हैदराबाद: टॉलीवुड अभिनेता नंदामुरी तारकरत्न (39) का निधन हो गया। बेंगलुरू के नारायण हृदय अस्पतला में पिछले 23 दिन से इलाज के बाद शनिवार रात उन्होंने अंतिम सांस ली। तारकरत्न की मृत्यु से नंदमुरी के परिवार में शोक की लहर दौड़ गई। फिल्मी और राजनीतिक हस्तियां उनके निधन पर शोक व्यक्त कर रहे हैं। परिवार के सदस्यों के प्रति गहरी संवेदनाएं व्यक्त कर रहे हैं।
నటుడు నందమూరి తారకరత్న కన్నుమూత
హైదరాబాద్ : నందమూరి తారకరత్న(39) కన్నుమూశారు. గత 23 రోజుల నుంచి బెంగళూరులోని నారాయణ హృదయాలయలో చికిత్స పొందుతూ శనివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. తారకరత్న మృతితో నందమూరి కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆయన మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు.
తారకరత్నను ప్రాణాలతో కాపాడేందుకు నారాయణ హృదయాలయ వైద్యులు తీవ్రంగా శ్రమించారు. కానీ ఫలితం లేకుండా పోయింది. తారకరత్న ఆరోగ్య పరిస్థితి మరింత విషమించిందని తెలియడంతో శనివారం సాయంత్రం వరకు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ, ఆయన కుటుంబ సభ్యులు ఆస్పత్రికి చేరుకున్నారు. ఈ సందర్భంగా తారకరత్న ఆరోగ్య పరిస్థితి వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
కుప్పంలో నారా లోకేశ్ చేపట్టిన యువగళం యాత్రలో తారకరత్న గుండెపోటుతో కుప్పకూలిన విషయం తెలిసిందే. యాత్ర ప్రారంభమైన కాసేపటికి సమీపంలో ఉన్న మసీదులోకి నారా లోకేశ్ వెళ్లారు. లోకేశ్తో పాటు తారకరత్న కూడా మసీదులోకి వెళ్లారు.
ఆ సమయంలో టీడీపీ కార్యకర్తలు అంతా గుంపుగా తరలివచ్చారు. అందరూ ఒక్కసారిగా మీద పడ్డట్టు రావడంతో తారకరత్నకు ఊపిరి ఆడలేదు. ఇదే విషయాన్ని సిబ్బందికి చెప్పడంతో వాళ్లు టీడీపీ కార్యకర్తలను దూరంగా వెళ్లాలని సూచించారు. అయినప్పటికీ వాళ్లు వినిపించుకోలేదు.
ఈ క్రమంలో ఊపిరాడక తారకరత్న సొమ్మసిల్లి పడిపోయాడు. వెంటనే ఆయనకు ప్రాథమిక చికిత్స అందించి కుప్పం ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు తీవ్ర గుండెపోటుగా నిర్ధారించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో ప్రత్యేక అంబులెన్స్ ద్వారా బెంగళూరులోని నారాయణ హృదయాలయకు తరలించి చికిత్స అందించారు. చివరకు మృత్యువుతో పోరాడి ఓడిపోయారు తారకరత్న.
తారకరత్నకు భార్య అలేఖ్యరెడ్డి, ఓ కూతురు ఉన్నారు. ఎన్టీఆర్ కొడుకు, ఛాయాగ్రాహకుడు నందమూరి మోహనకృష్ణ తనయుడైన తారకరత్నకు చిన్నప్పటి నుంచీ సినిమాలంటే ఇష్టం. బాలకృష్ణ ప్రోత్సాహంతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ‘ఒకటో నెం. కుర్రాడు’ చిత్రంతో హీరోగా వెండితెరపైకి రంగప్రవేశం చేశారు. తారకరత్న హీరోగా దాదాపుగా 20 చిత్రాల్లో నటించారు. పలు సినిమాల్లో ప్రతినాయకుడి పాత్రల్లో కనిపించి అలరించారు. ‘అమరావతి’ సినిమా ఆయనకు ఉత్తమ విలన్గా నంది అవార్డును తీసుకొచ్చింది. ఈ చిత్రం 2009లో విడుదలైంది. తారకరత్న 2022లో ఓటీటీకి ఎంట్రీ ఇచ్చారు. ‘9 అవర్స్’ (9 Hours) వెబ్సిరీస్లో నటించారు. చివరిగా ‘సారధి’ మూవీలో కనిపించారు. (ఏజెన్సీలు)
రేవంత్ రెడ్డి సంతాపం
నందమూరి వారసులు, ప్రముఖ సినీ నటులు నందమూరి తారక రత్న మృతి పట్ల టీపీసీసీ అధ్యక్షులు ఎంపీ రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తారకరత్న మరణ వార్త నన్ను చాలా కలచివేసింది. ఆయన మృతి పట్ల నా ప్రగాఢ సంతాపం. రేవంత్ రెడ్డి. చిన్న వయసులోనే సినీ రంగంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న తారకరత్న మరణం సినీ రంగానికి తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నా. తారకరత్న కుటుంబానికి నా ప్రగడా సానుభూతి తెలియజేస్తున్న.
ఎంపీ బండి సంజయ్ సంతాపం
సినీనటుడు, టీడీపీ నాయకుడు నందమూరి తారకరత్న మరణం బాధాకరం. తారకరత్న ఆత్మకు శాంతి కలిగించాలని భగవంతుడుని ప్రార్థిస్తున్నా. కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా.
‘యువగళం’ పాదయాత్ర…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ‘యువగళం’ పాదయాత్ర మొదటి రోజున అనగా జనవరి 27 తారకరత్న కూడా పాల్గొన్నారు. లోకేష్, బాలయ్య బాబాయ్తో కలిసి నడుస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయారు తారకరత్న. ఆయన్ను గమనించిన కార్యకర్తలు బాలయ్యకు విషయం చెప్పగానే హుటాహుటిన కుప్పంలోని కేసీ ఆస్పత్రికి తరలించారు. తీవ్ర హార్ట్స్ట్రోక్ కావడంతో యాంజియోప్లాస్టీ నిర్వహించిన తర్వాత కుప్పంలోని ప్రముఖ పీఈఎస్కు ఆస్పత్రికి తరలించారు. అక్కడ కూడా ఆరోగ్యం మెరుగుకాకపోవడంతో అర్ధరాత్రి కుప్పం నుంచి బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రికి తరలించారు.
కేసీ ఆస్పత్రిలో చేర్చింది మొదలుకునే అర్ధరాత్రి బెంగళూరుకు తరలించే వరకు నిద్రాహారాలు మాని తారకరత్న వెంటే ఉంటూ అన్నీ తానై చూసుకున్నారు బాలయ్య. అంతేకాదు బెంగళూరులో చికిత్స పొందుతున్నప్పటి నుంచి ఒకట్రెండు సార్లు ఇంటికి వచ్చారంతే.. మిగిలిన 20 రోజులు అక్కడే ఉండి తారకరత్నకు మెరుగైన వైద్యం అందించేందుకు చాలా తాపత్రయపడ్డారు. అటు డాక్టర్లతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ వివరాలు అడిగి తెలుసుకుంటూ ఇటు కుటుంబ సభ్యులకు ధైర్యం చెబుతూ వచ్చారు బాలయ్య. అభిమానులకు సైతం భరోసానిస్తూ చెక్కుచెదరని మనో నిబ్బరాన్ని ప్రదర్శించారు.