ओआरआर पर भीषण सड़क हादसा, पूर्व विधायक तीगल कृष्ण रेड्डी के पोते की मौत

हैदराबाद: पूर्व विधायक तीगल कृष्ण रेड्डी के घर पर बड़ी दुखद घटना घटी है। तीगल कृष्ण रेड्डी के पोते कनिष्क रेड्डी (19) की सड़क दुर्घटना में मौत हो गई। हैदराबाद के बाहरी इलाके में गोलापल्ली कलान के पास ओआरआर पर उसकी कार ने एक लॉरी को पीछे से जोरदार टक्कर मार दी। इस दुर्घटना में कनिष्क रेड्डी गंभीर रूप से घायल हो गया। दुर्घटना को देखकर उधर से गुजर रहे वाहन चालकों ने पुलिस को सूचित किया।

दुर्घटना की जानकारी मिलते ही पुलिस मौके पर पहुंची और कनिष्क रेड्डी को अस्पताल पहुंचाया। इलाज के दौरान उसकी मौत हो गई। इस अप्रत्याशित दुर्घटना से तीगल कृष्ण रेड्डी के घर पर दुख का साया छा गया है। सड़क दुर्घटना का पूरा विवरण अब तक नहीं मिल पाया है।

Also Read-

రోడ్డు ప్రమాదంలో మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి మనవడు మృతి

హైదరాబాద్ : మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన మనవడు కనిష్క్ రెడ్డి రోడ్డు (19) ప్రమాదంలో మృతి చెందాడు. హైదరాబాద్‌ శివారులోని గొళ్లపల్లి కలాన్ వద్ద ఓఆర్ఆర్‌పై ఓ లారీని వెనుక నుండి ఆయన కారు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కనిష్క్ రెడ్డికి తీవ్రగాయాలు అయ్యాయి. గమనించిన వాహనదారులు పోలీసులకు సమాచారం అందించారు.

విషయం తెలిసిన వెంటనే స్పాట్‌కు వెళ్లిన పోలీసులు కనిష్క్ రెడ్డిని ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కనిష్క్ రెడ్డి మృతి చెందాడు. ఈ అనూహ్య ఘటనతో మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి ఇంట విషాద ఛాయలు నెలకొన్నాయి. రోడ్డు ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

గతంలోనూ చాలా మంది ప్రముఖుల వారసులు…

గతంలోనూ చాలా మంది ప్రముఖుల వారసులు ఇలా రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు వదలటం బాధాకరం. ప్రస్తుతం తెలంగాణ మంత్రిగా ఉన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కుమారుడు ప్రతీక్ రెడ్డి కూడా కారు ప్రమాదంలోనే మృతి చెందారు. 2011 డిసెంబర్ 20న.. కారులో స్నేహితులతో కలిసి అతివేగంగా ప్రయాణిస్తున్న సమయంలో మెదక్ జిల్లా కొల్లూరు వద్ద ఔటర్ రింగు రోడ్డుకు సమీపంలో రోడ్డుకు అడ్డుగా వచ్చిన గొర్రెల కాపరిని తప్పించబోయి డివైడర్‌ను ఢీకొట్టటంతో ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ప్రతీక్ రెడ్డితో పాటు కారులో మరో ఇద్దరు కూడా మృత్యువాత పడటం బాధాకరం.

నారాయణ కుమారుడు

మరోవైపుఏపీ మంత్రి నారాయణ కుమారుడు నిషిత్ కూడా కారు ప్రమాదంలోనే మరణించటం గమనార్హం. 2017 మే 10వ తేదీన తెల్లవారుజామున నిషిత్ తన స్నేహితునితో కలిసి కారులో అతివేగంగా వెళ్తూ ఒక్కసారిగా అదుపుతప్పి జూబ్లిహిల్స్ రోడ్ నెంబర్ 36 వద్ద మెట్రో పిల్లర్‌కు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నిషిత్‌తో పాటు అతని స్నేహితుడు తీవ్రంగా గాయపడగా ఇద్దరిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు తేల్చారు.

మాజీ క్రికెట్ అజారుద్దీన్ కుమారుడు అయాజుద్దీన్ మరియు…

మాజీ క్రికెట్ అజారుద్దీన్ కుమారుడు అయాజుద్దీన్ కూడా 19 ఏళ్ల వయసులోనే (2011లో) బైక్ ప్రమాదంలో మృతి చెందాడు. బైకు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆరు రోజుల పాటు మృత్యువుతో పోరాడి చివరికి ప్రాణాలు వదిలాడు. మరోవైపు సిని నటులు కోటా శ్రీనివాస రావు, బాబు మోహన్ కుమారులు కూడా రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందారు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X