हैदराबाद: मुख्यमंत्री रेवंत रेड्डी ने ट्विटर पर तेलंगाना सशस्त्र सेनानी वीरनारी चाकली ऐलम्मा को उनकी पुण्यतिथि पर श्रद्धांजलि अर्पित की। सीएम ने ऐलम्मा की जुझारूपन की प्रशंसा करते हुए कहा कि वह एक बहादुर महिला थीं और उन्होंने जमीनदारों के खिलाफ संघर्ष किया और उस पर विजय हासिल की।
भविष्य में खेलों का विश्व मंच बनेगा तेलंगाना
दूसरी ओर मुख्यमंत्री रेवंत रेड्डी ने कहा कि भविष्य में तेलंगाना-हैदराबाद खेलों का विश्व मंच बनेगा। उन्होंने कहा कि कांग्रेस सरकार उस दिशा में ईमानदारी से काम कर रही है। सीएम ने हैदराबाद के गाचीबोवली स्टेडियम में आयोजित इंटरकांटिनेंटल फुटबॉल कप फाइनल जीतने वाली सीरियाई टीम को बधाई दी। उन्होंने कहा कि यह खुशी की बात है कि अंतरमहाद्वीपीय फुटबॉल मैच का आयोजन स्थल हैदराबाद में हो रहा है। मुख्यमंत्री ने इस आशय का ट्वीट किया।
ఐలమ్మకు ఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీఎం నివాళి
హైదరాబాద్ : తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు వీరనారి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా ఘన నివాళి అర్పించారు. ఐలమ్మ వీర నారీ అని, పెత్తందార్ల పై విజయభేరి మోగించారని ఆమె పోరాట స్ఫూర్తిని కొనియాడారు.
భవిష్యత్ లో క్రీడల విశ్వవేదికగా తెలంగాణ
మరోవేపు భవిష్యత్ లో క్రీడల విశ్వ వేదికగా తెలంగాణ-హైదరాబాద్ మారుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఆ దిశగా ప్రజా ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని చెప్పారు. హైదరాబాద్ లోని గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన ఇంటర్ కాంటినెంటల్ ఫుట్ బాల్ కప్ ఫైనల్స్ లో విజేతలైన సిరియా టీమ్ కు సీఎం అభినందలు తెలిపారు. ఇంటర్ కాంటినెంటల్ ఫుట్ బాల్ మ్యాచ్ కు హైదరాబాద్ వేదికగా నిలవడం హర్షించదగ్గ విషయం అన్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి ట్వీట్ చేశారు.
చాకలి ఐలమ్మకు మాజీ సీఎం కేసీఆర్ నివాళి
తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి(సెప్టెంబర్ 10) సందర్భంగా ఆమె పోరాట స్ఫూర్తిని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ స్మరించుకున్నారు. ఈ మేరకు మంగళవారం ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ మహిళాశక్తికి, బహుజన ధీరత్వానికి ఐలమ్మ ప్రతీకగా నిలిచారు. తెలంగాణ రాష్ట్ర సాధనకోసం సాగిన ఉద్యమంలో వారి పోరాట స్ఫూర్తి ఇమిడివున్నది. ప్రజావ్యతిరేక పాలనపై ధిక్కారాన్ని ప్రకటించిన చాకలి ఐలమ్మ ప్రతిఘటనా తత్వం ఎల్లవేళలా ఆదర్శమని కేసీఆర్ కొనియాడారు. ఐలమ్మ స్ఫూర్తిని కొనసాగించేదిశగా వారి జయంతిని తెలంగాణ ప్రభుత్వం ప్రతి ఏటా అధికారికంగా నిర్వహించాలని గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు.