హైదరాబాద్ : సినీ నిర్మాత బండ్ల గణేష్ కుమార్తె వివాహ వేడుకకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులను ఆశీర్వదించి, వారి వైవాహిక జీవితం సుఖసంతోషాలతో సాగాలని ఆకాంక్షించారు.

Also Read-
వివాహ వేడుకలో నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపి, కుటుంబ సభ్యులతో ఆత్మీయంగా ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, సినీ మరియు రాజకీయ రంగాలకు చెందిన నాయకులు పాల్గొని నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.
