Road Accident : మధుయాష్కి గౌడ్ కి తృటిలో తప్పిన ప్రమాదం

హైదరాబాద్ : టీపీసీసీ క్యాంపెయిన్ కమిటీ చైర్మన్, మాజీ పార్లమెంట్ సభ్యులు మధు యాష్కి గౌడ్ కి తృటిలో ప్రమాదం తప్పింది. అనుకోకుండా అడ్డువచ్చిన బైకును తప్పించే క్రమంలో ఆయన ప్రయాణిస్తున్న కారు డివైడర్ను ఢీకొట్టింది. ఈ క్రమంలో కారు టైర్లు పేలిపోయి భారీ కుదుపునకు గురైనప్పటికీ డ్రైవర్ ముఖేష్ అప్రమత్తతో పెను ప్రమాదం తప్పింది.

మాజీ పార్లమెంట్ సభ్యులు బలరాం నాయక్ తల్లి మరణించడంతో అంత్యక్రియల్లో పాల్గొనేందుకు ఆదివారం ఉదయమే మధుయాష్కి గౌడ్ వరంగల్ బయలుదేరారు. ఈ క్రమంలో ఆలేరు వద్దకు వెళ్ళగానే బైక్ పై ప్రయాణిస్తున్న వ్యక్తులు రోడ్డు క్రాస్ చేసే క్రమంలో అనుకోకుండా అడ్డుగా వచ్చారు.

బైక్ పై ఉన్న ఆ వ్యక్తులను కాపాడే క్రమంలో కారును డ్రైవర్ పక్కకు తిప్పగా డివైడర్ను ఢీ కొట్టి కారు టైర్లు పేలిపోయాయి. ఈ ఘటనలో మధుయాష్కి గౌడ్, కారు లోని ఇతరులకు స్వల్ప గాయాలు మినహా ప్రాణాపాయం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ‘దేవుడి దయవల్ల స్వల్ప గాయాలు మినహా ఎవరికి ఏమి కాలేదు ‘ అని మధుయాష్కి గౌడ్ పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X