‘నవగుంజర–ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో ప్రజా సంబంధాలు’ ఇతివృత్తంతో సదస్సు, ఎప్పుడు-ఎక్కడ చదవండి ఈ వార్త

భువనేశ్వర్ : ఒడిశా గవర్నర్ డా. హరిబాబు కంభంపాటి గురువారం రాజ్‌భవన్, భువనేశ్వర్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో 48వ అఖిల భారత ప్రజా సంబంధాల సదస్సు–2026 (AIPRC-2026) అధికారిక పోస్టర్ మరియు బ్రోచర్‌ను ఆవిష్కరించారు. పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా (PRSI) ఆధ్వర్యంలో, PRSI భువనేశ్వర్ చాప్టర్ ఆతిథ్యంలో ఈ మూడు రోజుల జాతీయ సదస్సు 2026 డిసెంబర్ 25 నుంచి 27 వరకు భువనేశ్వర్‌లో నిర్వహించబడుతుంది.

పోస్టర్, బ్రోచర్‌ను ఆవిష్కరించిన సందర్భంగా గవర్నర్ డా. హరిబాబు కంభంపాటి మాట్లాడుతూ, దాదాపు ఐదు దశాబ్దాల చరిత్ర కలిగిన అఖిల భారత ప్రజా సంబంధాల సదస్సుకు తొలిసారిగా ఒడిశా ఆతిథ్యం ఇవ్వడం ఎంతో గర్వకారణమన్నారు. ఒడిశా సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకగా నిలిచే ‘నవగుంజర’ భావనను, కృత్రిమ మేధస్సు తీసుకువస్తున్న పరివర్తనాత్మక అవకాశాలతో అనుసంధానం చేయడం ఎంతో సముచితమన్నారు. ఈ ప్రతిష్ఠాత్మక సదస్సు విజయవంతం కావాలని PRSI, PRSI భువనేశ్వర్ చాప్టర్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

దేశవ్యాప్తంగా కమ్యూనికేషన్ రంగ నిపుణులను, ప్రతినిధులను భువనేశ్వర్‌కు స్వాగతించేందుకు తాను ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని పేర్కొన్నారు. అఖిల భారత ప్రజా సంబంధాల సదస్సు చరిత్రలో తొలిసారిగా ఒడిశా ఈ ప్రతిష్ఠాత్మక జాతీయ సదస్సుకు ఆతిథ్యం ఇస్తోంది. దేశవ్యాప్తంగా ప్రజా సంబంధాలు, కార్పొరేట్ కమ్యూనికేషన్, మీడియా, ప్రభుత్వం, వ్యాపార రంగం, విద్యా రంగం తదితర అనుబంధ రంగాలకు చెందిన ప్రముఖులు ఈ సదస్సులో పాల్గొననున్నారు.

“నవగుంజర – ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో ప్రజా సంబంధాలు” అనే ప్రధాన ఇతివృత్తంతో ఈ సదస్సు జరగనుంది. ఒడిశా ప్రసిద్ధ నవగుంజర ప్రతీక స్ఫూర్తితో రూపొందించిన ఈ ఇతివృత్తం, విభిన్న రూపాలు ఒకే సమగ్ర రూపంగా కలిసే భావనను ప్రతిబింబిస్తుంది. సాంకేతికత ఆధారిత కమ్యూనికేషన్ వాతావరణంలో విశ్వాసం, విశ్వసనీయత, ప్రతిష్ఠను నిర్మించేందుకు మానవ మేధస్సు, కృత్రిమ మేధస్సు, సృజనాత్మకత, నైతిక విలువలు, సాంస్కృతిక అవగాహన, మానవీయత సమన్వయం అవసరమనే సందేశాన్ని ఈ ఇతివృత్తం అందిస్తుంది.

Also Read-

ఈ కార్యక్రమంలో PRSI జాతీయ అధ్యక్షులు డా. అజిత్ పాఠక్, సెక్రటరీ జనరల్ డా. పి. ఎల్.కె. మూర్తి, సదస్సు కన్వీనర్ డా. సంజయ్ కుమార్ సాహూ, కో-కన్వీనర్ శ్రీ కృష్ణ చంద్ర మహాపాత్ర, భువనేశ్వర్ చాప్టర్ ట్రెజరర్ అన్సుమన్ పట్నాయక్ తదితర జాతీయ, ప్రాంతీయ ప్రతినిధులు పాల్గొన్నారు.

PRSI జాతీయ అధ్యక్షులు డా. అజిత్ పాఠక్ మాట్లాడుతూ, కృత్రిమ మేధస్సు అందిస్తున్న అవకాశాలను AIPRC-2026 సమగ్రంగా చర్చించడంతో పాటు, ప్రజా సంబంధాల రంగంలో అత్యంత కీలకమైన నైతిక, సాంస్కృతిక, మానవీయ విలువలను పునరుద్ఘాటిస్తుందని అన్నారు. గొప్ప సాంస్కృతిక వారసత్వంతో పాటు సాంకేతిక అభివృద్ధి, ఆవిష్కరణలకు కేంద్రంగా ఎదుగుతున్న భువనేశ్వర్ ఈ జాతీయ స్థాయి చర్చకు అత్యంత అనువైన వేదిక అని పేర్కొన్నారు.

AIPRC-2026 లో వృత్తిపరమైన జ్ఞానం, సాంకేతిక ఆవిష్కరణలతో పాటు ఒడిశా ప్రత్యేక సాంస్కృతిక వారసత్వం, కళలు, సంప్రదాయాలు, ఆతిథ్యాన్ని ఆస్వాదించే అవకాశం కూడా ప్రతినిధులకు లభించనుంది. ఈ నేపథ్యంలో వృత్తి నైపుణ్యం, సాంకేతిక విజ్ఞానం, సాంస్కృతిక వైవిధ్యాల సమ్మేళనంగా నిలవనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

Archives

Categories

Meta

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

X