకున్నాడు.

ఆనాటి కమ్యూనిస్ట్ పార్టీ లో కృష్ణా జిల్లా కమిటీ మెంబర్ గా పని చేస్తూ తన పేరులో రెడ్డి కుల గుర్తును తొలగించుకొని సీతారామయ్యగా మారి పీడిత ప్రజలతో మమేకం ఐనాడు.

సీపీఐ పార్టీ తెలంగాణ సాయుధ పోరాటాన్ని విరమింఛి పాలక వర్గాలతో వర్గ సామరస్య విధానాలు కొనసాగిస్తూ రివిజనిస్ట్ విధానాలు చేపట్టగా దానిని వ్యతిరేకించి సీపీఎం పార్టీ ఏర్పడగా కామ్రేడ్ కెయస్ సిపిఎంలో భాగమై పని చేసినాడు .

కొద్దీ కాలం లోనే సీపీఎం సైతం సిపిఐ వలే పాలక వర్గాలతో వర్గ సామరస్య విధానాన్ని కొనసాగిస్థూ వర్గ పోరాటాన్ని వదిలేయగా సిపిఎం లోని విప్లవ కారులు కామ్రేడ్ చార్ మజుందార్ నాయకత్వంలో 1969 లో సీ పీ ఐ (ఎంఎల్) పార్టీ ఏర్పడింది . కె యస్ సైతం ఈ పార్టీ లో చేరి రాష్ట్ర కమిటి నాయకుడుగా పని చేసినాడు.

Also Read-

నక్సల్ బరి ఉద్యమం పై ఆనాటి ఇందిర ప్రభుత్వం తీవ్ర అణిచివేత కొనసాగించడంతో సిపిఐ (యం యల్ )కేంద్ర నాయకత్వం కామ్రేడ్ చార్ మజుందార్ తో సహా అమరులు కావడం, అరెస్ట్ కావడం జరిగింది.కేంద్ర కమిటి దెబ్బ తిని పోయి పార్టీ శ్రేణులు చెల్లా చెదురు అయినవి.పార్టీ లో సైద్ధాంతిక గందర రాజకీయాలు పెరిగినవి.

అనివార్యంగా పార్టీ శ్రేణులు ఎక్కడికక్కడ పని చేయ వలసిన తప్పనిసరి పరిస్థితి లో పదుల సంఖ్యలో సిపిఐ (యం యల్ )పేరు తోనే అనేక నక్సలైట్ గ్రూప్ లు ఏర్పడినవి. ఈ స్థితిలో కామ్రేడ్ కోండపల్లి సీతరామయ్య నాయకత్వంలో కోండపల్లి గ్రూప్ పేరుతో పిలువబడి ఆ తరువాత 1980 లో సిపిఐ యం యల్ పీపుల్స్ వార్ పార్టీ గా ఏర్పడింది.

1972 లో కామ్రేడ్ చారు మజుందార్ అమరుడైన తర్వాత సుమారు రెండు దశాబ్దాలు భారత విప్లవ కమ్యూనిస్టు సైద్ధాంతిక రాజకీయ నిర్మాణ రంగంలో కె యస్ ఒక ముఖ్యమైన పాత్ర నిర్వహించాడు.

కామ్రేడ్ చారు మజుందార్ అమరుడైన తర్వాత. ఉద్యమ పునర్నిర్మాణంలో పార్టీ ఎదుర్కొన్న అనేక కీలక సమస్యలను కొండపల్లి సీతారామయ్య పరిష్కరించి ఉద్యమాన్ని ఒక మలుపు తిప్పి అభివృద్ధి చేశాడు.

1970 చివరికల్లా ఆంధ్ర రాష్ట్ర కమిటీలో ప్రధాన భాగం దెబ్బతినిపోయి పార్టీ అంతర్గతంగా మితవాద అవకాశవాద దాడిని చీలికలను ఎదుర్కొంటున్న సమయంలో కామ్రేడ్ కె యస్ నక్సల్బరీ శ్రీకాకుళ వర్గ పోరాట రాజకీయాలను ముందుకు తీసుకుపోవడంలో రాజకీయ దూరదృష్టిని ప్రదర్శించాడు.

నక్సల్ బరి శ్రీకాకుళ తదితర పోరాటాలు ఒకదాని తర్వాత ఒకటి ఫాసిస్ట్ శత్రు నిర్బంధంలో అణచివేతకు గురవుతూ వేలాది మంది పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రజలు అమరులు అవుతున్నా, ఎంతో మంది నాయకులు విప్లవ శిబిరం వదిలిపోతునప్పటికీ కామ్రేడ్ కె ఎస్ మార్క్సిజం ఆధారంగా పీపుల్స్ వార్ పార్టీ శ్రేణులను వెన్నుతట్టి పోరాటంలో నిలబెట్టాడు.

విప్లవోద్యమంలో జరిగిన నష్టాలకు గుండె చెదిరిన ఎస్ఎన్ఎస్, తేజేశ్వరరావు లాంటి మితవాద నాయకులు సిపిఐ ఎంఎల్ పార్టీపై నక్సల్ బరి నిర్మాత పార్టీ నాయకుడు కామ్రేడ్ చారు మజుందార్ పై చేసిన విద్రోహ దాడిని దృఢంగా తిప్పికొట్టి విప్లవ పోరాటాలలోని మంచిని, పార్టీ మౌలిక పొందాను, పోరాట సాంప్రదాయాలను సంరక్షించాడు.

విప్లవోద్యమం తాత్కాలిక వెనుకంజ గురి కావడానికి కారణమైన తప్పులను, సాధించిన విజయాలను చారిత్రకంగా విశ్లేషించి తగిన గుణపాఠాల డాక్యుమెంట్ను( సెల్ఫ్ క్రిటికల్ రిపోర్ట్ scr)కామ్రేడ్ కేఎస్ తయారుచేశాడు. ఈ సమీక్ష చెడును తిరస్కరించి పాజిటివ్ అంశాలను నిలబెట్టి ప్రజలను ప్రజాసంఘాలను సంఘటితపరచడానికి ప్రజా ఉద్యమాలు అభివృద్ధి కావడానికి గొప్ప దోహదం చేసింది.

వరంగల్ కరీంనగర్ రైతాంగ ఉద్యమాలు ఆంధ్ర రాష్ట్రానికి, ఇతర రాష్ట్రాలకు విస్తరింపజేయడంలో ప్రజా పునాది కలిగిన మిలిటెంట్ పార్టీ నిర్మించడంలో కెస్ గొప్ప నిర్మాణ దక్షతను ప్రదర్శించాడు.

ఉత్తర తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించి పార్టీ మౌలిక పంథా డైరెక్షన్లో ఈ ఉద్యమానికి గెరిల్లా జోన్ పర్స్పెక్టివ్ రూపొందించి దండకారణ్య ఉద్యమానికి పునాది వేసినాడు.

కమ్యూనిస్టు విప్లవం అంటే పీడిత వర్గాలతో మమేకం అవుతూ భూస్వామ్య పెట్టుబడిదారీ వర్గాలకు వ్యతిరేకంగా రాజీలేని వర్గ పోరాటాన్ని కొనసాగించే విషయంలో భారతదేశంలో కమ్యూనిస్టు నమూనా నెలకొల్పడంలో కామ్రేడ్ కొండపల్లి మార్గదర్శకాలు శ్రామిక వర్గ ప్రజలకు ఆదర్శమైనవి.

దేశం లో వివిధ యం యల్ పార్టీ లలో అనేక చీలికలు నిరంతరం జరుగుతున్నప్పటికీ పీపుల్స్ వార్ పార్టీ లో చీలికలు నామమాత్రంగా ఉండి ఇతర సంస్థలు మావోయిస్టు పార్టీ గా ఐక్యం కావడంలో కె ఎస్ విప్లవకారుల ఐక్యత విషయంలో మార్గదర్శకాలు కీలకమైనవి.

భారతదేశంలో కుల సమస్యను జాతుల సమస్యను ,ఇందిర ఫాసిజాన్ని , ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని , మితవాద అవకాశవాద రాజకీయాలకు వ్యతిరేకంగా , శత్రువుకు వ్యతిరేకంగా మిత్ర వర్గాలతో ఐక్య సంఘటన కట్టే విషయములో , పార్టీ నిర్మాణరంగంలో, ప్రజా సంఘాల నిర్మాణంలో , ప్రజా సాహిత్యం ప్రజా కలలను అభివృద్ధి చేయడంలో, గెరిల్లా జోన్స్ మిలట్రీ నిర్మాణాలు అభివృద్ధి చేయడంలో కామ్రేడ్ కొండపల్లి భారత నిర్దిష్ట పరిస్థితుల్లో మార్క్సిస్టు లెనినిస్టు దృక్పథంతో అర్థం చేసుకోని పార్టీకి అనేక సైద్ధాంతిక నిర్మాణాత్మక రచనలు చేశాడు.

ఈ రచనలు సుమారు 3500 పేజీలకు పైగా ఉన్నాయి. కామ్రేడ్ కొండపల్లి రచనా పద్ధతి క్రింది స్థాయి కేడర్ కు సైతం సులభంగా అర్థమయ్యే విధంగా ఆకర్షించే విధంగా ఉంటూ పార్టీ శ్రేణులు ఎడ్యుకేట్ కావడానికి చాలా ఉపయోగపడినవి.

రెండు దశాబ్దాలుగా ఆనాటి పీపుల్స్ వార్ పార్టీ నిర్మాణంలో కామ్రేడ్ కె యస్ ప్రధానపాత్ర వహించి నాడు.

పీపుల్స్ వార్ పార్టీ లో తలెత్తిన కొన్ని నిర్మాణ సమస్యలు, వృద్దాప్యం, పార్కింగ్ సన్స్ వ్యాధి కారణంగా 1992 నాటికి కామ్రేడ్ కె యస్ పీపుల్స్ వార్ పార్టీ కి దూరం కావడం విప్లవోద్యమంలో విషాదకర పరిణామమే.

దాదాపు దశాబ్దం పైబడి అల్జీమర్స్ వ్యాధితో బాధపడి 2002 ఏప్రిల్ 12న ఆయన తన సుదీర్ఘ విప్లవ ప్రస్థానం చాలించారు.

సీపీఐ యం యల్ పీపుల్స్ వార్ పార్టీకి మొదటి నుండి వ్యవస్థాపక నాయకుడిగా సిద్ధాంతవేత్తగా రాజకీయ నిర్మాణ దక్షుడిగా కామ్రేడ్ కొండపల్లి పేరు భారత దేశ కమ్యునిస్ట్ విప్లవ ఉద్యమ చరిత్రలో చిరస్థాయిగా నిలిచి పోతుంది.కామ్రేడ్ కె యస్ కు వినమ్రంగా విప్లవ జోహార్లు. (From Social Media)

జంపన్న (మార్క్సిస్ట్ లెనినిస్ట్ నాయకుడు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X